NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / బారికేడ్లను ఛేదించుకొని వచ్చి రెజ్లర్లకు మద్దతు తెలిపిన రైతులు
    బారికేడ్లను ఛేదించుకొని వచ్చి రెజ్లర్లకు మద్దతు తెలిపిన రైతులు
    భారతదేశం

    బారికేడ్లను ఛేదించుకొని వచ్చి రెజ్లర్లకు మద్దతు తెలిపిన రైతులు

    వ్రాసిన వారు Naveen Stalin
    May 08, 2023 | 03:07 pm 0 నిమి చదవండి
    బారికేడ్లను ఛేదించుకొని వచ్చి రెజ్లర్లకు మద్దతు తెలిపిన రైతులు
    బారికేడ్లను ఛేదించుకొని వచ్చి రెజ్లర్లకు మద్దతు తెలిపిన రైతులు

    రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రెజ్లర్లకు మద్దతు తెలిపేందుకు రైతులు పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌తో సహా దేశంలోని వివిధ ప్రాంతాల రైతులు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చారు. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్‌ను తొలగించి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) సభ్యులు దిల్లీ పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను బద్దలు కొట్టి మరీ, రెజ్లర్ల నిరసన వేదిక వద్దకు చేరుకున్నారు. దీంతో జంతర్ మంతర్ వద్ద కాసేపు హైడ్రామా జరిగింది.

    న్యాయం జరిగే వరకు పోరటం ఆగదు: రెజ్లర్లు

    జంతర్ మంతర్ వద్దకు వచ్చిన రైతులు హడావిడి చేశారని, బారికేడ్లను తొలగించాలని దిల్లీ పోలీసులు ఆరోపించారు. జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ధర్నా చేసుకోవాలని పోలీసులు సూచించారు. అలాగే చట్టాన్ని పాటించాలని ప్రజలను కోరారు. తమకు న్యాయం జరిగే వరకు పోరటం ఆగదని, బ్రిజ్ భూషణ్‌ను డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌గా తొలగించి కటకటాల వెనక్కి నెట్టే వరకు ఇక్కడి నుంచి కదలబోమని నిరసనకు దిగిన రెజ్లర్లు స్పష్టం చేశారు. మే 21లోగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్ట్ చేయకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు, కామన్వెల్త్ గేమ్స్ పతక విజేత వినేష్ ఫోగట్ పేర్కొన్నారు. బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌ను అరెస్టు చేయాలన్నదే తమ డిమాండ్‌ అని వినేష్‌ మరోసారి స్పష్టం చేశారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    దిల్లీ
    రెజ్లింగ్
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    దిల్లీ

    జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరసనకు రైతు నాయకుల మద్దతు  రెజ్లింగ్
    దిల్లీలో బీఆర్ఎస్ శాశ్వత భవనాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్  భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    దిల్లీ కోర్టును ఆశ్రయించాలని రెజ్లర్లకు సుప్రీంకోర్టు సూచన సుప్రీంకోర్టు
    దిల్లీలో దట్టమైన పొగమంచు; 13 ఏళ్లలో కనిష్టానికి చేరిన మే నెల ఉష్ణోగ్రతలు  ఐఎండీ

    రెజ్లింగ్

    మేము నేరస్థులమా? మమ్మల్ని చంపేయండి; అర్దరాత్రి ఉద్రిక్తతపై వినేష్ ఫోగట్‌ కన్నీటి పర్యంతం  దిల్లీ
    మోదీ జీ, మీ మాట కోసమే న్యాయం వేచి చేస్తోంది: ప్రియాంక గాంధీ  ప్రియాంక గాంధీ
    రెజ్లర్ల పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు విచారణ  ప్రపంచం
    ప్రాథమిక దర్యాప్తు తర్వాత బ్రిజ్ భూషణ్ పై కేసు నమోదు చేస్తాం  సుప్రీంకోర్టు

    తాజా వార్తలు

    అమృత్‌సర్: గోల్డెన్ టెంపుల్ సమీపంలో మరో పేలుడు  అమృత్‌సర్
    రాజస్థాన్‌: మిగ్-21 యుద్ధ విమానం కూలి నలుగురు మృతి రాజస్థాన్
    మహిళా సాధికారతకు దర్పణం పట్టేలా 2024 గణతంత్ర దినోత్సవ పరేడ్‌  గణతంత్ర దినోత్సవం
     హై స్పీడ్‌తో హైదరాబాద్-విశాఖపట్నం రహదారి నిర్మాణం; 56 కి.మీ తగ్గనున్న దూరం హైదరాబాద్

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    కేరళ: మలప్పురంలో పర్యాటకుల పడవ బోల్తా; 22మంది మృతి  కేరళ
    తల్లి తోకతో బుల్లి చిరుత హల్ చల్; వీడియో వైరల్ సోషల్ మీడియా
    NEET UG 2023 అడ్మిట్ కార్డ్‌ను విడుదల; ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే? భారతదేశం
    దేశంలో స్వల్పంగా పరిగిన కరోనా కేసులు; కొత్తగా 3,962 మందికి వైరస్ కరోనా కొత్త కేసులు
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023