Parliament Security Breach:8 మంది సిబ్బందిని సస్పెండ్ చేసిన లోక్ సభ సెక్రటేరియట్
పార్లమెంట్లో బుధవారం భద్రతా వైఫల్యంతో ఇద్దరు ఆగంతుకులు లోక్సభ పబ్లిక్ గ్యాలరీ నుంచి సభలోకి దూకిన ఘటనలో ఎనిమిది మంది సిబ్బందిని లోక్సభ సెక్రటేరియట్ సస్పెండ్ చేసింది. సస్పెన్షన్కు గురైన సిబ్బందిని రాంపాల్, అరవింద్, వీర్ దాస్, గణేష్, అనిల్, పర్దీప్, విమిత్ అడ్ నరేండేగా గుర్తించారు. ఢిల్లీ పోలీసులు మొత్తం ఆరుగురు నిందితులను పట్టుకుని, పార్లమెంటు భద్రతను ఉల్లంఘించినందుకు కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టం, చట్టవిరుద్ధ కార్యకలాపాల (నిరోధక) చట్టం (UAPA) కింద అభియోగాలు మోపారు. 2001 పార్లమెంటు ఉగ్రదాడి 22వ వార్షికోత్సవం సందర్భంగా, ఇద్దరు వ్యక్తులు సందర్శకుల గ్యాలరీ నుండి లోక్సభ ఛాంబర్లోకి దూకి టియర్ గ్యాస్ విడుదల చేశారు. దీని కారణంగా ఆవరణలో పొగ వ్యాపించింది.