NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Railway Safety: విజయవాడలో వరద ప్రభావం.. రైల్వే లైన్ల పాత్ర
    తదుపరి వార్తా కథనం
    Railway Safety: విజయవాడలో వరద ప్రభావం.. రైల్వే లైన్ల పాత్ర
    విజయవాడలో వరద ప్రభావం.. రైల్వే లైన్ల పాత్ర

    Railway Safety: విజయవాడలో వరద ప్రభావం.. రైల్వే లైన్ల పాత్ర

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 06, 2024
    12:11 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వరదల సమయంలో విజయవాడ నగరంలో సగం ప్రాంతం ముంచెత్తినా, మరో సగం సురక్షితంగా నిలిచింది.

    నాలుగు రోజుల పాటు విరుచుకుపడిన వరదలు కొన్ని ప్రాంతాలను తాకలేదు. ఈ రక్షణకు దశాబ్దాల క్రితం నిర్మించిన రైల్వే లైన్లు ముఖ్యంగా కారణంగా నిలిచాయి.

    విజయవాడకు ఎగువున, కాజీపేట రైల్వే డివిజన్ పరిధిలో బుడమేరు ప్రవాహం ప్రారంభమవుతుంది.

    విజయవాడ శివార్లలో కొండపల్లి వరకు కాజీపేట డివిజన్ పరిధిలో ఉంటుంది, తరువాత విజయవాడ డివిజన్ ప్రారంభమవుతుంది.

    నిజాం కాలంలో చెన్నై-న్యూఢిల్లీ మధ్య గ్రాండ్ ట్రంక్ రైల్వే లైన్ నిర్మాణ సమయంలో జాగ్రత్తలు తీసుకున్న రైల్వే లైన్ల ఆధునీకరణలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు.

    వివరాలు 

    హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వైపు నిర్మించిన లూప్ లైన్

    ఆగస్టు 31న అర్థరాత్రి విజయవాడలో వరద ముంచెత్తిన సమయంలో బుడమేరు ప్రవాహం ఒక్కసారిగా నగరంపై విరుచుకుపడకుండా రైల్వే కట్టలు అడ్డుగా నిలిచాయి.

    కొండపల్లి, రాయనపాడు, విజయవాడ నార్త్ క్యాబిన్ మీదుగా హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం వైపు నిర్మించిన లూప్ లైన్, బుడమేరు ప్రవాహాన్ని అడ్డుకుంది.

    కవులూరు-రాయనపాడు-శాంతి నగర్ మధ్య బుడమేరు ప్రవాహం గండ్లు పడటంతో, వరద నీరు వేగంగా విజయవాడను ముంచెత్తింది. అయితే, రైల్వే లైన్లు సగం నగరాన్ని కాపాడుతూ వరద తాకిడిని తట్టుకుని నిలిచాయి.

    వివరాలు 

    వరద ప్రవాహానికి నిరోధక నిర్మాణం 

    విజయవాడ రైల్వే స్టేషన్ సముద్ర మట్టానికి 19.354 మీటర్ల ఎత్తులో ఉంది. బుడమేరు ఉధృతికి సెప్టెంబర్ 1వ తేదీ సాయంత్రం నైజాం గేటుకు కిలోమీటర్ దూరంలో నీరు చేరింది.

    విజయవాడకు ఎగువున ఉన్న కొండపల్లి రైల్వే స్టేషన్ 31.730మీటర్ల ఎత్తులో ఉంది, రాయనపాడు రైల్వే స్టేషన్ 21.340మీటర్ల ఎత్తులో ఉంది.

    రైల్వే లైన్లు నిర్మించినప్పుడు భూమట్టానికి ఐదున్నర అడుగుల ఎత్తులో నిర్మాణం చేపడతారు.

