NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 'Dilli Chalo': హర్యానా సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం.. రైతులను అడ్డుకున్న పోలీసులు 
    తదుపరి వార్తా కథనం
    'Dilli Chalo': హర్యానా సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం.. రైతులను అడ్డుకున్న పోలీసులు 
    హర్యానా సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం.. రైతులను అడ్డుకున్న పోలీసులు

    'Dilli Chalo': హర్యానా సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం.. రైతులను అడ్డుకున్న పోలీసులు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 06, 2024
    03:05 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలో రైతులు మరోసారి తమ హక్కుల కోసం పోరాట బాట పట్టారు.

    పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం సహా పలు డిమాండ్ల సాధన కోసం, పంజాబ్-హర్యానా సరిహద్దులోని శంభు వద్ద 'ఢిల్లీ చలో' పేరుతో భారీ నిరసన చేపట్టారు.

    ఈ క్రమంలో రైతులు తమ డిమాండ్లను నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయగా,పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

    పోలీసులు ఒక రైతును అదుపులోకి తీసుకున్నారు.రైతులు శంభు సరిహద్దుకు చేరుకొని ఢిల్లీ సరిహద్దుల్లోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తుండగా, భద్రతా బలగాలు బారికేడ్లతో వారిని అడ్డుకున్నాయి.

    రైతుల నిరసనల కారణంగా హర్యానాలోని అంబాలా సహా కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.

    వివరాలు 

    మూడంచెల బారికేడ్ల ఏర్పాటు

    అదే సమయంలో గ్రేటర్ నోయిడాలోని పరి చౌక్ వద్ద నిరసనలో పాల్గొంటున్న కొంతమంది రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    రైతుల ఆందోళన నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం అప్రమత్తమైంది. సరిహద్దుల్లో కేంద్ర పారా మిలటరీ బలగాలను మోహరించి, మూడంచెల బారికేడ్లను ఏర్పాటు చేసింది.

    ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఒకచోట గుమిగూడకుండా నిషేధాజ్ఞలు అమలు చేశారు.

    కిసాన్ మజ్దూర్ మోర్చా సమన్వయకర్త శర్వణ్ సింగ్ పాంథేర్ మాట్లాడుతూ, రైతులు ట్రాక్టర్లు లేదా ట్రాలీలు తీసుకురాకుండా, కేవలం కాలినడకన పాదయాత్ర చేయాలని నిర్ణయించారని తెలిపారు.

    శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు శంభు సరిహద్దు నుంచి 101 మంది రైతులతో పాదయాత్ర ప్రారంభించి, ఢిల్లీ వైపు మార్చ్ చేయాలనే సంకల్పం తీసుకున్నామని పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హర్యానా

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    హర్యానా

    Dwarka Expressway: నేడు ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించనున్న ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    Haryana: ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టిన కారు .. 6 మంది మృతి, 6 మందికి గాయాలు రోడ్డు ప్రమాదం
    PM Modi: అభివృద్ధిని చూసి 'ఇండియా' కూటమి నేతలకు నిద్ర పట్టడం లేదు: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    Manohar Lal Khattar: హర్యానా సీఎం మనోహర్ లాల్ రాజీనామా  మనోహర్ లాల్ ఖట్టర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025