NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 1984 anti-Sikh riots:1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులోదోషిగా తేలిన కాంగ్రెస్ మాజీ ఎంపీ  
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    1984 anti-Sikh riots:1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులోదోషిగా తేలిన కాంగ్రెస్ మాజీ ఎంపీ  
    1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులోదోషిగా తేలిన కాంగ్రెస్ మాజీ ఎంపీ

    1984 anti-Sikh riots:1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులోదోషిగా తేలిన కాంగ్రెస్ మాజీ ఎంపీ  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 12, 2025
    03:14 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ మాజీ పార్లమెంట్ సభ్యుడు సజ్జన్ కుమార్ దోషిగా తేలినట్లు ఢిల్లీ కోర్టు బుధవారం తీర్పునిచ్చింది.

    1984లో సిక్కుల ఊచకోత సమయంలో సరస్వతి విహార్ ప్రాంతంలో జరిగిన రెండు హత్యలకు సజ్జన్ కుమార్ ప్రమేయం ఉన్నట్లు కోర్టు వెల్లడించింది.

    ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా ఈ తీర్పును ఇచ్చారు. ఫిబ్రవరి 18న తుది శిక్ష ప్రకటించనున్నారు. అదే రోజు శిక్షాకాలాన్ని కూడా నిర్ణయిస్తారు.

    ఈ కేసులో విచారణ నిమిత్తం సజ్జన్ కుమార్‌ను తీహార్ జైలు నుండి కోర్టుకు హాజరుపరిచారు.

    వివరాలు 

    పంజాబీ బాగ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు 

    ఈ కేసు 1984 నవంబర్ 1న జస్వంత్ సింగ్, అతని కుమారుడు తరణ్ దీప్ సింగ్ హత్యలకు సంబంధించినది.

    మొదట ఈ ఘటనపై పంజాబీ బాగ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

    అనంతరం ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)కు అప్పగించారు.

    డిసెంబర్ 16, 2021న కోర్టు సజ్జన్ కుమార్‌పై అభియోగాలు మోపింది మరియు అతని ప్రమేయం ఉన్నట్లు తేల్చింది.

    వివరాలు 

    ప్రాసిక్యూషన్ ప్రకారం

    1984లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు భారీ స్థాయిలో సాయుధ గుంపులు రెచ్చిపోయాయి.

    వారు దోపిడీలు, హత్యలు, సిక్కులపై దాడులు నిర్వహించారని ఆరోపించారు.

    జస్వంత్ సింగ్ భార్య ఫిర్యాదు ప్రకారం, దుండగులు అమె ఇంటిపై దాడి చేసి భర్త, కుమారుడిని హత్య చేశారు.

    ఇంట్లో ఉన్న సామగ్రిని దోచుకుని, ఇంటిని తగలబెట్టారని తెలిపింది.

    కోర్టు విచారణలో సజ్జన్ కుమార్ కేవలం ఈ ఘాతుకాలకు భాగస్వామి మాత్రమే కాకుండా, ఆ గుంపుకు నాయకత్వం వహించినట్లు ఆధారాలు లభించాయని స్పష్టంగా పేర్కొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కాంగ్రెస్

    తాజా

    Pawan Kalyan: రాజధానిపై కుట్రలు చేసిన వారిని విడిచిపెట్టం : పవన్‌ కళ్యాణ్ హెచ్చరిక పవన్ కళ్యాణ్
    ENG vs IND: ఇంగ్లాండ్‌ టూర్‌కు ముందు కీలక మార్పు.. భారత జట్టుకు కొత్త కోచ్ ఇంగ్లండ్
    Tragedy : బెంగళూరులో దారుణం.. సెక్స్‌కి నిరాకరించిందని.. బాలికను హత్య చేసి సూట్‌కేస్‌లో పడేశారు! బెంగళూరు
    Thuglife : దారుణంగా పడిపోయిన థగ్ లైఫ్‌ కలెక్షన్లు.. మూడ్రోజుల్లో ఎంతంటే? కమల్ హాసన్

    కాంగ్రెస్

    Jairam Ramesh : ఎన్డీఏ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు నెహ్రూ పేరు ప్రస్తావన జైరామ్ రమేష్
    ManiShankar Iyer: గాంధీ కుటుంబం వల్లే నా రాజకీయ పతనం.. కాంగ్రెస్‌పై మణిశంకర్ ఆరోపణలు! ఇండియా
    Rahul Gandi: దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణతకు మోదీ ప్రభుత్వ చర్యలే కారణం  రాహుల్ గాంధీ
    PM Modi: 'కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తోంది'..అంబేద్కర్ వివాదంపై మోదీ స్పందన నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025