NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / క్రమంగా తగ్గుతున్న యమునా ప్రవాహం.. దిల్లీ వీధుల్లో ఇంకా తగ్గని వరద ప్రభావం
    తదుపరి వార్తా కథనం
    క్రమంగా తగ్గుతున్న యమునా ప్రవాహం.. దిల్లీ వీధుల్లో ఇంకా తగ్గని వరద ప్రభావం
    దిల్లీ వీధుల్లో ఇంకా తగ్గని వరద ప్రభావం

    క్రమంగా తగ్గుతున్న యమునా ప్రవాహం.. దిల్లీ వీధుల్లో ఇంకా తగ్గని వరద ప్రభావం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 14, 2023
    11:31 am

    ఈ వార్తాకథనం ఏంటి

    గత కొన్ని రోజులుగా దిల్లీ రాజధానిని వణికిస్తోన్న యమునా నది ప్రస్తుతం శాంతిస్తోంది. క్రమంగా వర్షాలు తగ్గుముఖం పడుతుండటంతో నీటి ప్రవాహం తగ్గిపోతోంది.

    కానీ మహానగర వీధుల్లో వరద ప్రభావం పూర్తిగా తొలగిపోలేదు. సిటీలోని చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలోనే మగ్గిపోతున్నాయి. మురికి కాలువలు పొంగి పొర్లడంతో ట్రాఫిక్ విభాగం పలు సూచనలు చేసింది.

    ఈ మేరకు దిల్లీలోని భైరాన్ రోడ్డు, వికాస్‌ మార్గ్‌లో రాకపోకలను నిలిపేసింది. యమునా బ్యాంక్‌ మెట్రో స్టేషన్‌ను సైతం క్లోజ్ చేశారు.

    పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. వరద ప్రభావంతో విద్యాసంస్థలనూ జులై 16 వరకు మూసివేశారు. నిత్యావసర వస్తువుల వాహనాలను మినహాయించి భారీ సరకుతో వచ్చే వాటి రాకపోకలపై నిషేధాజ్ఞలు ఉన్నాయి.

    DETAILS

    ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్‌ సహాయం అర్థించిన దిల్లీ సర్కారు

    యమునా నది నీరు తిరిగి నగరంలోకే ప్రవేశిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దిల్లీ ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ హెడ్ రెగ్యులేటర్‌ దెబ్బతినడమే కారణంగా తెలుస్తోంది.

    ఈ మేరకు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ అలెర్ట్ అయ్యారు. వెంటనే ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్‌ సహాయం కోసం ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు.

    వర్షాలు క్రమంగా వెనక్కి వెళ్లడంతో గురువారం రాత్రి నుంచి యమున శాంతిస్తోంది. ఈ ఉదయం 6 గంటలకు నీటి మట్టం 208.46 మీటర్లగా ఉంది.

    అయినప్పటికీ ప్రమాద స్థాయి కంటే మూడు మీటర్లు ఎక్కువగానే ప్రవహిస్తోంది.

    దిల్లీలో శుక్రవారం తేలికపాటి జల్లులు కురుస్తాయని భారత వాతావారణ శాఖ అంచనా వేసింది.శనివారానికి సంబంధించి ఎల్లో అలర్ట్‌ జారీ చేశామని పేర్కొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    వరదలు
    అరవింద్ కేజ్రీవాల్

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    దిల్లీ

    ఫోన్లో హైజాక్ అని అరిచిన వ్యక్తి అరెస్ట్.. లేట్ గా బయల్దేరిన విమానం విమానం
    మరోసారి ఈటల,రాజగోపాల్‌ రెడ్డిలకు దిల్లీకి రమ్మని కబురు.. అధినాయకత్వంతో కీలక చర్చలు భారతీయ జనతా పార్టీ/బీజేపీ
    15గంటల్లో 286 మెట్రో స్టేషన్లలో ప్రయాణం; దిల్లీ వ్యక్తి గిన్నిస్ రికార్డు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్
    డ్యూటీ అవర్స్ ముగిశాయని ఫ్లైట్ నడపనన్న పైలట్.. విమానంలోనే 350 మంది ప్రయాణికులు ఎయిర్ ఇండియా

    వరదలు

    అసోంలో ముంచెత్తుతున్న వానలు; వరదల్లో చిక్కుకున్న 1.2లక్షల మంది   అస్సాం/అసోం
    అసోంలో వరదల బీభత్సం; 22 జిల్లాలు జలమయం; ఒకరు మృతి అస్సాం/అసోం
    నైరుతి విస్తరణతో దేశమంతటా భారీ వర్షాలు.. వరదలో చిక్కుకున్న హిమాచల్ వాసులు  హిమాచల్ ప్రదేశ్
    ఉత్తరాదిలో కుంభవృష్టి.. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని హెచ్చరికలు దిల్లీ

    అరవింద్ కేజ్రీవాల్

    దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు వాదించేందుకు లాయర్లకు ఆప్ ప్రభుత్వం రూ.కోట్ల ఫీజు చెల్లింపు దిల్లీ
    ఆమ్ ఆద్మీ పార్టీకి ఝలక్: ప్రకటనల సొమ్ము రూ. 163కోట్లు చెల్లించాలని డీఐపీ నోటీసులు ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    కేసీఆర్ మాకు పెద్దన్నలాంటి వారు: దిల్లీ సీఎం కేజ్రీవాల్ భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    దిల్లీ: 'మీకు వడ్డించడం అంటే చాలా ఇష్టం', కేజ్రీవాల్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ కౌంటర్ దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025