NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Vizag: వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీకి షాక్‌.. రూ.44.74 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ 
    తదుపరి వార్తా కథనం
    Vizag: వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీకి షాక్‌.. రూ.44.74 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ 
    వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీకి షాక్‌.. రూ.44.74 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ

    Vizag: వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీకి షాక్‌.. రూ.44.74 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 07, 2025
    04:42 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆయన ఆడిటర్ జీవీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) భారీ షాక్ ఇచ్చింది.

    హయగ్రీవ ఫామ్స్‌కు చెందిన రూ.44.74 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది.

    హయగ్రీవ భూముల అమ్మకాల్లో ఎంవీవీ, ఆయన ఆడిటర్ జీవీ, అలాగే మేనేజింగ్ పార్టనర్ గద్దె బ్రహ్మాజీలు కీలక పాత్ర పోషించినట్లు ఈడీ తన దర్యాప్తులో వెల్లడించింది.

    ప్లాట్లు విక్రయించి దాదాపు రూ.150 కోట్లు సంపాదించినట్లు గుర్తించింది.

    గతేడాది అక్టోబరులో ఎంవీవీ, జీవీ నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది.

    ఆ సోదాల సందర్భంగా నకిలీ పత్రాలను తయారు చేసే డిజిటల్ పరికరాలు, వివిధ కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది.

    వివరాలు 

    హయగ్రీవ భూముల్లో కుంభకోణం 

    విశాఖపట్టణంలోని హయగ్రీవ భూముల్లో చోటుచేసుకున్న కుంభకోణాన్ని ఈడీ బట్టబయలు చేసింది.

    వృద్ధులు, అనాథల సేవల కోసం కేటాయించిన భూములను వైసీపీ నేతలు అక్రమంగా స్వాధీనం చేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది.

    ఎండాడలోని హయగ్రీవ ప్రాజెక్టుకు సంబంధించిన 12.51 ఎకరాల భూమిని మోసపూరితంగా కబ్జా చేసినట్లు గతేడాది జూన్ 22న చిలుకూరు జగదీశ్వరుడు, ఆయన భార్య రాధారాణి ఆరిలోవ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

    ఆ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్‌ ఆధారంగా ఈడీ దర్యాప్తును ప్రారంభించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    వైసీపీ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ

    Rajasthan: లంచం ఆరోపణలపై ఇద్దరు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్   రాజస్థాన్
    రాజస్థాన్‌: జల్ జీవన్ మిషన్ లింక్ మనీ లాండరింగ్ కేసులో 25 చోట్ల దాడులు రాజస్థాన్
    Delhi: హీరో మోటోకార్ప్ చైర్మన్ పవన్ ముంజాల్ ఆస్తులను జప్తు చేసిన ఈడీ భారతదేశం
    Neville Singham : అమెరికన్ మిలియనీర్ నెవిల్లే సింఘమ్‌కు షాక్.. సమన్లు జారీ చేసిన ఈడీ   భారతదేశం

    వైసీపీ

    Kapu Reservation: కాపుల రిజర్వేషన్‌ హామీని అమలు చేయండి.. సీఎం, డిప్యూటీ సీఎంలకు హరిరామ జోగయ్య లేఖ చంద్రబాబు నాయుడు
    Vijayasai Reddy: రాజకీయాలకు గుడ్‌బై.. రాజ్యసభకు విజయసాయి రెడ్డి రాజీనామా విజయసాయిరెడ్డి
    Sake Sailajanath: నేడు వైసీపీలోకి మాజీ మంత్రి శైలజానాథ్.. పార్టీలోకి ఆహ్వానించనున్న వైఎస్ జగన్  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025