NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Baba Siddique:ఫ్లైట్ మోడ్, వైఫై: బాబా సిద్ధిక్ హత్య నిందితుడు అన్మోల్ బిష్ణోయ్‌ని ఎలా సంప్రదించాడంటే..! 
    తదుపరి వార్తా కథనం
    Baba Siddique:ఫ్లైట్ మోడ్, వైఫై: బాబా సిద్ధిక్ హత్య నిందితుడు అన్మోల్ బిష్ణోయ్‌ని ఎలా సంప్రదించాడంటే..! 
    ఫ్లైట్ మోడ్, వైఫై: బాబా సిద్ధిక్ హత్య నిందితుడు అన్మోల్ బిష్ణోయ్‌ని ఎలా సంప్రదించాడంటే..!

    Baba Siddique:ఫ్లైట్ మోడ్, వైఫై: బాబా సిద్ధిక్ హత్య నిందితుడు అన్మోల్ బిష్ణోయ్‌ని ఎలా సంప్రదించాడంటే..! 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 22, 2024
    11:39 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎన్‌సీపీ నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య కేసులో నిందితులు దర్యాప్తు అధికారుల దృష్టికి దొరక్కుండా చాలా పక్కా ప్లానింగ్‌తో వ్యవహరించినట్లు తెలుస్తోంది.

    ఈ కేసులో కీలక నిందితుడు ఆకాశ్‌దీప్‌ గిల్‌ను పోలీసులు విచారించగా ఆసక్తికరమైన వివరాలు వెలుగులోకి వచ్చాయి.

    కీలక వ్యూహం:

    ఆకాశ్‌దీప్‌ తన మాటల ప్రకారం, తన వ్యవసాయ కూలీ బల్వీందర్‌ హాట్‌స్పాట్‌ ద్వారా ఇంటర్నెట్‌ను ఉపయోగించి, సూత్రధారి అన్మోల్‌ బిష్ణోయ్‌తో పాటు ఇతర నిందితులైన శుభం లోంకర్‌, జీషాన్‌ అక్తర్‌, షూటర్‌ శివమ్‌కుమార్‌ గౌతమ్‌లతో సంభాషించినట్లు చెప్పారు.

    వివరాలు 

    మాయమాటల మాయాజాలం

    బల్వీందర్‌ హాట్‌స్పాట్‌ను ఉపయోగించడం ద్వారా తన స్థానం (లొకేషన్‌)ను గుర్తించకుండా ఆకాశ్‌దీప్‌ జాగ్రత్తగా వ్యవహరించాడు.

    అతడిని నవంబర్‌ 16న పంజాబ్‌లోని ఫజ్లికాలో పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో గిల్‌ తన మొబైల్‌ను ఫ్లైట్‌ మోడ్‌లో ఉంచి బల్వీందర్‌ హాట్‌స్పాట్‌ను వాడినట్లు వెల్లడించారు.

    గిల్‌ ఫోన్‌ను ఇప్పుడు తీవ్రస్థాయిలో పోలీసులు గాలింపు చేపట్టారు.దానిలో ఉన్న డేటా కేసుకు మరింత సహాయపడవచ్చని భావిస్తున్నారు.

    వివరాలు 

    అరెస్టులు,విచారణ: 

    ఈ కేసులో ఇప్పటివరకు 24 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల లాజిస్టిక్స్‌కు సాయం చేసిన ప్రధాన వ్యక్తిగా గిల్‌ పేరుకు వచ్చింది. ముంబయి కోర్టు నవంబర్‌ 23 వరకు అతని పోలీస్ కస్టడీని పొడిగించింది.

    అక్టోబర్‌ 12న ముంబయిలోని తన కుమారుడి కార్యాలయంలో ఉన్న బాబా సిద్ధిఖీపై దుండగులు కాల్పులు జరిపారు.

    తీవ్రంగా గాయపడిన సిద్ధిఖీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.

    ఆసుపత్రిలో ప్రధాన నిందితుడు శివ్‌కుమార్‌ దాదాపు 30 నిమిషాల పాటు ఉండి, సిద్ధిఖీ మరణం ఖాయమని తెలిసిన తర్వాత అక్కడి నుంచి పారిపోయినట్లు గుర్తించారు.

    ఈ హత్య కేసులో ఉపయోగించిన తుపాకీని పోలీసులు ఇంకా రికవరీ చేయలేకపోయారు. దర్యాప్తు కొనసాగుతుండగా, మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర
    అన్మోల్‌ బిష్ణోయ్‌

    తాజా

    ITRFiling: ఐటీఆర్ ఫైలింగ్‌లో ఫారం 16కు సంబంధించి కీలక మార్పులు.. జీతం పొందే ఉద్యోగులు తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయాలు ఆదాయపు పన్నుశాఖ/ఐటీ
    Tatkal Tkt Booking: జూలై 1 నుంచి తత్కాల్ టికెట్లకు కొత్త నిబంధనలు: మోసాల నివారణకు భారతీయ రైల్వే కీలక నిర్ణయం  రైల్వే శాఖ మంత్రి
    Gold Rate: మళ్లీ రూ.లక్ష మార్క్‌ దాటిన బంగారం ధర  బంగారం
    Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@25,100 స్టాక్ మార్కెట్

    మహారాష్ట్ర

    Pune Airport: పూణె విమానాశ్రయానికి పేరు మార్పు.. మహారాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదం భారతదేశం
    Ajinkya Rahane: బాంద్రాలో గ‌వాస్క‌ర్‌ స్థ‌లం స్వాధీనం.. అజింక్య ర‌హానేకు కేటాయింపు  ముంబై
    Talcum powder in antibiotics: ప్రభుత్వాసుపత్రుల్లో నకిలీ యాంటీబయాటిక్స్ సరఫరా.. మందుకు బదులు టాల్కం పౌడర్  భారతదేశం
    Ruta Awhad: 'లాడెన్ జీవిత చరిత్ర చదవండి': జితేంద్ర అవధ్‌ సతీమణి వ్యాఖ్యలపై దుమారం బీజేపీ

    అన్మోల్‌ బిష్ణోయ్‌

    Anmol Bishnoi: యూఎస్‌లో అన్మోల్‌ బిష్ణోయ్‌ ను ఏ నేరానికి అరెస్ట్ చేశారు? భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025