
Rahul Gandhi: ప్రపంచంతో పోటీ పడే ప్రతి విద్యార్థి ఆంగ్ల భాష నేర్చుకోవాలి : రాహుల్ గాంధీ
ఈ వార్తాకథనం ఏంటి
విదేశీ భాషలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఇంగ్లీషులో మాట్లాడేవారు భవిష్యత్లో సిగ్గుపడే రోజులు వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
అలాంటి సమాజం ఏర్పడే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు.
అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ, ఆంగ్ల భాషను నేర్చుకోవడంలో ఏ మాత్రం తప్పులేదని స్పష్టంగా తెలిపారు.
విద్యార్థుల శక్తి సాధికారతకు ఆ భాష ఓ సాధనమని వివరించారు.
మాతృభాషను ప్రోత్సహించడం ఎంత అవసరమో, అదే స్థాయిలో ఆంగ్ల భాషను కూడా విద్యార్థులకు నేర్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఆంగ్ల భాష ద్వారా విద్యార్థులు విశ్వాసాన్ని పెంపొందించుకుంటారు, ఉపాధి అవకాశాలు పొందుతారు అని చెప్పారు.
వివరాలు
మాతృభాష ఎంత ముఖ్యమో, ఆంగ్ల భాష కూడా అంతే కీలకం
రాహుల్ గాంధీ, భారతీయ జనతా పార్టీ (భాజపా), రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లపై విమర్శలు గుప్పించారు.
పేదల పిల్లలు ఉన్నత విద్యను సాధించి సమానత్వం పొందటం వారికి ఇష్టం లేదని ఆరోపించారు.
అందుకే వాళ్లకు చదువు దూరం చేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
మాతృభాష ఎంత ముఖ్యమో, ఆంగ్ల భాష కూడా విద్యార్ధుల భవిష్యత్తు కోసం అంతే కీలకమని స్పష్టం చేశారు.
భారతదేశంలోని ప్రతి భాషలో ఆత్మ, సంస్కృతి, జ్ఞానం అంతర్లీనంగా ఉంటాయని, వాటిని గౌరవించాల్సిన అవసరం ఉందని వివరించారు.
అయితే ప్రపంచ పోటీకి విద్యార్థులను సిద్ధం చేయాలంటే, ఆంగ్ల విద్య అందుబాటులో ఉండాల్సిందేనని అన్నారు.
వివరాలు
విదేశీ భాషలు ఉపయోగపడవు: అమిత్ షా
ఒక కార్యక్రమంలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలలో, భారతదేశం గురించి, మన సంస్కృతి గురించి తెలుసుకునేందుకు విదేశీ భాషలు ఉపయోగపడవని ఆయన అభిప్రాయపడ్డారు.
సంపూర్ణ భారతీయతను విదేశీ భాషలతో వ్యక్తీకరించడం సాధ్యం కాదని పేర్కొన్నారు.
ఇది సాధించటం సవాలుతో కూడుకున్నదేనని ఆయన ఒప్పుకున్నప్పటికీ, భారత సమాజం దీన్ని సాధించగలదన్న నమ్మకం తనకు ఉందని అన్నారు.