NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Farmers Protest: నేడు రైతులతో కేంద్రం నాలుగో దఫా  చర్చలు.. MSPపై ఆర్డినెన్స్‌కు అన్నదాతల డిమాండ్ 
    తదుపరి వార్తా కథనం
    Farmers Protest: నేడు రైతులతో కేంద్రం నాలుగో దఫా  చర్చలు.. MSPపై ఆర్డినెన్స్‌కు అన్నదాతల డిమాండ్ 
    Farmers Protest: నేడు రైతులతో నాలుగో దఫా కేంద్రం చర్చలు.. MSPపై ఆర్డినెన్స్‌కు అన్నదాతల డిమాండ్

    Farmers Protest: నేడు రైతులతో కేంద్రం నాలుగో దఫా  చర్చలు.. MSPపై ఆర్డినెన్స్‌కు అన్నదాతల డిమాండ్ 

    వ్రాసిన వారు Stalin
    Feb 18, 2024
    09:51 am

    ఈ వార్తాకథనం ఏంటి

    సమస్యలను పరిష్కరించాలని నిరసన తెలుపుతున్న రైతులు, కేంద్ర ప్రభుత్వం మధ్య ఆదివారం నాలుగో దఫా చర్చలు జరగనున్నాయి.

    ప్రధానంగా కనీస మద్దతు ధరకు హామీ ఇచ్చేలా ఆర్డినెన్స్ తీసుకురావాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

    ఇంతకుముందు రైతులు, ప్రభుత్వం మధ్య మూడు దఫాలు చర్చలు జరిగాయి. అయితే ఆ చర్చలు సఫలం కాలేదు.

    డిమాండ్ల సాధనే లక్ష్యంగా చలో దిల్లీ పాదయాత్రకు వచ్చిన రైతుల పోరాటం ఆదివారానికి ఆరో రోజుకు చేరుకుంది. పంజాబ్-హర్యానా సరిహద్దుల్లో ప్రస్తుతం రైతులు ఆందోళన నిర్వహిస్తున్నారు.

    ఈ క్రమంలో రైతులను దిల్లీ లోనికి రాకుండా అడ్డుకునేందుకు సరిహద్దుల్లో భారీగా భద్రతా బలగాలను మోహరించడంతో పాటు, రైతులను శాంతింపజేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.

    దిల్లీ

    రైతుల డిమాండ్లు ఇవే

    1. అన్ని పంటల కొనుగోళ్లకు MSP హామీ చట్టాన్ని వర్తింపజేయాలి.

    2. స్వామినాథన్ కమిషన్ నివేదిక ప్రకారం పంటల ధరలు నిర్ణయించాలి. అన్ని పంటల సగటు ఉత్పత్తి వ్యయం కంటే MSP యాభై శాతం ఎక్కువ ఉండాలి.

    3. రైతులు, రైతు కూలీల రుణాలను మాఫీ చేయాలి.

    4. 60ఏళ్లు పైబడిన రైతులకు రూ.10,000పెన్షన్ ఇవ్వాలి.

    5. భూసేకరణ చట్టం 2013ని మళ్లీ అమలు చేయాలి.

    6. లఖింపూర్ ఖేరీ ఘటనలో దోషులను శిక్షించాలి. నిందితుల బెయిల్‌ను రద్దు చేయాలి.

    7. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను నిషేధించాలి.

    8. విద్యుత్ సవరణ బిల్లు 2020ని రద్దు చేయాలి.

    9. MNREGA కింద, ప్రతి సంవత్సరం 200రోజుల పని, రోజూవారీగా రూ. 700వేతనం ఇవ్వాలి.

    దిల్లీ

    రైతు కుటుంబాలకు పరిహారం ఇవ్వాలి

    10. రైతు ఉద్యమంలో చనిపోయిన కుటుంబాలకు నష్టపరిహారం, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి. ఒప్పందం ప్రకారం క్షతగాత్రులకు రూ.10లక్షల పరిహారం అందించాలి. దిల్లీ మోర్చాతోపాటు దేశవ్యాప్తంగా అన్ని ఉద్యమాల సందర్భంగా నమోదైన కేసులన్నింటినీ రద్దు చేయాలి.

