Gujarat Hostel: నమాజ్ చేస్తున్న విదేశీ విద్యార్థులపై దాడి.. గుజరాత్ యూనివర్సిటీలో ఘటన
అహ్మదాబాద్లోని గుజరాత్ యూనివర్శిటీలో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థులపై దాడి చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. హాస్టల్లో నమాజ్ చేసే విషయంలో అఫ్ఘానిస్థాన్, ఉజ్బెకిస్థాన్, శ్రీలంక దేశాల విద్యార్థులను పలువురి కొట్టారు. ఈ క్రమంలో రాళ్లు రువ్వడంతో వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడిలో ఐదుగురికి గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం అహ్మదాబాద్లోని ఎస్వీపీ ఆసుపత్రిలో చేర్పించారు. యూనివర్శిటీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్లు సీఐ ఎస్ఆర్ తెలిపారు. జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ ఒక గుంపు హాస్టల్లోకి ప్రవేశించి విదేశీ విద్యార్థులను కొట్టినట్లు ఏబీపీ న్యూస్ నివేదించింది.
స్పందించిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ
ఈ ఘటన నేపథ్యంలో గుజరాత్ యూనివర్సిటీ భద్రతపై నేషనల్ కాంగ్రెస్ అనుబంధ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) ప్రశ్నలు లేవనెత్తింది. ఈ విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ విషయంలో గుజరాత్ రాష్ట్ర హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘ్వీ సీనియర్ పోలీసు, పరిపాలన అధికారులతో మాట్లాడారు. గుజరాత్ యూనివర్సిటీలో జరిగిన ఈ ఘటనపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ముస్లింలు శాంతియుతంగా తమ మతాన్ని ఆచరిస్తున్నప్పుడు ఇలా చేయడం సిగ్గు చేటన్నారు. జమాల్పూర్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేదావాలా, మాజీ ఎమ్మెల్యే గ్యాసుద్దీన్ షేక్ సంఘటనా స్థలానికి చేసుకొని విద్యార్థులను అభినందించారు.