Page Loader
ORR: ఓఆర్‌ఆర్‌ వరకు నగర విస్తరణలో కీలక అడుగు.. భారీ సర్వేకు నడుం బిగించిన జీహెచ్‌ఎంసీ
ఓఆర్‌ఆర్‌ వరకు నగర విస్తరణలో కీలక అడుగు.. భారీ సర్వేకు నడుం బిగించిన జీహెచ్‌ఎంసీ

ORR: ఓఆర్‌ఆర్‌ వరకు నగర విస్తరణలో కీలక అడుగు.. భారీ సర్వేకు నడుం బిగించిన జీహెచ్‌ఎంసీ

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 14, 2025
09:30 am

ఈ వార్తాకథనం ఏంటి

బాహ్య వలయ రహదారి వరకు నగరాన్ని విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడంతో, జీహెచ్‌ఎంసీ భారీ స్థాయిలో సర్వే నిర్వహించేందుకు సిద్ధమైంది. దాదాపు 40 లక్షల భవనాలకు సంబంధించిన 21 రకాల వివరాలను సమగ్రంగా సంకలనం చేసి, 2050కి అనుగుణమైన మహానగర ప్రణాళికను మరింత పకడ్బందీగా రూపొందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే గ్రేటర్‌ హైదరాబాద్‌లో అమలు చేసిన జీఐఎస్‌ ఇళ్ల సర్వేను ఆదర్శంగా తీసుకుని, దాన్ని శివారు ప్రాంతాల్లోని 27 స్థానిక సంస్థల పరిధిలో విస్తరించాలని నిర్ణయించింది. అన్ని ప్రభుత్వ శాఖలు ఈ ప్రక్రియలో సహకరించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రాజెక్టును సెప్టెంబర్ 2025 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో తగిన చర్యలు చేపట్టనున్నారు.

వివరాలు 

ప్రధాన లక్ష్యాలు: 

. మొత్తం నగర నిర్మాణాలను గుర్తించి మ్యాపింగ్‌ చేయడం. . రహదారులు, తాగునీటి పైపులు, మురుగునీటి వ్యవస్థ, విద్యుత్‌ లైన్లు, పార్కులు, చెట్లు, నాలాలు, పైవంతెనలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు తదితర 21 రకాల సమాచారం సేకరణ. . మౌలిక సదుపాయాల్లోని లోపాలను గుర్తించి, వాటి అభివృద్ధికి చర్యలు తీసుకోవడం. . ఆస్తిపన్ను పరిధిలో లేని నిర్మాణాలు, పన్ను ఎగ్గొడుతున్న సంస్థలు, పరిశ్రమలను గుర్తించి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం. . డిజిటల్ ఇంటి నంబర్ల ద్వారా నగరంలోని అన్ని చిరునామాలను సులభంగా గుర్తించగల విధానం అమలు.

వివరాలు 

సర్వే ఎలా జరుగుతుంది? 

. మొదట నగరాన్ని డ్రోన్ల సహాయంతో చిత్రీకరిస్తారు, తద్వారా ప్రాథమిక పటం రూపొందుతుంది. . ఆపై జనావాసాలను మ్యాపింగ్ చేసి, వాటి సమాచారం 3D పటంలో సమీకరిస్తారు. . ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, సర్వేలో లభించిన వివరాలను ప్రభుత్వ పాలనలో వినియోగించుకోవచ్చు. ఇప్పటికే నిరూపితమైన ఫలితాలు: . గ్రేటర్‌ హైదరాబాద్ పరిధిలో 25 లక్షల ఇళ్లలో ఇప్పటికే 47,323 ఇళ్లకు GIS సర్వే పూర్తి అయ్యింది. . ఈ సర్వేలో పన్ను పరిధిలో లేని 7,098 (15%) ఇళ్లు, తక్కువ పన్ను చెల్లిస్తున్న 10,539 నిర్మాణాలు ఉన్నట్లు బయటపడింది. . దీని ద్వారా జీహెచ్‌ఎంసీకి రూ. 25.60 కోట్ల అదనపు ఆదాయం సమకూరింది.

వివరాలు 

గ్రేటర్‌ వెలుపల పరిస్థితి: 

. గూగుల్ మ్యాప్ ఆధారంగా, జీహెచ్‌ఎంసీ పరిధికి బయట 8.5 లక్షల ఇళ్లు ఉన్నట్లు అంచనా. . క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపితే, ఈ సంఖ్య 12.75 లక్షలకు పెరిగే అవకాశం ఉంది. ఈ భారీ సర్వే ద్వారా నగర అభివృద్ధికి అవసరమైన సమాచారం సమకూరనుంది. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడంతో పాటు, మౌలిక వసతుల అభివృద్ధికి ఇది కీలక పాత్ర పోషించనుంది.