    కోస్తా ప్రాంతాలలో అదనపు జాగ్రత్తలు తీసుకుంటారు. విజయవాడ మీదుగా గ్రాండ్ ట్రంక్ మార్గం, విశాఖపట్నం రైల్వే మార్గాలు రెండున్నర నుంచి మూడున్నర మీటర్ల ఎత్తులో ఉంటాయి.

    కోస్తా ప్రాంతంలో రైల్వే లైన్లు ఎనిమిదిన్నర నుంచి 12అడుగుల ఎత్తులో నిర్మించారు.సున్నితమైన ప్రాంతాల్లో నాలుగు నుంచి ఐదు మీటర్ల ఎత్తులో నిర్మించారు.

    వివరాలు 

    అదనపు భద్రత కోసం బల్బ్ లైన్ 

    బుడమేరు ప్రవాహాన్ని పరిగణలోకి తీసుకుని, రైల్వే అధికారులు అదనపు జాగ్రత్తలు తీసుకున్నారు. బ్రిటిష్ కాలంలో విస్తరించిన రైల్వే లైన్ల నిర్మాణంలో ఈ జాగ్రత్తలు పాటించారు.

    35 సంవత్సరాల క్రితం నిర్మించిన లూప్ లైన్ అదనపు భద్రతను అందించింది.

    విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వైపు ప్రయాణించే రైళ్లు సాధారణంగా విజయవాడలో ఇంజిన్ దిశ మార్చుకుని ప్రయాణిస్తుంటాయి.

    80వ దశకంలో, పాత రాజరాజేశ్వరిపేట-కొత్త రాజరాజేశ్వరి పేట మీదుగా విశాఖమార్గాన్ని కలుపుతూ బల్బ్ లైన్ నిర్మించారు.

    ఈ లైన్ నిర్మాణం తర్వాత, సరుకు రవాణా వాహనాలు విజయవాడ రాకుండా హైదరాబాద్-కాజీపేట-విశాఖపట్నం మార్గంలో ప్రయాణించగలిగాయి.

    వివరాలు 

    విశాఖ-హైదరాబాద్ మధ్య నడిచే రైళ్లు బల్బ్ లైన్ మీదుగా..

    విజయవాడ రైల్వే స్టేషన్‌పై ఒత్తిడి పెరగడం, ప్రకృతి విపత్తులు, రైల్వే లైన్ల నిర్వహణ, మరమ్మతుల సమయంలో గత కొన్ని సంవత్సరాలుగా ప్రయాణికుల రైళ్లు నడుస్తున్నాయి.

    గత ఆగస్టులో విశాఖ-హైదరాబాద్ మధ్య నడిచే రైళ్లు బల్బ్ లైన్ మీదుగా నడిపారు. బుడమేరు పరివాహక ప్రాంతంలో నిర్మించిన ఈ లైన్ గుణదల స్టేషన్ మీదుగా రామవరప్పాడు వరకు వెళుతుంది.

    విజయవాడ నగరానికి వెలుపల ఉన్న ఈ పొడవైన రైల్వే నిర్మాణమే 31వ తేదీన వరద నగరంపై విరుచుకుపడకుండా అడ్డుపడింది. మధ్యలో ఉన్న నివాస ప్రాంతాలకు వరద పోటెత్తకుండా నియంత్రించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విజయవాడ సెంట్రల్

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    విజయవాడ సెంట్రల్

    జనవరిలోనే సికింద్రాబాద్-విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలెక్కనుందా? నరేంద్ర మోదీ
    పాస్‌పోర్ట్ ఆఫీస్‌లు శనివారం కూడా తెరిచే ఉంటాయ్  ఆంధ్రప్రదేశ్
    రికార్డు బద్దలు కొట్టిన ఏపీ జెన్ కో.. ఒక్కరోజులో 105.602 మిలియన్ యూనిట్ల విద్యుత్ విద్యుత్
    'గొట్టంగాళ్లు' అంటూ టీడీపీ ఇన్‌చార్జులపై  కేశినేని నాని ధ్వజం ఎంపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025