NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / cheetahs: బోట్స్‌వానా నుండి భారతదేశానికి ఎనిమిది చిరుతలు.. మొదటి నాలుగు మేలో..
    తదుపరి వార్తా కథనం
    cheetahs: బోట్స్‌వానా నుండి భారతదేశానికి ఎనిమిది చిరుతలు.. మొదటి నాలుగు మేలో..
    బోట్స్‌వానా నుండి భారతదేశానికి ఎనిమిది చిరుతలు.. మొదటి నాలుగు మేలో..

    cheetahs: బోట్స్‌వానా నుండి భారతదేశానికి ఎనిమిది చిరుతలు.. మొదటి నాలుగు మేలో..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 19, 2025
    10:41 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దక్షిణ ఆఫ్రికాలోని బోట్స్‌వానా దేశం నుంచి మరో ఎనిమిది చిరుత పులులు భారత్‌కు రానున్నాయి.

    ఈ చిరుతలను రెండు విడతల్లో తరలించనున్నట్లు జాతీయ పులుల సంరక్షణ అధికారం (ఎన్‌టీసీఏ) మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి తెలియజేసింది.

    తొలి విడతగా మే నెలలో నాలుగు చిరుతలు భారత్‌కు చేరుకోనున్నాయని అధికారులు వెల్లడించారు.

    అనంతరం మరో నాలుగు చిరుతలను కూడా భారత్‌కు తరలించనున్నట్లు తెలిపారు.

    ఈ అంశంపై భోపాల్‌లో నిర్వహించిన చిరుత ప్రాజెక్ట్ సమీక్ష సమావేశంలో కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రి భూపేంద్ర యాదవ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నేతృత్వంలో జరిగిన చర్చలలో ఎన్‌టీసీఏ అధికారులు ఈ వివరాలను వెల్లడించినట్లు సమాచారం.

    వివరాలు 

    చిరుత ప్రాజెక్ట్‌పై రూ.112 కోట్లకు పైగా వ్యయం

    ఇప్పటివరకు దేశంలో చిరుత ప్రాజెక్ట్‌పై రూ.112 కోట్లకు పైగా వ్యయం చేసినట్లు అధికారులు తెలిపారు.

    ఇందులో 67 శాతం నిధులు మధ్యప్రదేశ్‌లో చిరుతల పునరావాస కార్యక్రమాలకు వినియోగించినట్లు వివరించారు.

    'ప్రాజెక్ట్ చీతా' కింద, రాజస్థాన్ సరిహద్దుకు ఆనుకొని ఉన్న గాంధీ సాగర్ అభయారణ్యంలోకి చిరుతలను దశలవారీగా తరలించనున్నట్టు చెప్పారు.

    ఈ నేపథ్యంలో, మధ్యప్రదేశ్‌-రాజస్థాన్ రాష్ట్రాల మధ్య అంతర్-రాష్ట్ర చిరుత సంరక్షణ మేఘాలయ స్థాపనకు సూత్రప్రాయంగా ఒప్పందం కుదిరినట్లు అధికారులు పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మధ్యప్రదేశ్

    తాజా

    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌
    #NewsBytesExplainer: అంతరిక్షం నుండి కనిపించే ఏకైక మానవ నిర్మాణం ... ఎక్కడ ఉందంటే..? అంతరిక్షం

    మధ్యప్రదేశ్

    Ramniwas Rawat: కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ.. బీజేపీలో చేరిన మాజీ మంత్రి రాంనివాస్ రావత్  భారతదేశం
    MadhyaPradesh : ఓటు వేసిన బీజేపీ నాయకుడి మైనర్ కుమారుడు.. పోలింగ్ టీం సస్పెండ్.. ఎఫ్ఐఆర్ నమోదు  భోపాల్
    Indore Road Accident: ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి  రోడ్డు ప్రమాదం
    Gwalior: గ్వాలియర్‌లో ర్యాగింగ్ కలకలం.. మండే ఎండలో గంటల తరబడి మోకాళ్లపై కూర్చోపెట్టి ..  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025