Page Loader
Eknath Shinde: మహారాష్ట్రలో రాజకీయాల్లో ఉత్కంఠ.. హోంశాఖపై ఏక్‌నాథ్ షిండే కన్ను!
మహారాష్ట్రలో రాజకీయాల్లో ఉత్కంఠ.. హోంశాఖపై ఏకనాథ్ షిండే కన్ను!

Eknath Shinde: మహారాష్ట్రలో రాజకీయాల్లో ఉత్కంఠ.. హోంశాఖపై ఏక్‌నాథ్ షిండే కన్ను!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 07, 2024
11:19 am

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్రలో కొత్తగా ఏర్పడిన మహాయుతి సర్కార్‌లో ప్రభుత్వం ఏర్పాటు పరంగా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేసిన తరువాత, డిప్యూటీ ముఖ్యమంత్రులుగా ఏక్‌నాథ్‌ షిండే, అజిత్‌ పవార్‌లకు బాధ్యతలు అప్పగించారు. అయితే మంత్రిత్వశాఖల కేటాయింపుల విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అధికారులు తెలిపారు. ఇటీవల శివసేన (షిండే) ఎమ్మెల్యే భరత్ గోగవాలే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మహాయుతి సర్కార్‌లో తనకు హోంశాఖ కావాలని, గతంలో ఏక్‌నాథ్‌ షిండే ముఖ్యమంత్రిగా ఉండగా, దేవేంద్ర ఫడ్నవీస్‌కు హోంశాఖను ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.

Details

శివసేన-బీజేపీ మధ్య చర్చలు మొదలు

అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 11 నుంచి 16 మధ్య జరిగే అవకాశముందని, ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్నారు. మరోవైపు గత మహాయుతి సర్కార్‌లో శివసేనకు కేటాయించిన శాఖలను మార్చేందుకు ఎవరైనా ప్రయత్నిస్తున్నారని శివసేన (షిండే) సభ్యుడు ఆరోపించారు. గతంలో శివసేనకు ఉన్న హోంశాఖ, ఆర్థికశాఖను ఎన్సీపీ, బీజేపీ తమ ఆధీనంలోకి తీసుకోవాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పరిణామాల మధ్య శివసేనకు పట్టణాభివృద్ధి, రెవెన్యూ శాఖలు దక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.