Page Loader
Mumbai-Pune Expressway: ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వేలో బస్సు ట్రాక్టర్‌ ఢీ.. ఐదుగురు యాత్రికుల దుర్మరణం, 30 మందికి పైగా గాయాలు
ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వేలో బస్సు ట్రాక్టర్‌ ఢీ..

Mumbai-Pune Expressway: ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వేలో బస్సు ట్రాక్టర్‌ ఢీ.. ఐదుగురు యాత్రికుల దుర్మరణం, 30 మందికి పైగా గాయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 16, 2024
11:48 am

ఈ వార్తాకథనం ఏంటి

ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వేలో వారి బస్సు ట్రాక్టర్‌ను ఢీకొనడంతో ఐదుగురు యాత్రికులు మరణించగా.. 30 మందికి పైగా గాయపడ్డారు. మృతులు వార్కారీలు (విఠ్ఠల్ స్వామి భక్తులు) ముంబై సమీపంలోని వారి స్వస్థలమైన డోంబివిలీ నుండి ఆషాధి ఏకాదశి వేడుకల కోసం పంఢర్‌పూర్‌కు వెళ్తున్నారని పోలీసులు తెలిపారు. అర్ధరాత్రి సమయంలో బస్సు ట్రాక్టర్‌ను ఢీకొని వాగులో పడింది.డిసిపి వివేక్ పన్సారే ఈ ప్రమాదంపై విలేకరులతో మాట్లాడారు. డోంబివిలీ నుండి మొత్తం 42 మంది ప్రయాణికులు పండర్‌పూర్‌కు వెళ్తుండగా అద్నే గ్రామం సమీపంలో వారి బస్సు ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించామని, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బస్సు ట్రాక్టర్‌ ఢీ