NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / First GBS Death in Telangana: తెలంగాణలో తొలి జీబీఎస్ మరణం.. చికిత్స పొందుతూ మహిళ మృతి
    తదుపరి వార్తా కథనం
    First GBS Death in Telangana: తెలంగాణలో తొలి జీబీఎస్ మరణం.. చికిత్స పొందుతూ మహిళ మృతి
    తెలంగాణలో తొలి జీబీఎస్ మరణం.. చికిత్స పొందుతూ మహిళ మృతి

    First GBS Death in Telangana: తెలంగాణలో తొలి జీబీఎస్ మరణం.. చికిత్స పొందుతూ మహిళ మృతి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 09, 2025
    09:35 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలో గులియన్‌ బారే సిండ్రోమ్‌ (జీబీఎస్) బారిన పడిన ఓ మహిళ మరణించడంతో రాష్ట్రంలో ఆందోళన నెలకొంది.

    జీబీఎస్ సోకి మరణించిన తొలి వ్యక్తి ఆమె కావడంతో ప్రజల్లో భయాందోళనలు పెరిగాయి. జీబీఎస్ పాజిటివ్‌గా తేలితే ప్రాణాపాయం ఉందా? అనే సందేహంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    సిద్దిపేట జిల్లాకు చెందిన వివాహిత గులియన్‌ బారే సిండ్రోమ్‌ అనే నరాల వ్యాధి బారిన పడి శనివారం మృతిచెందారు.

    Details

     గులియన్‌ బారే సిండ్రోమ్‌ లక్షణాలు 

    జీబీఎస్ సోకినవారిలో ఒళ్లంతా తిమ్మిరిగా అనిపించడం, జ్వరం, వాంతులు వంటి లక్షణాలు కనిపించవచ్చు.

    డయేరియా, పొత్తికడుపు నొప్పి, ఒక్కసారిగా నీరసంగా అనిపించడం, కండరాలు బలహీనంగా మారడం వంటి సమస్యలు కూడా ఈ వ్యాధికి లక్షణాలుగా చెప్పొచ్చు.

    ఇది ముఖ్యంగా నీటి ద్వారా లేదా కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల బ్యాక్టీరియా సోకడం వల్ల ఉత్పన్నమవుతుంది.

    అయితే జీబీఎస్ అంటువ్యాధి కాదని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

    సరైన చికిత్స ద్వారా బాధితులను పూర్తిగా నయం చేయవచ్చని ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Insomnia problem: రాత్రి నిద్రలేమి.. క్యాన్సర్ ప్రమాదం పెరుగుదలకి కారణమా? నిద్రలేమి
    Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడుల్లో 9 పాకిస్తానీ విమానాలు ధ్వంసం.. ఉపగ్రహ చిత్రాల ద్వారా దృశ్యాలు వెలుగులోకి  ఆపరేషన్‌ సిందూర్‌
    Jack : జాక్ ఎఫెక్టు.. రెమ్యూనేషన్‌ను వెనక్కి ఇచ్చిన సిద్ధూ టాలీవుడ్
    RCB Victory Parade: ఆర్సీబీ విజయోత్సవాలకు బెంగళూరు రెడీ.. మరికొన్నే గంటల్లో విక్టరీ పరేడ్‌! బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్

    తెలంగాణ

    KRMB: ఏపీ-తెలంగాణ మధ్య పాత ఒప్పందం ప్రకారమే నీటి పంపకాలు : కృష్ణా బోర్డు ఆంధ్రప్రదేశ్
    Telangana: ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్య 11 రేడియల్‌ రోడ్లపై ప్రభుత్వం కసరత్తు భారతదేశం
    Uttam Kumar Reddy: రేషన్‌ కార్డుల ద్వారా 40 లక్షల మందికి లబ్ధి.. మంత్రి ఉత్తమ్‌ ప్రకటన ఉత్తమ్ కుమార్‌రెడ్డి
    TG High Court: తెలంగాణ హైకోర్టులో నలుగురు కొత్త అదనపు న్యాయమూర్తుల నియామకం హైకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025