NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi: దిల్లీలో ప్రధాని మోడీతో ఫడ్నవిస్ చర్చలు.. కేబినెట్ కూర్పుపై సమీక్ష
    తదుపరి వార్తా కథనం
    Delhi: దిల్లీలో ప్రధాని మోడీతో ఫడ్నవిస్ చర్చలు.. కేబినెట్ కూర్పుపై సమీక్ష
    దిల్లీలో ప్రధాని మోడీతో ఫడ్నవిస్ చర్చలు.. కేబినెట్ కూర్పుపై సమీక్ష

    Delhi: దిల్లీలో ప్రధాని మోడీతో ఫడ్నవిస్ చర్చలు.. కేబినెట్ కూర్పుపై సమీక్ష

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 12, 2024
    02:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రస్తుతం హస్తిన పర్యటనలో ఉన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత బుధవారం తొలిసారి దిల్లీ పర్యటనకు వెళ్లారు.

    ఇవాళ ఫడ్నవిస్, కేంద్రమంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్‌తో కూడా కలిసి మాట్లాడారు.

    గురువారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన ఫడ్నవిస్, కేబినెట్ కూర్పుపై చర్చించారు.

    ప్రస్తుతం మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడినా రాజకీయ పరిస్థితులు ఇంకా సద్దుమణగలేదు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన 12 రోజుల తర్వాత ప్రభుత్వం ఏర్పడింది.

    Details

    హోంమంత్రి పదవిని అశిస్తున్న శివసేన

    ఈ సమయంలో మహాయుతి కూటమిలో ముఖ్యమంత్రి పదవిపై తీవ్ర పంచాయితీ జరిగింది, చివరకు బీజేపీ ఈ పదవిని దక్కించుకుంది. ప్రస్తుతం, ఫడ్నవిస్ తన కేబినెట్ కూర్పు పనుల్లో ఉన్నారు.

    శివసేన నేత షిండే హస్తినకు వెళ్లకపోయినా, ముంబైలోనే ఉన్నారు. శివసేన హోంమంత్రి పదవిని ఆశిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.

    అయితే ఫడ్నవిస్ ఈ పదవిని తన వద్ద ఉంచుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, బీజేపీ, ఎన్సీపీ మంత్రిపదవులపై క్లారిటీకి వచ్చాయనే సమాచారం ఉంది.

    బీజేపీకి 22, శివసేనకు 11, ఎన్సీపీకి 10 మంత్రిపదవులు కేటాయించినట్లు తెలుస్తోంది. ఫడ్నవిస్ శివసేనకు హోంశాఖ ఇవ్వాలని సుముఖంగా లేని పరిస్థితి ఉంది.

    Details

    132 స్థానాలకు కైవసం చేసుకున్న మహాయితి

    ఇక శివసేన ఫోర్ట్‌పోలియో బాధ్యతను కోరుతుండగా, ఫడ్నవిస్ ఈ పదవిని ఇవ్వడం లేదన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

    మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 16 నుంచి ప్రారంభం కావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

    అయితే కేబినెట్ విస్తరణ ప్రక్రియ చివరికి డిసెంబర్ 14లో ముగియాలని ఫడ్నవిస్ భావిస్తున్నారు.

    కానీ ఫోర్ట్‌పోలియోపై ఇంకా పంచాయితీ కొనసాగుతున్నందున, దీనికి మరిన్ని రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఈ ఎన్నికలలో మహాయుతి బీజేపీ (132), శివసేన (57), ఎన్సీపీ (41) స్థానాలు గెలుచుకున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దేవేంద్ర ఫడణవీస్‌
    దిల్లీ

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    దేవేంద్ర ఫడణవీస్‌

    Devendra Fadnavis: రాజకీయాల్లో అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ.. మహారాష్ట్ర సీఎం స్థాయికి భారతదేశం
    Devendra Fadnavis: మహారాష్ట్రలో 'మహాయుతి' ప్రభుత్వం కొలువుదీరింది.. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్‌ ప్రమాణస్వీకారం భారతదేశం

    దిల్లీ

    Delhi: దిల్లీలో గ్యాంగ్‌స్టర్ల బెదిరింపులు.. భయాందోళనలో వ్యాపారులు ఇండియా లేటెస్ట్ న్యూస్
    Delhi Pollution: దిల్లీలో బాగా త‌గ్గిన గాలి నాణ్య‌త.. 400 దాటిన ఏక్యూఐ భారతదేశం
    Air Pollution: దిల్లీలో దట్టమైన పొగమంచు.. విజిబిలిటీపై తీవ్ర ప్రభావం! వాయు కాలుష్యం
    Delhi Air Pollution: దిల్లీని కప్పేసిన దట్టమైన పొగమంచు.. పలు విమానాల దారి మళ్లింపు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025