NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: 'పవర్‌ పూలింగ్‌' విధానంతో కరెంటు కొనుగోలు వ్యయం తగ్గించాలి.. డిస్కంలకు ప్రభుత్వ సూచన
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Telangana: 'పవర్‌ పూలింగ్‌' విధానంతో కరెంటు కొనుగోలు వ్యయం తగ్గించాలి.. డిస్కంలకు ప్రభుత్వ సూచన
    పవర్‌ పూలింగ్‌' విధానంతో కరెంటు కొనుగోలు వ్యయం తగ్గించాలి.. డిస్కంలకు ప్రభుత్వ సూచన

    Telangana: 'పవర్‌ పూలింగ్‌' విధానంతో కరెంటు కొనుగోలు వ్యయం తగ్గించాలి.. డిస్కంలకు ప్రభుత్వ సూచన

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 14, 2025
    01:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థలకు (డిస్కంలకు) 'పవర్‌ పూలింగ్‌' విధానాన్ని అమలు చేసి విద్యుత్‌ కొనుగోలు వ్యయాన్ని తగ్గించాలని సూచించింది.

    రోజువారీ విద్యుత్‌ కొనుగోలు ఖర్చులు పెరుగుతుండడంతో, డిస్కంలు దీనికి ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాయి.

    దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో విద్యుత్‌ డిమాండ్‌ ఏ నెలల్లో అధికంగా ఉంటుందనే అంశాన్ని విశ్లేషించి, నివేదికను ప్రభుత్వానికి అందజేశాయి.

    ఈ నివేదిక ప్రకారం, తెలంగాణలో ప్రాముఖ్యత గల నెలలు సెప్టెంబరు, అక్టోబరు, ఫిబ్రవరి, మార్చి మాత్రమే కాగా, మిగిలిన ఎనిమిది నెలల్లో విద్యుత్‌ డిమాండ్‌ తక్కువగా ఉంటుంది.

    ఇదే విధంగా, ఇతర రాష్ట్రాల్లో కూడా కొన్ని నెలల్లోనే విద్యుత్‌ వినియోగం అధికంగా ఉంటుంది.

    వివరాలు 

    మన వద్ద డిమాండ్‌ లేనప్పుడు ఇవ్వాలి 

    ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని,తెలంగాణలో విద్యుత్‌ అవసరం తక్కువగా ఉన్న నెలల్లో అదనంగా ఉండే విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు సరఫరా చేయాలని, అదే విధంగా అధిక డిమాండ్‌ నెలల్లో అవే రాష్ట్రాల నుండి తిరిగి విద్యుత్‌ను అందుకునే విధంగా డిస్కంలు నిర్ణయం తీసుకున్నాయి.

    ఈ విధానం ద్వారా అత్యధిక డిమాండ్‌ ఉన్న రోజుల్లో భారత ఇంధన ఎక్స్ఛేంజ్‌ (IEX) ద్వారా అధిక ధరలకు విద్యుత్‌ కొనుగోలు చేసే అవసరం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.

    వివరాలు 

    24,505 మిలియన్‌ యూనిట్లు మిగులు

    వచ్చే ఆర్థిక సంవత్సరం(2025-26)లో తెలంగాణలో 1,23,319 మిలియన్‌ యూనిట్ల (MU) విద్యుత్‌ ఉత్పత్తి అందుబాటులో ఉండగా,రాష్ట్ర అవసరాలు 98,319 మిలియన్‌ యూనిట్లు మాత్రమే కావడంతో, సరఫరా నష్టాలను పోను 24,505 మిలియన్‌ యూనిట్లు మిగులుతాయని డిస్కంలు అంచనా వేశాయి.

    ఈ విధంగా 'పవర్‌ పూలింగ్‌' విధానాన్ని అనుసరించడం ద్వారా విద్యుత్‌ వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించి, ఖర్చులను తగ్గించుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    తెలంగాణ

    Ration Card: తెలంగాణలో రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియ.. మీసేవా పోర్టల్‌లో ఎలా అప్లై చేయాలి? లైఫ్-స్టైల్
    Budget 2025: వచ్చే నెల 1న కేంద్ర బడ్జెట్‌.. కొత్త రైల్వే మార్గాల ప్రాజెక్టులకు నిధులు దక్కేనా..! బడ్జెట్‌ 2025
    MLC Elections: ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల ఎన్నికల సంఘం
    Tenth Students: తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివే విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025