Hyderabad: హైదరాబాద్-విజయవాడ రూ.99కే.. ఫ్లిక్స్ బస్సులో లాంచింగ్ ఆఫర్
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ వాహనాలను (ఈవీ) ప్రోత్సహిస్తున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ఈటీవో మోటార్స్ సహకారంతో ఫ్లిక్స్ బస్ ఇండియా అందుబాటులోకి తెచ్చిన విద్యుత్ బస్సులను గురువారం బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి జెండా ఊపి ప్రారంభించారు.
ఈటీవో మోటార్స్ సీఎంవో వైఎస్ఆర్ రాజీవ్, ఫ్లిక్స్ బస్ ఇండియా ఎండీ సూర్య ఖురానా మాట్లాడుతూ, మూడు నుంచి నాలుగు వారాల్లో హైదరాబాద్-విజయవాడ మార్గంలో ఈవీ బస్సులను ప్రవేశపెడుతామని, తదుపరి విజయవాడ-విశాఖపట్నం మార్గంలో కూడా సేవలు అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు.
వివరాలు
త్వరలో స్లీపర్ కోచ్లతో కూడిన బస్సులు
సేవలు ప్రారంభమైన తర్వాత తొలినాలుగు వారాల పాటు ప్రయాణీకులు కేవలం రూ.99తో హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రయాణించే వీలుంటుందని తెలిపారు.
ఈ బస్సులు ఐదు గంటల్లో గమ్యస్థానానికి చేరుతాయని చెప్పారు.
అన్ని ప్రభుత్వ పథకాలు ఈ బస్సుల్లో కూడా వర్తిస్తాయని వివరించారు.
ఈ బస్సుల్లో 49 మంది ప్రయాణించే సదుపాయం ఉండేలా ఏర్పాటు చేసినట్టు తెలియజేశారు.
రాబోయే రోజుల్లో స్లీపర్ కోచ్లతో కూడిన బస్సులను కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు వెల్లడించారు.