NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Supreme Court: ఇప్పటికే మాపై ఆరోపణలు.. బెంగాల్ అల్లర్ల పిటిషన్‌పై సుప్రీంకోర్టు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Supreme Court: ఇప్పటికే మాపై ఆరోపణలు.. బెంగాల్ అల్లర్ల పిటిషన్‌పై సుప్రీంకోర్టు
    ఇప్పటికే మాపై ఆరోపణలు.. బెంగాల్ అల్లర్ల పిటిషన్‌పై సుప్రీంకోర్టు

    Supreme Court: ఇప్పటికే మాపై ఆరోపణలు.. బెంగాల్ అల్లర్ల పిటిషన్‌పై సుప్రీంకోర్టు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 21, 2025
    02:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలోని ఏ రాష్ట్ర శాసనసభలోనైనా రెండుసార్లు ఆమోదించిన బిల్లులకు రాష్ట్రపతి లేదా గవర్నర్ ఆమోదం ఇవ్వాల్సిన వ్యవహారంలో తాజాగా సుప్రీంకోర్టు గడువు విధించడంపై రాజకీయ వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి.

    ఈ తీర్పుపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తో పాటు బీజేపీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

    తీర్పుల ద్వారా న్యాయవ్యవస్థ పాలనా వ్యవహారాల్లో నేరుగా జోక్యం చేసుకుంటోందంటూ వారు విమర్శించారు.

    ఈ వ్యాఖ్యల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ రోజు పరోక్షంగా స్పందించింది. ఓ కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ అంశాన్ని ప్రస్తావించింది.

    వివరాలు 

    మేము పాలన వ్యవస్థపై జోక్యం చేస్తున్నామనే విమర్శలు

    వక్ఫ్ సవరణ చట్టం నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఇటీవల కొన్ని అల్లర్లు జరిగాయి.

    దీనికి సంబంధించి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ న్యాయవాది విష్ణు శంకర్ జైన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

    ఈ పిటిషన్‌ను జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు తీసుకువచ్చారు.

    ఈ సందర్భంలో జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ, ''ప్రస్తుతం మేము పాలన వ్యవస్థపై జోక్యం చేస్తున్నామనే విమర్శలు ఎదుర్కొంటున్నాం. అలాంటి పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలంటూ రాష్ట్రపతికి ఆదేశాలు ఇవ్వమంటారా?'' అని సందేహం వ్యక్తం చేశారు.

    వివరాలు 

     వారు సూపర్ పార్లమెంటుగా మారిపోతున్నారు: జగదీప్ ధన్‌ఖడ్

    ఇదిలా ఉండగా, ఇటీవల ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ మాట్లాడుతూ, ''రాష్ట్రపతికి గడువులు విధించేలా న్యాయవ్యవస్థ వ్యవహరించడం సమంజసం కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై సుప్రీంకోర్టు ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయకూడదు. ఇప్పుడు మన దగ్గర న్యాయమూర్తులు శాసనాలు చేస్తూ, పాలనా విధులు కూడా నిర్వహిస్తున్నారు. వారు సూపర్ పార్లమెంటుగా మారిపోతున్నారు. కానీ వారిపై మాత్రం ఎలాంటి జవాబుదారీ తత్వం ఉండడం లేదు. ఎందుకంటే దేశ చట్టాలు వారికి వర్తించవు,'' అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

    ఈ వ్యవహారంలో బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి.

    ఆయన మాట్లాడుతూ,''ఒకవేళ సుప్రీంకోర్టే చట్టాలు చేయడం ప్రారంభిస్తే,ఇకపై పార్లమెంట్ భవనాన్ని తాళాలు వేసేయాల్సిందే,''అని విమర్శించారు.అయితే బీజేపీ నేతల వ్యాఖ్యలను విపక్షాలు తీవ్రంగా విభేదిస్తున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సుప్రీంకోర్టు

    తాజా

    Manipur: మయన్మార్ సరిహద్దుల్లో మిలిటెంట్ల కదలికలు.. అసోం రైఫిల్స్ ఆపరేషన్‌లో 10 మంది మృతి మణిపూర్
    Canada: కెనడా మంత్రివర్గంలో భారతీయ మూలాల నేతలకు కీలక పదవులు  కెనడా
    Shubhanshu Shukla: జూన్‌ 8న నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ లాంచ్ కాంప్లెక్స్ నుండి అంతరిక్షంలోకి వెళ్లనున్న భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా నాసా
    Ap news: మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు.. ఆయన కుటుంబ సభ్యులపై కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

    సుప్రీంకోర్టు

    Supreme Court: కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎం డేటాని తొలగించొద్దు.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఎన్నికల సంఘం
    Supreme Court: ఉచితాలపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు.. ఆలా అయితే ప్రజలు పని చేసేందుకు ఇష్టపడరు భారతదేశం
    Sheena Bora: షీనా బోరా కేసు.. ఇంద్రాణీ ముఖర్జీ విదేశీ పర్యటనకు సుప్రీం కోర్టు నో! భారతదేశం
    Mohan Babu: జర్నలిస్టుపై దాడి.. మోహన్ బాబుకు సుప్రీం కోర్టులో ఊరట మోహన్‌ బాబు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025