NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / బీజేపీలోకి వచ్చిన జయసుధ.. ప్రధానిని చూసే కషాయ కండువా కప్పుకున్నట్లు స్పష్టం 
    తదుపరి వార్తా కథనం
    బీజేపీలోకి వచ్చిన జయసుధ.. ప్రధానిని చూసే కషాయ కండువా కప్పుకున్నట్లు స్పష్టం 
    ప్రధానిని చూసే కషాయ కండువా కప్పుకున్నట్లు స్పష్టం

    బీజేపీలోకి వచ్చిన జయసుధ.. ప్రధానిని చూసే కషాయ కండువా కప్పుకున్నట్లు స్పష్టం 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 02, 2023
    06:03 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రముఖ సినీనటి, సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీలో చేరారు.

    దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె కషాయ కండువా కప్పుకున్నారు.

    ఈ మేరకు తెలంగాణ బీజేపీ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్,జయసుధను పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి పార్టీ సభ్యత్వ రసీదును అందజేశారు.

    కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో జయసుధ భేటీ అయ్యారు. అన్ని వర్గాల ప్రజలకు భాజపా అండగా ఉంటుందని అమిత్ షా చెప్పారు. ఈ క్రమంలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడిన జయసుధ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    క్రైస్తవుల సంక్షేమం కోసం తాను పనిచేస్తానని ప్రకటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందిందన్నారు.

    DETAILS

    తాను బీజేపీని ఎంచుకోవడంపై చాలా మంది ఆశ్చర్యపోతున్నారు : జయసుధ

    ఈ మేరకు మోదీ అభివృద్ధిని చూసే బీజేపీలో చేరినట్లు జయసుధ వివరించారు. తాను బీజేపీని ఎంచుకోవడంపై చాలా మంది ఆశ్చర్యపోతున్నారని చెప్పుకొచ్చారు.

    మంచి మార్పు కోసమే కషాయ తీర్థం పుచ్చుకున్నట్లు పేర్కొన్నారు.

    మరోవైపు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ తరఫున 2009లో సికింద్రాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసి జయసుధ, సంచలన విజయం నమోదు చేశారు.

    ప్రస్తుతం మరోసారి సికింద్రాబాద్ లేదా ముషీరాబాద్ టిక్కెట్ ఆశిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆమె కొట్టిపడేశారు.

    సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ప్రజలకు విశేషంగా సేవలు అందించారన్న కిషన్ రెడ్డి, పేదలు, బస్తీల అభివృద్ధి కోసం నిజాయితిగా కృషి చేశారని ప్రశంసించారు.

    బీజేపీలో జయసుధ చేరిక శ్రేణులకు రెట్టింపు ఉత్సాహాన్నిస్తుందన్నారు. బీజేపీ తెలంగాణలో ప్రభుత్వంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీజేపీ
    తెలంగాణ

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    బీజేపీ

    బీజేపీతో పొత్తుపై 2022లోనే ఎన్సీపీలో చర్చ; తిరుగుబాటు నేత ప్రఫుల్ పటేల్ సంచలన వ్యాఖ్యలు  మహారాష్ట్ర
    తెలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించిన బీజేపీ; తెలంగాణకు కిషన్ రెడ్డి, ఏపీకి పురందేశ్వరీ తెలంగాణ
    గిరిజన కూలీపై మూత్ర విసర్జన; నిందితుడు బీజేపీ వ్యక్తి అంటూ ప్రతిపక్షాల ఆరోపణ  మధ్యప్రదేశ్
    గిరిజన హక్కులపై 'యూనిఫాం సివిల్ కోడ్' ప్రభావం ఉండదు: కేంద్రమంత్రి బఘేల్ కేంద్రమంత్రి

    తెలంగాణ

    IMD: ఈ వారం తెలంగాణ,ఏపీతో పాటు ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు; ఐఎండీ హెచ్చరిక  ఐఎండీ
    తెలంగాణలో 5 రోజులు దంచి కొట్టనున్న వానలు.. ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ హైదరాబాద్
    తెలంగాణ: భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ సమీక్ష.. ప్రాణనష్టం జరగకుండా చూడాలని ఆదేశం కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    తెలంగాణలో నేటి నుంచి 2 రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవు.. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం  ప్రభుత్వం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025