NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Electric Buses: విశాఖ వాసులకు శుభవార్త.. ఎలక్ట్రిక్ బస్సులొచ్చేస్తున్నాయ్!
    తదుపరి వార్తా కథనం
    Electric Buses: విశాఖ వాసులకు శుభవార్త.. ఎలక్ట్రిక్ బస్సులొచ్చేస్తున్నాయ్!
    విశాఖ వాసులకు శుభవార్త.. ఎలక్ట్రిక్ బస్సులొచ్చేస్తున్నాయ్!

    Electric Buses: విశాఖ వాసులకు శుభవార్త.. ఎలక్ట్రిక్ బస్సులొచ్చేస్తున్నాయ్!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 12, 2023
    01:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అధికార యంత్రాంగం విశాఖ అభివృద్ధిపై దృష్టి సారిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దసరా నుంచి వైజాగ్ కేంద్రంగా పాలన ప్రారంభించనున్నారు.

    ఈ నేపథ్యంలో విశాఖపట్టణం రోడ్లపై త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెట్టనున్నాయి.

    మూడు నెలల్లోనే ఈ లక్ష్యాన్ని పూర్తి చేశామని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు.

    ఇప్పటికే తిరుపతి నుంచి కొండపైకి విద్యుత్ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి.

    రాష్ట్రంలోని పెద్ద నగరాల్లోనూ ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేందుకు సన్మాహాలు జరుగుతున్నాయి.

    విశాఖకు తొలి విడతలో 100 ఎలక్ట్రిక్ బస్సులను నడిపేందుకు ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) సిద్ధమవుతోంది.

    మలి విడతలో మరో 100 బస్సులను తీసుకొచ్చేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది.

    Details

    సిటీ సర్విసులుగానే ఎలక్ట్రిక్ బస్సులు

    సిటీ సర్విసులుగానే ఎలక్ట్రిక్ బస్సులు నడపనున్నారు. వీటికోసం సింహపురి, గాజువాక డిపోలను ఎపీఎస్ ఆర్టీసీ ఎంపిక చేసింది.

    సింహపురి, గాజువాక డిపోల్లో బస్సులకు అవసరమయ్యే ఛార్జింగ్ ఏర్పాట్లు చేయనున్నారు.

    బ్యాటరీ నడిచే ఈ బస్సులు గతంలో 150 కిలోమీటర్లు తిరగడానికి మాత్రమే ఛార్జింగ్ ఉండేది.

    ఇక నగర పరిధిలోని బస్సులు రోజుకు 250 నుంచి గరిష్టంగా 400 కిలోమీటర్ల వరకు తిరుగుతున్నాయి.

    తొలుత వచ్చే ఎలక్ట్రిక్ బస్సులు తక్కువ కిలోమీటర్ల రూటుల్లో తిప్పాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.

    విశాఖ నగర పరిధిలోని ఏడు డిపోల్లో ప్రస్తుతం 525 సిటీ బస్సులున్నాయి. డీజల్ బస్సుల స్థానంలో విద్యుత్ బస్సులు అందుబాటులోకి వస్తే నగరంలో కాలుష్యాన్ని నివారించవచ్చు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఏపీఎస్ఆర్టీసీ
    విశాఖపట్టణం

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    ఏపీఎస్ఆర్టీసీ

    APSRTC: పాడేరు, అరకులోయ, బొర్రా గుహలకు 'ఏపీఎస్ఆర్టీసీ' ప్రత్యేక టూర్ ప్యాకేజీ  ఆంధ్రప్రదేశ్
    ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. ఒకే టికెట్‌తో రెండు బస్సుల్లో ప్రయాణం ధర

    విశాఖపట్టణం

    ఉగాదికి ముహూర్తం: కొత్త రాజధాని వైజాగ్‌కు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ షిఫ్ట్! వై.ఎస్.జగన్
    మనసును కదిలించే సంఘటన: భార్య మృతదేహాన్ని భూజాలపై మోసుకుంటూ కాలిననడకన ఒడిశాకు.. ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ: బీబీనగర్‌లో పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్ తెలంగాణ
    విశాఖపట్నంలో 'గ్లోబల్ టెక్ సమ్మిట్'- వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025