NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Parliament Security Breach: పార్లమెంట్ పై దాడికి నెల ముందే ప్రణాళిక.. నిందితులపై UAPA కేసు
    తదుపరి వార్తా కథనం
    Parliament Security Breach: పార్లమెంట్ పై దాడికి నెల ముందే ప్రణాళిక.. నిందితులపై UAPA కేసు
    పార్లమెంట్ పై దాడికి నెల ముందే ప్రణాళిక.. నిందితులపై UAPA కేసు

    Parliament Security Breach: పార్లమెంట్ పై దాడికి నెల ముందే ప్రణాళిక.. నిందితులపై UAPA కేసు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 14, 2023
    10:21 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పార్లమెంటు భద్రతా ఉల్లంఘన కేసులో నిందితులపై దిల్లీ పోలీసులు ఉగ్రవాద నిరోధక చట్టం, చట్టవిరుద్ధ కార్యకలాపాల(నిరోధక) చట్టం(UAPA) కింద కేసు నమోదు చేసినట్లు ANI నివేదించింది.

    ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ నలుగురు నిందితుల విద్యా నేపథ్యం,​అంతకముందు ఏదైనా నిరసనలు లేదా ర్యాలీలతో సహా గత కార్యకలాపాలలో వారి ప్రమేయం,బుధవారం నాటి సంఘటనకు ముందు వారు పార్లమెంటును సందర్శించారా అనే విషయాలతో సహా వివిధ అంశాలను కూడా దర్యాప్తు చేస్తుందని వార్తా సంస్థ మూలాలను ఉటంకిస్తూ నివేదించింది.

    అంతేకాకుండా వారి సోషల్ మీడియా కార్యకలాపాలపై కూడా దృష్టి సారించనుంది.

    బుధవారం పార్లమెంట్‌లో భద్రతా ఉల్లంఘనలపై హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించింది.

    Details

    పొగ దాడి పార్లమెంటు లోపల,బయట కూడా జరిగింది

    సీఆర్పీఎఫ్ డీజీ అనీష్ దయాళ్ సింగ్ ఆధ్వర్యంలో ఇతర భద్రతా సంస్థల సభ్యులు, నిపుణులతో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.

    ఈ ప్యానెల్ పార్లమెంటు భద్రత ఉల్లంఘనకు గల కారణాలను పరిశీలించి, లోపాలను గుర్తించి తదుపరి చర్యలను సిఫారసు చేస్తుంది.

    అంతకుముందు రోజు పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో లోక్‌సభలోని సందర్శకుల గ్యాలరీ నుండి గుర్తుతెలియని వ్యక్తులు దూకి టియర్ గ్యాస్ పట్టుకుని సభలోనే నినాదాలు చేశారు.

    ఈ పొగ దాడి పార్లమెంటు లోపల మాత్రమే కాదు, పార్లమెంటు బయట కూడా జరిగింది. బయట మరో ఇద్దరు వ్యక్తులు ఇలాంటి చర్యకే పాల్పడ్డారు. వారిలో ఒక మహిళ కూడా ఉన్నారు. అనంతరం నలుగురిని అరెస్టు చేశారు.

    Details

    పార్లమెంట్ ఆవరణలో రెక్కీ

    వీరి నలుగురితో బాటు విశాల్‌ని అనే వ్యక్తిని కూడా కూడా అదుపులోకి తీసుకున్నామని, వీరందరూ గురుగ్రామ్ ఇంట్లో వారు ఉంటున్నారని పోలీసులు తెలిపారు.

    కాగా, ఆరో నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వారు తెలిపారు. దీని కోసం నెల రోజుల నుంచి ప్తాన్ వేసినట్లు విచారణలో వెల్లడైంది.

    రైతుల నిరసన, మణిపూర్ సంక్షోభం, నిరుద్యోగం వంటి సమస్యలతో విసిగిపోయినందునే తాము ఈ చర్యకు పాల్పడ్డామని విచారణ సందర్భంగా అమోల్ చెప్పినట్లు పీటీఐ నివేదించింది.

    ఆరుగురు నిందితులు నాలుగేళ్లుగా ఒకరికొకరు తెలుసు. సోషల్ మీడియా ద్వారా నిరంతరం టచ్‌లో ఉన్నారు.

    కొద్దిరోజుల క్రితమే ప్లాన్ వేసుకుని పార్లమెంట్ ఆవరణలో రెక్కీ కూడా నిర్వహించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పార్లమెంట్ భవనం

    తాజా

    Operation Sindoor: ఉగ్రవాదం నిర్మూలనకే 'ఆపరేషన్‌ సిందూర్‌' : భారత సైన్యం భారత సైన్యం
    INDw vs SLw: మహిళల ముక్కోణపు వన్డే టైటిల్ భారత్‌దే స్మృతి మంధాన
    operation sindoor: ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు : భారత్  ఆపరేషన్‌ సిందూర్‌
    HYD Metro: ప్రపంచానికి బ్లూప్రింట్‌గా హైదరాబాద్ మెట్రో.. హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రశంసలు! హైదరాబాద్

    పార్లమెంట్ భవనం

    డిసెంబర్ 13లోగా భారత పార్లమెంట్‌పై దాడి చేస్తా: గురుపత్వంత్ సింగ్ బెదిరింపు గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025