    11. నకిలీ విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు విక్రయించే కంపెనీలపై కఠిన చట్టాలు చేయాలి. ప్రభుత్వమే పంటల బీమా చేయించాలి.

    12. మిర్చి, పసుపు, ఇతర మసాలా దినుసుల కోసం జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేయాలి.

    13. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్‌ను అమలు చేయడం ద్వారా గిరిజనుల భూములను దోచుకోవడం అరికట్టాలి.

    హర్యానాలో ఇంటర్నెట్ నిషేధం

    రైతుల ఉద్యమం కారణంగా హర్యానాలోని ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని ఫిబ్రవరి 19 అర్ధరాత్రి 12గంటల వరకు నిషేధించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    తాజా వార్తలు
    కేంద్ర ప్రభుత్వం
    హర్యానా

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    దిల్లీ

    Javed Ahmed Mattoo: దిల్లీలో పట్టుబడ్డ హిజ్బుల్ ఉగ్రవాది జావేద్ అహ్మద్ మట్టూ జమ్ముకశ్మీర్
    Fake Medicines: ఢిల్లీ నకిలీ మందుల కేసులో సీబీఐ విచారణకు కేంద్రం ఆదేశం  భారతదేశం
    Schools shut: చలి ఎఫెక్ట్.. 5వ తరగతి వరకు పాఠశాలల మూసివేత  పాఠశాల
    Sonipat: సోనిపట్‌లో ట్రక్కు, కారు ఢీ.. ఇద్దరు ఢిల్లీ పోలీసులు మృతి  రోడ్డు ప్రమాదం

    తాజా వార్తలు

    Punjab Farmers: 6నెలలకు సరిపోయే రేషన్, డీజిల్‌తో సరిహద్దుకు పంజాబ్ రైతులు పంజాబ్
    AAP: అర్హత లేకుండా దిల్లీలో కాంగ్రెస్‌కు ఒక సీటు ఇస్తాం: ఆప్ సంచలన కామెంట్స్ దిల్లీ
    Balakrishna Case: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ బినామీలకు ఏసీబీ నోటీసులు  హైదరాబాద్
    RIL: తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ రికార్డు @రూ.20లక్షల కోట్లు  ముకేష్ అంబానీ

    కేంద్ర ప్రభుత్వం

    Central Tribal University: ములుగులో సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీకి కేంద్ర కేబినెట్ ఆమోదం  తెలంగాణ
    నేను జారీ చేసిన ఉత్తర్వులతో కేంద్రం ఎందుకు ఇబ్బంది పడిందో అర్థం కాలేదు: జస్టిస్ మురళీధర్  దిల్లీ
    ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 21.8 శాతం పెరుగుదల.. రూ. 9.57 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు  ఆర్థిక శాఖ మంత్రి
    చైనా,పాకిస్థాన్‌లతో వ్యాపారంపై భారత్ ఆంక్షలు.. తమకు తెలియకుండా ఎలాంటి వాణిజ్యం చేయకూడదని రాష్ట్రాలకు ఆదేశాలు  భారతదేశం

    హర్యానా

    రాష్ట్రంలో అందరికీ భద్రత కల్పించలేం: హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్  మనోహర్ లాల్ ఖట్టర్
    హర్యానా మత ఘర్షణలపై స్పందించిన అమెరికా.. హింసకు దూరంగా ఉండాలని అన్ని వర్గాలకు విజ్ఞప్తి  అమెరికా
    మందుల కోసం వెళ్తే కారుకు నిప్పు.. తృటిలో కుమార్తెతో కలిసి తప్పించుకున్న మహిళా న్యాయమూర్తి భారతదేశం
    నుహ్ ఎస్పీ వరుణ్ సింగ్లాపై బదిలీ వేటు.. మత అల్లర్లే కారణం భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025