Page Loader
Andhra Pradesh: పెట్రోల్‌ బంకుల ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు
పెట్రోల్‌ బంకుల ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు

Andhra Pradesh: పెట్రోల్‌ బంకుల ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 16, 2025
11:04 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ లో మహిళల ఆర్థిక సాధికారతను పెంపొందించేందుకు ప్రభుత్వం కొత్త అడుగు వేసింది. పట్టణ స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో తొలిసారిగా పెట్రోల్‌ బంకులను ఏర్పాటు చేయనున్నట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. వ్యాపార రంగంలో మహిళలు నిలదొక్కుకొని ఆదాయాన్ని పెంచుకునేందుకు ఈ ప్రత్యేక యోజనను చేపడుతోంది. మొదటి దశలో రాష్ట్రవ్యాప్తంగా 25 జిల్లాల్లో ఒక్కొక్క బంకును ఏర్పాటు చేయనున్నారు. వీటికి అవసరమయ్యే పెట్టుబడిని స్వయం సహాయక సంఘాల పొదుపు మొత్తాల నుంచే వినియోగించనున్నారు. మరోవైపు ప్రభుత్వం బంకుల కోసం అవసరమైన భూమిని కేటాయించి, వ్యాపార అభివృద్ధికి అవసరమైన సహకారం అందించనుంది.

Details

పెట్రోల్‌ బంకుల నిర్వహణకు ఆయిల్‌ కంపెనీల అనుమతి

పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) రూ.6 వేల కోట్లకు పైగా ఉన్న సంఘాల పొదుపులను సమర్థంగా వినియోగించేందుకు కొత్త కార్యక్రమాలను రూపొందిస్తోంది. ఇంతకుముందు మహిళల కోసం ద్విచక్రవాహనాలు, ఆటోలను అందించి వాటిని అద్దెకు ఇవ్వేందుకు ర్యాపిడో సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చింది మెప్మా. ఇకపై నగరాల్లో స్మార్ట్‌ స్ట్రీట్‌ వెండింగ్‌ మార్కెట్లు కూడా ఏర్పాటు చేయనుంది. ఇప్పుడు పెట్రోల్‌ బంకుల నిర్వహణకు ఆయిల్‌ కంపెనీల అనుమతులను కూడా పొందుతోంది. ఇక ఈ బంకుల ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని గుర్తించి, సేకరించేందుకు పురపాలక సంస్థలు, నగరపాలక సంస్థ కమిషనర్లు, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్లకు ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది.