NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Kishan Reddy : తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణ.. లక్ష కోట్లతో ఐదు కారిడార్ ప్రాజెక్టులు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Kishan Reddy : తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణ.. లక్ష కోట్లతో ఐదు కారిడార్ ప్రాజెక్టులు
    తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణ.. లక్ష కోట్లతో ఐదు కారిడార్ ప్రాజెక్టులు

    Kishan Reddy : తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణ.. లక్ష కోట్లతో ఐదు కారిడార్ ప్రాజెక్టులు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 03, 2025
    04:53 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర ప్రభుత్వం మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గత దశాబ్దంలో దేశంలో జాతీయ రహదారుల నిర్మాణం వేగంగా జరిగిందని చెప్పారు.

    అన్ని రాష్ట్రాల రాజధానులను జాతీయ రహదారులతో అనుసంధించేందుకు కేంద్రం కృషి చేస్తోందని వివరించారు. తెలంగాణలో ఈ అభివృద్ధి దశాబ్ద కాలంలో స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు.

    2014లో రాష్ట్రంలో కేవలం 2,500 కిలోమీటర్ల జాతీయ రహదారులుండగా, ప్రస్తుతం వాటి పొడవు 5,200 కిలోమీటర్లకు పెరిగిందని వెల్లడించారు.

    ఈ విస్తరణ 32 జిల్లాల కేంద్రాలను జాతీయ రహదారులతో అనుసంధించేందుకు దోహదపడిందని చెప్పారు.

    Details

    6 లైన్లుగా విస్తరణ

    హైదరాబాద్-శ్రీశైలం రోడ్డును అభివృద్ధి చేయడం వల్ల ప్రయాణ దూరం తగ్గుతుందని, అలాగే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని 6 లేన్లుగా విస్తరిస్తున్నట్లు చెప్పారు.

    కొన్ని ప్రాంతాల్లో భూసేకరణ సమస్యలు ఎదురవుతున్నాయని, భూసేకరణ ఆలస్యం అయితే నిర్మాణ పనులు ఆలస్యమవుతాయని తెలిపారు.

    భూములు త్వరగా సమకూరితే రహదారుల పనులు వేగంగా పూర్తవుతాయని స్పష్టం చేశారు. తెలంగాణలో వేలాది కోట్ల రూపాయలతో వందల కిలోమీటర్ల రహదారులు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు.

    Details

    లక్ష కోట్లలో ఖర్చు

    రాష్ట్రానికి సంబంధించిన ఐదు ప్రధాన కారిడార్ల అభివృద్ధికి కేంద్రం సుమారు రూ. లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని పేర్కొన్నారు.

    ఈ నెల 5న కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణకు రానున్నారని తెలిపారు. ఆయన అదిలాబాద్, హైదరాబాద్‌లలో నిర్వహించనున్న కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు.

    ఈ సందర్భంగా రూ.5,416 కోట్ల విలువైన 26 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు.

    ఈ ప్రాజెక్టులు తెలంగాణలో మౌలిక వసతుల అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తాయని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    కిషన్ రెడ్డి

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    తెలంగాణ

    CM Revanthreddy: హైదరాబాద్‌లో ఏఐ డేటా సెంటర్‌ క్లస్టర్‌.. ముఖ్యమంత్రి సమక్షంలో ప్రభుత్వంతో ఒప్పందాలు భారతదేశం
    Inter Exam Results: ఈ నెల 22వ తేదీ తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. భారతదేశం
    Telangana: ఆర్టీసీలో భారీగా ఉద్యోగ నియామకాలు.. త్వరలోనే 3,038 పోస్టులకు నోటిఫికేషన్‌ భారతదేశం
    Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ! ఆంధ్రప్రదేశ్

    కిషన్ రెడ్డి

    హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము; సీఎం కేసీఆర్, గవర్నర్ ఘన స్వాగతం  ద్రౌపది ముర్ము
    తెలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించిన బీజేపీ; తెలంగాణకు కిషన్ రెడ్డి, ఏపీకి పురందేశ్వరీ బీజేపీ
    కేంద్రమంత్రి పదవిపై దిల్లీ పెద్దల మాటకు కట్టుబడి ఉంటా : కిషన్ రెడ్డి బీజేపీ
    KISHAN REDDY: బాటసింగారం వెళ్తుండగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు  తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025