NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: 'దేశ రక్షణలో ప్రతి భారతీయుడు భాగస్వామి కావాలి'.. మన్‌కీ బాత్‌లో మోదీ పిలుపు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    PM Modi: 'దేశ రక్షణలో ప్రతి భారతీయుడు భాగస్వామి కావాలి'.. మన్‌కీ బాత్‌లో మోదీ పిలుపు
    'దేశ రక్షణలో ప్రతి భారతీయుడు భాగస్వామి కావాలి'.. మన్‌కీ బాత్‌లో మోదీ పిలుపు

    PM Modi: 'దేశ రక్షణలో ప్రతి భారతీయుడు భాగస్వామి కావాలి'.. మన్‌కీ బాత్‌లో మోదీ పిలుపు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 25, 2025
    01:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే పోరాటంలో భారత దళాలు చూపిన ధైర్యసాహసాలు దేశ ప్రజలందరినీ గర్వపడేలా చేశాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

    ఆదివారం ప్రసారమైన 122వ మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా భారత్ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత తొలిసారిగా మోదీ ఈ కార్యక్రమంలో మాట్లాడారు.

    ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ దేశవ్యాప్తంగా కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది.

    మన జవాన్లు చూపిన అపార ధైర్యం ప్రతి భారతీయుడిలో దేశభక్తిని రెట్టింపుచేసింది. ఈ ఘటన అనేక కుటుంబాలను ప్రభావితం చేసింది.

    Details

    ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశమొత్తం ఏకమైంది

    ఆపరేషన్‌ జరిగిన సమయంలో జన్మించిన శిశువులకు పలువురు 'సిందూర్‌' అనే పేరును పెట్టడం అనేది స్ఫూర్తిదాయకం.

    దేశం మొత్తం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒకటై నిలిచింది. ఇప్పుడు ప్రతి భారతీయుడు దేశ రక్షణలో తన వంతు భాగస్వామ్యం కోరుకుంటున్నాడని ప్రధాని పేర్కొన్నారు.

    ఆపరేషన్‌ సిందూర్‌ కేవలం ఒక సైనిక చర్య మాత్రమే కాదు, అది ధైర్యానికి, దేశభక్తికి నిలువెత్తు ఉదాహరణగా మోదీ అభివర్ణించారు.

    అనేక గ్రామాలు, పట్టణాల్లో తిరంగ యాత్రలు నిర్వహించబడటంతోపాటు, పౌర రక్షణ వాలంటీర్లుగా యువత ముందుకు రావడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

    ఈ సందర్భంగా ప్రధాని మావోయిస్టుల హింసాత్మక కార్యకలాపాలపై కూడా మాట్లాడారు.

    Details

    దేశం గర్వించే స్థాయిలో విజయం సాధించింది

    "నక్సలిజానికి వ్యతిరేకంగా దేశం గర్వించే స్థాయిలో విజయం సాధించింది.

    దంతెవాడ ఆపరేషన్‌లో జవాన్లు చూపిన సాహసం అభినందనీయం. మావోయిస్టుల హింస గతంలోతో పోలిస్తే గణనీయంగా తగ్గిందని తెలిపారు.

    అంతేకాదు, తెలంగాణలో సంగారెడ్డి మహిళలు వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం ద్వారా సాధిస్తున్న అభివృద్ధిని ప్రధాని ప్రస్తావించారు.

    "ఈ మార్పు గమనించదగ్గది. ఆధునిక సాంకేతికతను అపూర్వంగా వినియోగిస్తూ దేశ వ్యవసాయ రంగంలో మహిళల పాత్ర పెరుగుతోందని మోదీ ప్రశంసించారు.

    ఈ మన్‌ కీ బాత్‌ ప్రసంగం మొత్తం దేశ భద్రత, దేశభక్తి, సామాజిక భాగస్వామ్యం, సాంకేతిక అభివృద్ధి అనే నాలుగు దిశలపై దృష్టి పెట్టినదిగా నిలిచింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    PM Modi: 'దేశ రక్షణలో ప్రతి భారతీయుడు భాగస్వామి కావాలి'.. మన్‌కీ బాత్‌లో మోదీ పిలుపు నరేంద్ర మోదీ
    Preity Zinta : మంచి మనసు చాటిన నటి ప్రీతి జింతా.. ఇండియన్ ఆర్మీకి భారీ సాయం! స్పోర్ట్స్
    Israel : ఇజ్రాయెల్‌ దాడిలో వైద్యురాలితో సహా 9 మంది పిల్లల మృతి  ఇజ్రాయెల్
    Niti Aayog: 4 ట్రిలియన్‌ డాలర్ల జీడీపీతో భారత్‌ నాలుగో స్థానం : నీతి ఆయోగ్‌ నీతి ఆయోగ్

    నరేంద్ర మోదీ

    PM Modi: 'రక్తం మరుగుతోంది'.. ఉగ్రవాదులకు శిక్ష తప్పదు : నరేంద్ర మోదీ జమ్ముకశ్మీర్
    Modi-Rajnath Singh: పహల్గాం దాడి.. భద్రతా అంశాలపై ప్రధానితో రాజ్‌నాథ్‌ కీలక సమావేశం  రాజ్‌నాథ్ సింగ్
    PM Modi: సీడీఎస్‌, రక్షణమంత్రి, ఎన్‌ఎస్‌ఏలతో ప్రధాని మోదీ కీలక సమావేశం  భారతదేశం
    PM Modi: సైన్యానికి పూర్తి స్వేచ్ఛ .. సీడీఎస్‌, రక్షణమంత్రి, ఎన్‌ఎస్‌ఏల సమావేశంలో ప్రధాని మోదీ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025