NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఫ్రాన్స్ నుంచి ప్రధాని మోదీ ఫోన్.. దిల్లీ వరదలపై అమిత్ షాతో సమీక్ష
    తదుపరి వార్తా కథనం
    ఫ్రాన్స్ నుంచి ప్రధాని మోదీ ఫోన్.. దిల్లీ వరదలపై అమిత్ షాతో సమీక్ష
    దిల్లీ వరదలపై అమిత్ షాతో సమీక్ష

    ఫ్రాన్స్ నుంచి ప్రధాని మోదీ ఫోన్.. దిల్లీ వరదలపై అమిత్ షాతో సమీక్ష

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 14, 2023
    10:12 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం దిల్లీలో వరదల పరిస్థితిపై ఆరా తీశారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారు.

    దేశ రాజధాని పరిసరాల్లో గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు యమునా నది మహోగ్రరూపం దాల్చింది. ఈ క్రమంలోనే ఉత్తరాది వాసులు భయాందోళనకు గురవుతున్నారు.

    మరోవైపు దిల్లీ వరదల పరిస్థితి గురించి ప్రధాని మోదీ షాను అడిగి తెలుసుకున్నారు. రానున్న 24 గంటల్లో యమునా నదిలో నీటిమట్టం తగ్గుముఖం పడుతుందని భావిస్తున్నట్లు అమిత్ షా ప్రధానికి వివరించారు.

    ఈ మేరకు దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తో కలిసి వరద పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని మోదీ దృష్టికి తీసుకెళ్లారు.

    DETAILS

    ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సరిపడ సంఖ్యలో ఉన్నాయి: షా

    విపత్తును ఎదుర్కోనేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్ (జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు) సరిపడ సంఖ్యలో ఉన్నాయని షా మోదీతో అన్నట్లు తెలుస్తోంది.

    రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టేందుకు సహాయ బృందాలను భారీగా మోహరించామని అమిత్ షా అన్నారు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న యమునా నది వరద నీరు గురువారం మహానగరంలోని అనేక ప్రాంతాలను తీవ్రంగా ప్రభావితం చేసింది.

    దిల్లీ వరదలు మహానగర వాసుల రోజూ వారి జీవన విధానాన్ని అతలాకుతలం చేసిందని షా భావిస్తున్నారు.

    జూలై 16 వరకు రాజధాని ప్రాంతంలోని అన్ని పాఠశాలలు, కాలేజీలను మూసేయాలని ఈ మేరకు కేంద్రం తరుపున షా ఆదేశించారు.

    అయితే బాస్టిల్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

     అమిత్ షా కి ఫ్రాన్స్ నుంచి ప్రధాని మోదీ ఫోన్ 

    PM Modi calls up Home Minister Amit Shah from France, enquires about flood-like situation in Delhi: Sources

    — Press Trust of India (@PTI_News) July 13, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    నరేంద్ర మోదీ
    అమిత్ షా
    ఫ్రాన్స్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    దిల్లీ

    నేడు దిల్లీకి మంత్రి కేటీఆర్.. పెండింగ్ ప్రాజెక్టుల కోసం అమిత్ షాతో కీలక భేటీ  కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    ఫోన్లో హైజాక్ అని అరిచిన వ్యక్తి అరెస్ట్.. లేట్ గా బయల్దేరిన విమానం విమానం
    మరోసారి ఈటల,రాజగోపాల్‌ రెడ్డిలకు దిల్లీకి రమ్మని కబురు.. అధినాయకత్వంతో కీలక చర్చలు భారతీయ జనతా పార్టీ/బీజేపీ
    15గంటల్లో 286 మెట్రో స్టేషన్లలో ప్రయాణం; దిల్లీ వ్యక్తి గిన్నిస్ రికార్డు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్

    నరేంద్ర మోదీ

    భారత్ సాధించిన డిజిటల్ పురోగతి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది: ప్రవాసులను ఉద్దేశించి మోదీ ప్రసంగం  అమెరికా
    'ఆర్డర్ ఆఫ్ ది నైల్': ప్రధాని మోదీకి ఈజిప్ట్ అత్యున్నత పురస్కారం  ఈజిప్ట్
    భారత్-అమెరికా స్నేహం ప్రపంచంలోనే అత్యంత కీలకమైనది: బైడెన్ అమెరికా
    పాట్నలో సమావేశమైన ప్రతిపక్ష కూటమిని 'వాగ్నర్ గ్రూప్' గా పోల్చిన ఉద్ధవ్ ఠాక్రే ఉద్ధవ్ థాకరే

    అమిత్ షా

    త్రిపురలో అసెంబ్లీ పోరు: 'రథయాత్ర'తో ప్రజల్లోకి బీజేపీ త్రిపుర
    తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి? ఆ నలుగురిలో వరించేదెవరిని? బీజేపీ
    అదానీ వ్యవహారంపై మౌనం వీడిన అమిత్ షా భారతీయ జనతా పార్టీ/బీజేపీ
    అమిత్ షా నేతృత్వంలో బీజేపీ నేతల సమావేశం; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ తెలంగాణ

    ఫ్రాన్స్

    సిస్టర్ ఆండ్రీ : ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు కన్నుమూత అంతర్జాతీయం
    కార్బన్-ఫైబర్ ప్యానెల్స్‌తో రెస్టో-మోడెడ్ 1602 ను ప్రదర్శించిన BMW కార్
    'ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేతల్లో ప్రధాని మోదీ నంబర్ 1' నరేంద్ర మోదీ
    8 మందిపై క‌త్తితో విరుచుకుపడ్డ సైకో.. ముగ్గురు చిన్నారుల పరిస్థితి ఆందోళనకరం ప్రపంచం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025