NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / NHRC: ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్ ఎంపిక ప్రక్రియపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం 
    తదుపరి వార్తా కథనం
    NHRC: ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్ ఎంపిక ప్రక్రియపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం 
    ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్ ఎంపిక ప్రక్రియపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం

    NHRC: ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్ ఎంపిక ప్రక్రియపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 24, 2024
    11:06 am

    ఈ వార్తాకథనం ఏంటి

    జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఛైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి. రామసుబ్రమణియన్ నియమితులయ్యారు.

    అయితే ఈ ఎంపికపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది.

    ప్రత్యేకంగా, ఛైర్మన్ ఎంపికలో సరైన విధానాన్ని అనుసరించలేదని, ఈ ప్రక్రియ ప్రాథమిక స్థాయిలోనే లోపభూయిష్టంగా ఉందని ఆ పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది.

    ''ఇలాంటి ముఖ్యమైన అంశాల్లో సంప్రదాయమైన పరస్పర చర్చలు, ఏకాభిప్రాయం సాధన వంటి ప్రక్రియలను విస్మరించారు. సమావేశంలో లేవనెత్తిన చట్టపరమైన ఆందోళనలను పక్కనపెట్టి, సంఖ్యాపరమైన మెజార్టీ ఆధారంగా పేర్లను ఖరారు చేశారు'' అని కాంగ్రెస్ ఆరోపించింది.

    వివరాలు 

    ప్రస్తుత యాక్టింగ్ ఛైర్‌పర్సన్‌గా విజయభారతీ సయానీ

    ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఛైర్‌పర్సన్‌గా పనిచేసిన జస్టిస్ అరుణ్‌కుమార్ మిశ్రా ఈ ఏడాది జూన్ 1న పదవీ విరమణ చేయగా, విజయభారతీ సయానీ ప్రస్తుతం యాక్టింగ్ ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు.

    కొత్త ఛైర్‌పర్సన్ ఎంపిక కోసం డిసెంబర్ 18న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో జస్టిస్ రామసుబ్రమణియన్‌ను నియమించేందుకు నిర్ణయం తీసుకున్నారు.

    అంతేకాక, సభ్యులుగా ప్రియాంక్ కనూంగో, డాక్టర్ జస్టిస్ బిద్యుత్‌రంజన్ షడంగిలను కూడా నియమించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కాంగ్రెస్

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    కాంగ్రెస్

    Mallikarjun Kharge: ఖర్గే ట్రస్టుకు భూ కేటాయింపు.. కర్ణాటకలో మరో వివాదంలో చిక్కుకున్న కాంగ్రెస్ కర్ణాటక
    Congress on SEBI cheif: సెబీ చీఫ్ మాధవిపై కాంగ్రెస్ సంచలన ఆరోపణలు.. ఐసీఐసీఐ బ్యాంక్,మరో రెండు చోట్ల నుండి జీతం భారతదేశం
    Madhavi Puri: సెబీ చీఫ్ మాధవీ పురి బుచ్ వ్యవహారంలో ప్రశ్నలు లేవనెత్తిన కాంగ్రెస్  ఇండియా
    Bandru Shobharani: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి చెప్పు దెబ్బలు తింటావ్.. శోభారాణి బీఆర్ఎస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025