NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మధ్యప్రదేశ్‌ ప్రభుత్వంపై 50శాతం కమీషన్ ఆరోపణలు; ప్రియాంక గాంధీపై కేసు నమోదు
    తదుపరి వార్తా కథనం
    మధ్యప్రదేశ్‌ ప్రభుత్వంపై 50శాతం కమీషన్ ఆరోపణలు; ప్రియాంక గాంధీపై కేసు నమోదు
    మధ్యప్రదేశ్‌ ప్రభుత్వంపై 50శాతం కమీషన్ ఆరోపణలు; ప్రియాంక గాంధీపై కేసు నమోదు

    మధ్యప్రదేశ్‌ ప్రభుత్వంపై 50శాతం కమీషన్ ఆరోపణలు; ప్రియాంక గాంధీపై కేసు నమోదు

    వ్రాసిన వారు Stalin
    Aug 13, 2023
    11:51 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ప్రియాంక గాంధీ, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌, అరుణ్‌ యాదవ్‌ల ట్విట్టర్‌ ఖాతా హ్యాండ్లర్లపై సంయోగితాగంజ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

    మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలకు సంబంధించిన ఒక పోస్టును రీ ట్వీట్ చేయడంపై అధికార పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    దీంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తును ప్రారంభించారు.

    బీజేపీ లీగల్ సెల్ ఇండోర్ యూనిట్ కన్వీనర్ నిమేష్ పాఠక్ ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు.

    రాష్ట్రంలో బీజేపీ పాలన అవినీతిలో కూరుకుపోయిందని కాంగ్రెస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియా పోస్టులను షేర్ చేస్తున్నట్లు పాఠక్ ఆరోపించారు.

    రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు కాంగ్రెస్ నేతలు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు.

    కాంగ్రెస్

    మధ్యప్రదేశ్‌లోనూ కర్ణాటక ఫలితాలే పునరావృతం: ప్రియాంక గాంధీ

    సంయోగితగంజ్ పోలీస్ స్టేషన్‌లో ప్రియాంక గాంధీ వాద్రా, కమల్‌నాథ్, అరుణ్ యాదవ్‌ల ట్విట్టర్ ఖాతాల హ్యాండ్లర్లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రామ్‌సనేహి మిశ్రా తెలిపారు.

    మధ్యప్రదేశ్‌కు చెందిన కాంట్రాక్టర్ల సంఘం 50శాతం కమీషన్ చెల్లించిన తర్వాతే తమకు బిల్లులు చెల్లిస్తున్నారని ఫిర్యాదు చేస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిందని ప్రియాంక గాంధీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

    కర్ణాటకలోని అవినీతి బీజేపీ ప్రభుత్వం 40%కమీషన్ వసూలు చేసిందని, ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో బీజేపీ తన అవినీతి రికార్డును తానే బద్దలు కొట్టినట్లు ప్రియాంక ఆరోపించారు.

    కర్ణాటక ప్రజలు 40%కమీషన్‌ ప్రభుత్వాన్ని గద్దె దించారని, ఇప్పుడు మధ్యప్రదేశ్ ప్రజలు 50%కమీషన్‌ ప్రభుత్వాన్ని అధికారం నుంచి తొలగిస్తారని ఆమె పోస్ట్‌లో ఆరోపించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మధ్యప్రదేశ్
    ప్రియాంక గాంధీ
    కాంగ్రెస్
    బీజేపీ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    మధ్యప్రదేశ్

    దక్షిణాఫ్రికా నుంచి మధ్యప్రదేశ్‌కు చేరుకున్న 12 చిరుతలు సౌత్ ఆఫ్రికా
    సిధి: మధ్యప్రదేశ్‌లో ఆగి ఉన్న బస్సులను ఢీకొన్న ట్రక్కు- 14మంది దుర్మరణం రోడ్డు ప్రమాదం
    హెచ్3ఎన్2 వైరస్: మహారాష్ట్ర, దిల్లీలో హై అలర్ట్; దేశంలో 9కి చేరిన మరణాలు మహారాష్ట్ర
    ఇండోర్ ఆలయంలో కూలిపోయిన మెట్లబావి; 13మంది మృతి ఇండోర్

    ప్రియాంక గాంధీ

    మోదీ జీ, మీ మాట కోసమే న్యాయం వేచి చేస్తోంది: ప్రియాంక గాంధీ  తాజా వార్తలు
    మే 8న హైదరాబాద్‌కు రానున్న ప్రియాంక గాంధీ  తాజా వార్తలు
    నేడు హైదరాబాద్‌కు ప్రియాంక గాంధీ రాక: అమె 'పొలిటికల్ టూరిస్ట్' అంటూ కేటీఆర్ ఫైర్ కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు? ఇంకా వీడని ఉత్కంఠ  కర్ణాటక

    కాంగ్రెస్

    రాజస్థాన్‌లో కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. ఎన్నికల నోటిఫికేషన్ ముందే అభ్యర్థుల ప్రకటన! రాజస్థాన్
    నేడు ఖమ్మం సభకు రాహుల్ గాంధీ; కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల శంఖారావం  ఖమ్మం
    కర్ణాటక తరహాలోనే తెలంగాణలో అధికారంలోకి వస్తాం: ఖమ్మం సభలో రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    కాంగ్రెస్‌లోకి వైఎస్ షర్మిల రావడాన్ని ఆహ్వానిస్తున్నాం : మాజీ ఎంపీ కేవీపీ వైఎస్ షర్మిల

    బీజేపీ

    పంచాయతీ పోలింగ్ వేళ, పశ్చిమ బెంగాల్‌లో చెలరేగిన హింస; 15మది మృతి  పశ్చిమ బెంగాల్
    దిల్లీ ఆర్డినెన్స్‌పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు దిల్లీ
    Article 370: ఆర్టికల్ 370 పిటిషన్లపై ఆగస్టు 2 నుంచి సుప్రీంకోర్టులో విచారణ  ఆర్టికల్ 370
    'బ్రిజ్ భూషణ్ రెజ్లర్లను లైంగికంగా వేధించారు', ఛార్జిషీట్‌లో దిల్లీ పోలీసులు రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్ ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025