NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / యమునా వరదలపై ఆప్ సంచలన ఆరోపణలు.. బీజేపీ కుట్రే అంటున్న కేజ్రీవాల్ సర్కార్
    తదుపరి వార్తా కథనం
    యమునా వరదలపై ఆప్ సంచలన ఆరోపణలు.. బీజేపీ కుట్రే అంటున్న కేజ్రీవాల్ సర్కార్
    బీజేపీ కుట్రే అంటున్న దిల్లీ మంత్రులు

    యమునా వరదలపై ఆప్ సంచలన ఆరోపణలు.. బీజేపీ కుట్రే అంటున్న కేజ్రీవాల్ సర్కార్

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 15, 2023
    03:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీని వరదలు ముంచేస్తున్న తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. యమునా వరదలు బీజేపీ సృష్టి అంటూ ఆప్ ప్రభుత్వం బాంబ్ పేల్చింది.

    హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజీ నుంచి దిల్లీలోని యమునా నదీలోకి అదనపు వరద నీటిని విడుదల చేశారు. దీంతో దేశ రాజధాని వీధులన్నీ యమునా వరదలతో నీట మునిగాయి.

    బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేయడం కుట్రలో భాగంగానే జరిగినట్లు ఆప్ వాదిస్తోంది.

    యమునా నది నీటి మట్టం రికార్డు స్థాయిలో 208.66 మీటర్లకు చేరుకొని 45ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. దీంతో దిల్లీ మహానగర వాసులు బెంబెలిత్తిపోయారు.

    DETAILS

    పశ్చిమ కాలువకు, యూపీలోని తూర్పు కాలువకు నీరు విడుదల చేయలేదు : ఆప్

    హత్నికుండ్ నుంచి హర్యానాలోని పశ్చిమ కాలువకు గానీ, ఉత్తర్‌ప్రదేశ్‌లోని తూర్పు కాలువకు గానీ నీరు విడుదల చేయకుండా దిల్లీ కాలువకు మాత్రమే నీటిని వదలడంపై ఆప్ అనుమానం వ్యక్తం చేస్తోంది.

    రాజధానిని ఉద్దేశపూర్వకంగానే ముంచేశారని దిల్లీ నీటిపారుదల, వరద నిర్వహణశాఖ మంత్రి సౌరభ్ బరద్వాజ్ ఆరోపించారు.

    హత్నికుండ్ బ్యారేజీ నుంచి వరద మొత్తాన్ని కేవలం దిల్లీకి మాత్రమే విడుదల చేశారని విమర్శించారు.

    పర్యానా వరద నీరు దిల్లీలో దీనస్థితికి కారణమైందని మండిపడ్డారు.

    కొవిడ్ సమయంలోనూ కేంద్రం దిల్లీ సర్కారును నిందించేందుకు కుట్రలు చేసిందని గుర్తుచేశారు.

    వర్షాలు క్రమంగా తగ్గుతుండటంతో యమునా సాధారణ స్థితికి చేరుకుంటోంది. మరో 12 గంటల్లోగా పరిస్థితులు చక్కదిద్దుకుంటాయని మరో మంత్రి అతిషి పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    వరదలు

    తాజా

    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి
    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్

    దిల్లీ

    డ్యూటీ అవర్స్ ముగిశాయని ఫ్లైట్ నడపనన్న పైలట్.. విమానంలోనే 350 మంది ప్రయాణికులు ఎయిర్ ఇండియా
    సినీ ఫక్కిలో భారీ చోరీ.. దిల్లీలో గన్నులతో బెదిరించి డబ్బులతో జంప్ కెమెరా
    ఎయిర్‌ఇండియా విమానంలో మరో వివాదం..ఫ్లైట్ గాల్లో ఉండగానే ప్రయాణికుడి మూత్ర విసర్జన ఎయిర్ ఇండియా
    రిటైర్మెంట్ రోజు హైకోర్టు న్యాయమూర్తి రికార్డు.. 65 తీర్పులిచ్చిన జస్టిస్ ముక్తా గుప్తా హైకోర్టు

    ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్

    ఆమ్ ఆద్మీ పార్టీకి ఝలక్: ప్రకటనల సొమ్ము రూ. 163కోట్లు చెల్లించాలని డీఐపీ నోటీసులు దిల్లీ
    దిల్లీ లిక్కర్ స్కామ్‌: రెండో చార్జ్‌షీట్‌లో దిల్లీ సీఎం కేజ్రీవాల్, కవిత పేర్లు దిల్లీ
    పవర్ డిస్కమ్ బోర్డుల నుంచి ఆప్ నామినీలను తొలగించిన లెఫ్టినెంట్ గవర్నర్ దిల్లీ
    దిల్లీ మద్యం కేసు: మనీష్ సిసోడియాకు మరోసారి సీబీఐ నోటీసులు జారీ దిల్లీ

    వరదలు

    అసోంలో ముంచెత్తుతున్న వానలు; వరదల్లో చిక్కుకున్న 1.2లక్షల మంది   అస్సాం/అసోం
    అసోంలో వరదల బీభత్సం; 22 జిల్లాలు జలమయం; ఒకరు మృతి అస్సాం/అసోం
    నైరుతి విస్తరణతో దేశమంతటా భారీ వర్షాలు.. వరదలో చిక్కుకున్న హిమాచల్ వాసులు  హిమాచల్ ప్రదేశ్
    ఉత్తరాదిలో కుంభవృష్టి.. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని హెచ్చరికలు దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025