NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Fake SBI branch: ఈ మోసగాళ్ల తీరే వేరయా..  ఏకంగా నకిలీ ఎస్బీఐ బ్రాంచ్ నే తెరిచారు.. 
    తదుపరి వార్తా కథనం
    Fake SBI branch: ఈ మోసగాళ్ల తీరే వేరయా..  ఏకంగా నకిలీ ఎస్బీఐ బ్రాంచ్ నే తెరిచారు.. 
    ఈ మోసగాళ్ల తీరే వేరయా.. ఏకంగా నకిలీ ఎస్బీఐ బ్రాంచ్ నే తెరిచారు..

    Fake SBI branch: ఈ మోసగాళ్ల తీరే వేరయా..  ఏకంగా నకిలీ ఎస్బీఐ బ్రాంచ్ నే తెరిచారు.. 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 03, 2024
    04:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఛత్తీస్‌గఢ్‌లోని శక్తి జిల్లాలో నేరస్తులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)నకిలీ బ్రాంచ్‌ను ప్రారంభించారు.

    ఈ బ్రాంచ్‌ ద్వారా వారు భారీ మోసాలకు పాల్పడ్డారు.ప్రధానంగా నిరుద్యోగుల నుంచి బ్యాంక్ ఉద్యోగాల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసి,నకిలీ శిక్షణ ఇచ్చారు.

    ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకున్న ఘటన

    సెప్టెంబర్ 18 నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని మల్కరౌడా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చాపోరా గ్రామంలో ఈ నకిలీ SBI బ్రాంచ్ ప్రారంభమైంది.

    అద్దె భవనంలో ఈమోసపూరిత శాఖ నడిపి,నిజమైన SBI బ్రాంచ్‌లా లొగోతో పోస్టర్లు,బ్యానర్లు ఏర్పాటు చేశారు.

    లోపలికి వెళితే సాధారణ బ్యాంక్‌లా కనిపించినా,వారి ప్రధాన ఉద్దేశం నిరుద్యోగుల నుంచి మోసం చేయడం.

    బ్యాంక్ ఉద్యోగాల పేరుతో భారీ మొత్తాలను వసూలు చేసి,అదే బ్రాంచ్‌లో ట్రైనింగ్ కూడా ఇచ్చారు.

    వివరాలు 

    ఐదుగురు ఉద్యోగులను ఇంటర్వ్యూల ద్వారా రిక్రూట్

    ఈ బ్యాంక్ తీరుపై స్థానికులకు అనుమానం రావడంతో, వారు వేరే SBI బ్రాంచ్‌కి ఫిర్యాదు చేశారు.

    అనంతరం కోర్బా ప్రాంతీయ కార్యాలయం నుంచి వచ్చిన SBI బృందం బ్రాంచ్‌ను తనిఖీ చేసి, అది నకిలీదని నిర్ధారించింది.

    పోలీసులు బ్రాంచ్‌పై దాడి చేసి, కంప్యూటర్లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

    ఐదుగురు ఉద్యోగులను ఇంటర్వ్యూల ద్వారా రిక్రూట్ చేసినట్లు గుర్తించారు. వారి విచారణ కొనసాగుతోందని ఏఎస్పీ రమా పటేల్ తెలిపారు.

    కేసు నమోదు

    బ్రాంచ్ మేనేజర్‌గా నటించిన సూత్రధారి సహా ముగ్గురు ఆపరేటర్లపై భారతీయ న్యాయసంహిత కింద కేసు నమోదు చేశారు.

    ఈ బ్రాంచ్ ద్వారా ఎంత మందిని మోసం చేశారో, ఎంత డబ్బు వసూలు చేసారో తెలుసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

    వివరాలు 

    ఇంతకుముందు తమిళనాడులో జరిగిన ఘటనా 

    2020లో తమిళనాడులో కడలూరు జిల్లాలో నకిలీ SBI బ్రాంచ్‌ను నడుపుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

    SBI మాజీ ఉద్యోగి కుమారుడైన కమల్ బాబు ఈ మోసపూరిత శాఖను కంప్యూటర్లు, లాకర్లు, ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఏర్పాటు చేశాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఛత్తీస్‌గఢ్
    ఛత్తీస్‌గఢ్‌

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఛత్తీస్‌గఢ్

    5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్: నేడు పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం బీజేపీ
    ఛత్తీస్‌గఢ్‌ బీజేపీ కురువృద్ధుడు, మాజీ మంత్రి లీలారామ్ భోజ్వానీ కన్నుమూత ఛత్తీస్‌గఢ్‌
    ఛత్తీస్‌గఢ్‌: అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం.. బీజేపీ నేత కొడుకు అరెస్ట్  ఛత్తీస్‌గఢ్‌
    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు  రాహుల్ గాంధీ

    ఛత్తీస్‌గఢ్‌

    హిందీ రాష్ట్రాల్లో సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికలకు బీజేపీ  బీజేపీ
    అసెంబ్లీ ఎన్నికలపై ప్రధాని మోదీ ఫోకస్.. 6రోజులు నాలుగు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన నరేంద్ర మోదీ
    Telangana Elections: మోగిన తెలంగాణ ఎన్నికల నగారా.. నవంబర్ 30న పోలింగ్  తెలంగాణ
    Chattisgarh aap : నాలుగో జాబితా విడుదల.. 37 మందితో స్టార్ క్యాంపెయినర్లు ఛత్తీస్‌గఢ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025