NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / FIITJEE Coaching Center: టీచర్ల జీతాలు చెల్లించకపోవడంతో యూపీ, ఢిల్లీలో ఫిట్జ్ కోచింగ్ కేంద్రాలు మూసివేత‌
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    FIITJEE Coaching Center: టీచర్ల జీతాలు చెల్లించకపోవడంతో యూపీ, ఢిల్లీలో ఫిట్జ్ కోచింగ్ కేంద్రాలు మూసివేత‌
    టీచర్ల జీతాలు చెల్లించకపోవడంతో యూపీ, ఢిల్లీలో ఫిట్జ్ కోచింగ్ కేంద్రాలు మూసివేత‌

    FIITJEE Coaching Center: టీచర్ల జీతాలు చెల్లించకపోవడంతో యూపీ, ఢిల్లీలో ఫిట్జ్ కోచింగ్ కేంద్రాలు మూసివేత‌

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 24, 2025
    11:27 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర్‌ప్రదేశ్,దిల్లీ ప్రాంతాల‌ ఫిట్జ్ కోచింగ్ కేంద్రాలను అకస్మాత్తుగా మూసివేశారు.వారం రోజుల నుంచి ఈ సెంటర్లు పని చేయడం లేదు.

    దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    బోర్డు పరీక్షలు సమీపిస్తున్న సమయంలో ఫిట్జ్ కోచింగ్ కేంద్రాలను మూసివేయడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    జీతాలు చెల్లించకపోవడం వల్లే అనేక మంది టీచర్లు సంస్థను వదిలిపోతున్నట్లు తేలింది.

    నోయిడా, ఘజియాబాద్, భోపాల్, వారణాసి, ఢిల్లీ, పాట్నా నగరాల్లోని ఫిట్జ్ కోచింగ్ సెంటర్లను మూసివేశారు.

    యూపీ లోని మీరట్ సెంటరును కూడా తాజాగా మూసివేశారు.నోయిడా నుంచి టీచర్లను రప్పించే ప్రయత్నం చేసినా, కొన్ని రోజుల తరువాత మాత్రమే ఇన్‌స్టిట్యూట్ పనిచేసింది.

    వివరాలు 

    ఫిట్జ్ సంస్థలో ఆర్థిక సంక్షోభం 

    విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసు ఫిర్యాదులు నమోదు చేశారు. కోచింగ్ సంస్థ ఎటువంటి నోటీసు లేకుండా లేదా రిఫండ్ ఇవ్వకుండా కోచింగ్ కేంద్రాలను మూసివేసినట్లు పేరెంట్స్ తెలిపారు.

    మూసివేసిన బ్రాంచీల దగ్గర పేరెంట్స్ నిరసన చేపట్టారు.చాలా నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని, అందుకే ఫ్యాకల్టీ సభ్యులు సంస్థను వీడి వెళ్లిపోతున్నారని ఓ ఫిట్జ్ టీచర్ చెప్పారు.

    ఫిట్జ్ సంస్థలో ఆర్థిక సంక్షోభం ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.

    ఈ సంస్థకు సంబంధించిన బ్రాంచీలపై ప్రభుత్వచర్యలు కూడా తీసుకున్నాయి. లైసెన్సులు లేవని, ఫైర్ సేఫ్టీ రూల్స్ పాటించడంలేదని ఆరోపణలు వచ్చాయి.

    వివరాలు 

    72 ఫిట్జ్ కేంద్రాలలో సుమారు 300 మంది ఉద్యోగులు

    ఫిట్జ్ సంస్థను 1992లో డీకే గోయల్ స్థాపించారు. ఆయ‌న ఐఐటీ ఢిల్లీ నుండి మెకానికల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

    ఇంజినీరింగ్ ఎంట్రన్స్ పరీక్షలకు ప్రత్యేక కోచింగ్ అందించే సంస్థగా ఇది పేరుపొందింది.

    దేశవ్యాప్తంగా 41 నగరాలలో 72 ఫిట్జ్ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో సుమారు 300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    ఉత్తర్‌ప్రదేశ్

    తాజా

    operation sindoor: పుల్వామాలో వ్యూహం మేమే అమలు చేసాం : పాక్‌ వాయుసేనాధికారి పాకిస్థాన్
    Rajnath Singh: భారత రక్షణ సామర్థ్యంలో కొత్త అధ్యాయం.. లక్నోలో బ్రహ్మోస్‌ క్షిపణి యూనిట్ ప్రారంభం రాజ్‌నాథ్ సింగ్
    IPL 2025: విదేశీ ఆటగాళ్లు తిరిగొస్తారు.. ఐపీఎల్ కొనసాగుతుంది : బీసీసీఐ ఛైర్మన్ బీసీసీఐ
    Sumanth: మృణాల్‌ ఠాకూర్‌ పెళ్లి వార్తల్లో నిజం లేదు.. స్పష్టం చేసిన సుమంత్  మృణాల్ ఠాకూర్

    దిల్లీ

    Air Pollution: దిల్లీలో మరోసారి తీవ్రస్థాయికి వాయు కాలుష్యం.. 421 మార్క్‌ను దాటిన ఏక్యూఐ వాయు కాలుష్యం
    Delhi Air Pollution: ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం, పొగమంచు ..హెచ్చరికలు జారీ వాయు కాలుష్యం
    Delhi: ఢిల్లీ నగరంలో ఏడాది పొడవునా బాణాసంచా నిషేధం  భారతదేశం
    Delhi: ఢిల్లీలో పాఠశాలకు మళ్లీ బాంబు బెదిరింపు.. డిసెంబర్‌లో నాల్గవ కేసు బాంబు బెదిరింపు

    ఉత్తర్‌ప్రదేశ్

    UttarPradesh: ఉత్తర్‌ప్రదేశ్'లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి రోడ్డు ప్రమాదం
    JP Narayan Centre row: సమాజ్‌వాదీ శ్రేణుల ఆందోళన..లక్నోలో ఉద్రిక్తత అఖిలేష్ యాదవ్
    Durga idol immersion: యూపీలోని బహ్రైచ్‌లో మత ఘర్షణలు.. ఒకరి మృతి.. 30 మంది అరెస్టు  భారతదేశం
    Rajasthan: కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాదిలో 19వ ఘటన రాజస్థాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025