NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhra Pradesh: ఏపీలో రెండు నగరాల్లో ఫైవ్ స్టార్ హోటల్స్.. కొత్త పెట్టుబడులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Andhra Pradesh: ఏపీలో రెండు నగరాల్లో ఫైవ్ స్టార్ హోటల్స్.. కొత్త పెట్టుబడులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
    ఏపీలో రెండు నగరాల్లో ఫైవ్ స్టార్ హోటల్స్.. కొత్త పెట్టుబడులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

    Andhra Pradesh: ఏపీలో రెండు నగరాల్లో ఫైవ్ స్టార్ హోటల్స్.. కొత్త పెట్టుబడులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 21, 2025
    09:27 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రాష్ట్ర మంత్రి మండలి (కేబినెట్) సమావేశంలో పలు కీలక పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.

    రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) తీసుకున్న నిర్ణయాలను కేబినెట్ ఆమోదించింది.

    ఈ నిర్ణయాలతో పాటు రాష్ట్రంలో వివిధ కంపెనీల ద్వారా వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి.

    దీంతో రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి పనులకు బూస్ట్ లభించనుండగా, యువతకు విస్తృతంగా ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి.

    Details

    ప్రాంతాల వారీగా పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు

    విశాఖపట్నం బీచ్ రోడ్డులోని తాజ్ గేట్‌వేను, 'వరుణ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్' అభివృద్ధి చేయనుంది.

    ఇది 5-స్టార్ డీలక్స్ హోటల్‌గా, సర్వీస్ అపార్ట్‌మెంట్‌లుగా రూపుదిద్దుకోనుంది. రూ.899 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టు ద్వారా 1,300 మందికి ఉద్యోగాలు వస్తాయి.

    ప్రభుత్వం కూడా దీనికి ప్రోత్సాహకాలు అందించనుంది.

    తిరుపతిలో 'స్రవంతి హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్' రెండు హోటల్స్—IBIS స్టైల్స్ 3-స్టార్ హోటల్, నోవోటెల్ 5-స్టార్ హోటల్ నిర్మించనుంది. రూ.327 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టులో 570 మందికి ఉపాధి లభించనుంది.

    Details

    622మందికి ఉపాధి

    తిరుపతిలోని ఎస్‌వీపురం వడమాలపేట ప్రాంతంలో 'బెంగాల్ అల్టిమేట్ రిసార్ట్స్ ఎల్‌ఎల్‌పీ' సంస్థ 5-స్టార్ రిసార్ట్‌ను అభివృద్ధి చేయనుంది.

    ప్రభుత్వం భూమిని కేటాయించడం తో పాటు ప్రోత్సాహకాలు అందించనుంది. రూ.150 కోట్ల పెట్టుబడితో 350 మందికి ఉద్యోగాలు కలుగుతాయి.

    శ్రీసిటీలో డైకిన్ సంస్థ ఎయిర్ కండిషనింగ్ తయారీ యూనిట్‌ను విస్తరించనుంది. రూ.2,475 కోట్ల పెట్టుబడి పెట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా 5,150 మందికి ఉద్యోగాలు కలుగుతాయి.

    సెన్సొరెమ్ ఫోటోనిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్టు ద్వారా 622 మందికి ఉపాధి లభించనుంది.

    క్వాంటం వ్యాలీ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఐబీఎం, టీసీఎస్, ఎల్‌అండ్‌టీ వంటి సంస్థలతో ఒప్పందాలకు ఆమోదం తెలిపింది.

    Details

    మొత్తం రూ.9,246 కోట్ల పెట్టుబడులు, 7,766 ఉద్యోగాలు 

    ఈ ఐదు కంపెనీల ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో మొత్తం రూ.9,246 కోట్ల పెట్టుబడి రానుండగా, దాదాపు 7,766 మందికి ఉద్యోగావకాశాలు ఏర్పడనున్నాయి.

    ఇంకా ప్రోత్సాహక ప్యాకేజీలతో మరో 2,261 కోట్ల పెట్టుబడి

    మోహన్ స్పింటెక్స్ ఇండియా లిమిటెడ్, ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహక ప్యాకేజీలు ప్రకటించింది.

    ఈ రెండు సంస్థల ద్వారా రూ.2,261 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. వీటి ద్వారా 2,125 మందికి ఉపాధి లభించనుంది.

    Details

    అభివృద్ధి పనులకు మార్గం

    డెక్కన్ ఫైన్ కెమికల్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, పీయూఆర్ ఎనర్జీ, బ్లూ జెట్ హెల్త్‌కేర్, జూపిటర్ రెన్యూవబుల్స్ వంటి ప్రముఖ సంస్థల పెట్టుబడి ప్రతిపాదనలకు SIPB సిఫార్సు చేయగా, వాటిని కేబినెట్ ఆమోదించింది.

    ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడుల ప్రోత్సాహంతో అభివృద్ధి పనులకు బలమైన మార్గం వేస్తోంది.

    ఉద్యోగావకాశాలు, ఆర్థిక పురోగతికి అడుగులుగా భావిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Andhra Pradesh: ఏపీలో రెండు నగరాల్లో ఫైవ్ స్టార్ హోటల్స్.. కొత్త పెట్టుబడులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఆంధ్రప్రదేశ్
    Marco Rubio: శాంతి చర్చలు నిలిచిపోతే రష్యాపై కొత్త ఆంక్షలు విధిస్తాం: మార్కో రూబియో అమెరికా
    Vizianagaram: ఐఈడీ సిద్ధం చేస్తుండగా సిరాజ్‌ అరెస్ట్.. ఎఫ్‌ఐఆర్‌లో కీలక అంశాలు విజయనగరం
    HariHara VeeraMallu : నేడు హరిహర వీరమల్లు ప్రెస్ మీట్.. టైం, వేదిక, పవన్ హాజరుపై ఆసక్తి! పవన్ కళ్యాణ్

    ఆంధ్రప్రదేశ్

    AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్‌లో రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణం.. మిథున్‌రెడ్డి కీలక పాత్ర!  వైసీపీ
    ICSE Results : 2025 ICSE, ISC ఫలితాలు విడుదల.. వెబ్‌సైట్‌లో చెక్ చేసుకునే విధానం ఇదే! భారతదేశం
    Andhra Pradesh: క్వాంటం వ్యాలీగా అమరావతి.. ఐబీఎం, టీసీఎస్ , ఎల్ అండ్ టీలతో ఒప్పందం ! భారతదేశం
    Chandrababu: క్రియేటివ్‌ ల్యాండ్ ఆసియాతో ఒప్పందం.. 25వేల ఉద్యోగావకాశాలు! చంద్రబాబు నాయుడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025