Page Loader
Jharkhand Polls: జార్ఖండ్‌లో ముగిసిన తొలి విడత ఓటింగ్.. పోలింగ్ శాతమెంతంటే..!
జార్ఖండ్‌లో ముగిసిన తొలి విడత ఓటింగ్.. పోలింగ్ శాతమెంతంటే..!

Jharkhand Polls: జార్ఖండ్‌లో ముగిసిన తొలి విడత ఓటింగ్.. పోలింగ్ శాతమెంతంటే..!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 13, 2024
05:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

జార్ఖండ్‌లో 13న తొలి విడత ఎన్నికల పోలింగ్ సమపూర్ణంగా ముగిసింది. రాష్ట్రం మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నా, ఈసారి 43 నియోజకవర్గాల్లోనే తొలి విడత ఓటింగ్ జరిగింది. ఉదయం నుంచే ఓటర్లు భారీ ఎత్తున పోలింగ్ బూత్‌లకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం పోలింగ్ ముగిసే సమయానికి 60 శాతానికి పైగా ఓటింగ్ నమోదైనట్లు అధికారులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ రోజంతా పోలింగ్ బూత్‌ల వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు క్యూలైన్లలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరొకవైపు, ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బలగాలు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

వివరాలు 

రెండవ విడత ఎన్నికలు ఈనెల 20న

ఈ సందర్భంగా జార్ఖండ్‌లో మాజీ టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోని, ఆయన భార్యతో కలిసి ఓటింగ్‌లో పాల్గొన్నారు. వారు రాంచీలోని ఓ పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. ధోనీని చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో, వారి రక్షణ కోసం భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇక ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఆయన భార్యతో కలిసి పోలింగ్‌లో పాల్గొన్నారు. ఈ ఎన్నికలు జార్ఖండ్‌లో రెండు విడతలుగా జరగనున్నాయి. తొలి విడత 13న పూర్తయిన తర్వాత, రెండవ విడత 20న జరగనుంది. మొత్తం ఎన్నికల ఫలితాలు నవంబర్ 23న విడుదల కానున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ధోనీని చూసేందుకు ఎగబడ్డ ప్రజలు