NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / వరద గుప్పిట్లో దిల్లీ.. వరద ప్రాంతాల్లో 11.30 గంటలకు సీఎం కేజ్రీవాల్ పర్యటన
    తదుపరి వార్తా కథనం
    వరద గుప్పిట్లో దిల్లీ.. వరద ప్రాంతాల్లో 11.30 గంటలకు సీఎం కేజ్రీవాల్ పర్యటన
    వరద గుప్పిట్లో దిల్లీ

    వరద గుప్పిట్లో దిల్లీ.. వరద ప్రాంతాల్లో 11.30 గంటలకు సీఎం కేజ్రీవాల్ పర్యటన

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 13, 2023
    10:53 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీ మహానగరం వరద గుప్పిట్లో ఉండిపోయింది. గత కొద్ది రోజులుగా ఉత్తరాదిలో కురుస్తున్న భారీ వర్షాలకు దిల్లీ, హర్యానా రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి.

    ఈ మేరకు గురువారం ఉదయం 7 గంటలకు యమునా నదిలో 208.46 మీటర్ల మేర వరద ప్రవాహం కొనసాగుతోంది.

    హర్యానాలోని హత్నికుండ్‌ బ్యారేజీ నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. వరద ముప్పు మరింత పొంచి ఉందని కేంద్ర జల సంఘం హెచ్చరించింది.

    1978లో యమునా 207.49 మీటర్ల మేర ప్రవహించింది. తాజా వరదలతో 45 ఏళ్ల రికార్డు బద్దలైపోయింది. రానున్న 5, 6 రోజులు దిల్లీలో మోస్తరు వర్షాలు కురవనున్నట్లు ఐఎండీ వెల్లడించింది.

    208.46 మీటర్లతో ప్రమాద హెచ్చరికల కంటే 3 మీటర్లు అధిక ఎత్తులో యమునా ప్రవహిస్తోంది.

    details

    ఇప్పటికే 16500 మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు

    మరోవైపు వరదలతో లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న దాదాపు 16,500 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సిటీలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి.

    మఠం మార్కెట్ ప్రాంతాలు, యమునా బజార్, గర్హి మందు, గీతాఘాట్, విశ్వకర్మ కాలనీ, ఖద్దా కాలనీ, పాత రైల్వే బ్రిడ్జి సమీపంలోని నీలి ఛత్రి దేవాలయం పరిసరాలు, నీమ్ కరోలి గౌశాల, వజీరాబాద్ నుంచి మజ్ను కతిలా వరకు రింగ్‌ రోడ్‌లోని పలు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.

    దేశ రాజధానిలో తాగునీటిని సరఫరా చేసే వజీరాబాద్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ మూసేశారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉదయం 11:30 గంటలకు ఆయా ప్రాంతాల్లో పర్యటించనున్నారు.

    details

    పాఠశాలలు బంద్, శ్మాశాన వాటిక సైతం నిలుపుదల

    యమునా నదికి సమీపంలో ఉన్న గీతా కాలనీ శ్మశానవాటికను సైతం మూసివేశారు. దానికి బదులుగా ఘాజీపూర్ శ్మశాన వాటికను దహన సంస్కారాలకు ఉపయోగించాలని దిల్లీ బల్దియా సూచించింది.

    వరదల కారణంగా సివిల్ లైన్స్ జోన్‌లోని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న 10 పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఆయా పాఠశాలల విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించనున్నారు.

    మధ్యాహ్నం 2 గంటల నుంచి హర్యానా బ్యారేజీ ప్రవాహం తగ్గిపోనుందని అంచనా వేశారు. మరోవైపు ఎగువన ఉత్తరాఖండ్‌లో రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు ఐఎండీ అంచనా వేసింది. దింతో వరదలను మరింత పెంచుతుందని అధికారులు భావిస్తున్నారు.

    embed

    వరద గుప్పిట్లో దిల్లీ 

    #WATCH | Civil Lines area of Delhi flooded, latest visuals from the area. Several areas of the city are reeling under flood and water-logging as the water level of river Yamuna continues to rise following heavy rainfall and the release of water from Hathnikund Barrage. pic.twitter.com/UecZsfIBwb— ANI (@ANI) July 13, 2023

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    దిల్లీ కశ్మీరి గేట్ వద్ద వరద

    #WATCH | Delhi: Low-lying areas near Kashmiri gate flooded due to the rise in the water level of river Yamuna. pic.twitter.com/wgSNhB669c

    — ANI (@ANI) July 13, 2023

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    రోడ్డుకు సమాంతరంగా వరద నీరు

    #WATCH | Traffic affected after GT Karnal road in Delhi gets flooded after rise in water level of Yamuna River pic.twitter.com/hoaKTR2ZCr

    — ANI (@ANI) July 13, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    వరదలు

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    దిల్లీ

    దిల్లీ 24 గంటల్లోనే 4హత్యలు; లెఫ్టినెంట్ గవర్నర్‌కు కేజ్రీవాల్ ఘాటైన లేఖ అరవింద్ కేజ్రీవాల్
    త్వరలో ట్రక్కుల్లో ఏసీ డ్రైవర్ క్యాబిన్‌లు ఏర్పాటు: నితిన్ గడ్కరీ నితిన్ గడ్కరీ
    603 రోజులు 5స్టార్ హోటల్‌లో బస; బిల్లుకట్టకుండానే పారిపోయిన ఘనుడు విమానాశ్రయం
    రూ.2 కోట్లు ఇవ్వకుంటే నరేంద్ర మోదీని, అమిత్ షాను చంపేస్తామని బెదిరింపు కాల్స్  ప్రధాన మంత్రి

    వరదలు

    అసోంలో ముంచెత్తుతున్న వానలు; వరదల్లో చిక్కుకున్న 1.2లక్షల మంది   అస్సాం/అసోం
    అసోంలో వరదల బీభత్సం; 22 జిల్లాలు జలమయం; ఒకరు మృతి అస్సాం/అసోం
    నైరుతి విస్తరణతో దేశమంతటా భారీ వర్షాలు.. వరదలో చిక్కుకున్న హిమాచల్ వాసులు  హిమాచల్ ప్రదేశ్
    ఉత్తరాదిలో కుంభవృష్టి.. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని హెచ్చరికలు దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025