NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / KCR: నేడు నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్‌
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    KCR: నేడు నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్‌

    KCR: నేడు నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్‌

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 11, 2025
    08:53 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై నియమించిన న్యాయ విచారణ కమిషన్‌ పని ఇప్పుడు తుది దశలోకి ప్రవేశించింది.

    ఇప్పటివరకు ఈ కమిషన్‌ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ప్రశ్నించి వివరాలు సేకరించారు.

    తాజాగా మాజీ మంత్రుల విచారణను ప్రారంభించింది. ఇదే తరహాలో బుధవారం మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావును (కేసీఆర్‌) కమిషన్‌ క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేయనుంది.

    ఈ విచారణ బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో ఉదయం 11:30 గంటలకు ప్రారంభమవుతుంది.

    వివరాలు 

    సీపేజ్‌, కుంగింపుల నేపథ్యంలో కమిషన్‌ 

    మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం,అలాగే అన్నారం,సుందిళ్ల బ్యారేజీల్లో సీపేజ్ సమస్యలు ఏర్పడటంతో, 2023 మార్చిలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పీసీ ఘోష్‌ను నాయకత్వంలో న్యాయ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

    అప్పటి నుంచి బ్యారేజీలకు సంబంధించిన నిర్మాణ ఇంజినీర్లు, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్ విభాగాలు, సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌, నీటిపారుదల శాఖ, ఆర్థిక శాఖల అధికారులు, అలాగే నిర్మాణ సంస్థల ప్రతినిధులను కమిషన్‌ విచారించింది.

    వారందరి నుండి అఫిడవిట్లు తీసుకొని క్రాస్‌ ఎగ్జామినేషన్‌ ప్రక్రియను పూర్తిచేసింది.

    వివరాలు 

    మాజీ మంత్రుల హాజరు 

    ఈ నెల 6న ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ విచారణకు హాజరయ్యారు.

    ఆ తర్వాత 9వ తేదీన నీటిపారుదల శాఖ మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కూడా విచారణలో పాల్గొన్నారు.

    ఇప్పటి వరకు జరిగిన విచారణలు మీడియా సమక్షంలో, అలాగే కమిషన్‌కు చెందిన ఇంజినీర్ల ఉపస్థితిలో సాగాయి.

    కేసీఆర్‌ విచారణ కూడా ఇదే విధంగా మాధ్యమాల సమక్షంలో జరగబోతుందా? లేకపోతే కేవలం కమిషన్‌ అధికారుల సమక్షంలో మాత్రమే "ఇన్‌-కెమెరా" విచారణగా కొనసాగుతుందా? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

    వివరాలు 

    భారత రాష్ట్ర సమితి నాయకులతో చర్చలు 

    ఈ విచారణ నేపథ్యంలో కేసీఆర్‌ మంగళవారం భారాస ముఖ్యనాయకులతో సమావేశమయ్యారు.

    కమిషన్‌ హరీశ్‌రావుతో చేపట్టిన చర్చలపై విశ్లేషణ జరగడంతో పాటు, మరికొన్ని అదనపు అంశాలపై కూడా లోతుగా చర్చించినట్లు సమాచారం.

    బుధవారం విచారణ సమయంలో కేసీఆర్‌తో పాటు పార్టీకి చెందిన ముఖ్యనాయకులు కూడా ఆయనతో కలిసి విచారణ ప్రాంగణానికి రానున్నారు.

    వివరాలు 

    9 మందితో కూడిన జాబితా సిద్ధం 

    విచారణ సమయంలో పరిమిత సంఖ్యలోనే వ్యక్తులను అనుమతించే అవకాశముండటంతో ముందుగానే తొమ్మిది మంది నేతల జాబితా కమిషన్‌కు పంపినట్లు సమాచారం.

    ఆ జాబితాలో హరీశ్‌రావు, మధుసూదనాచారి, ప్రశాంత్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పద్మారావుగౌడ్, బండారి లక్ష్మారెడ్డి, మహమూద్‌ అలీ, ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు

    తాజా

    WTC Final 2025: లార్డ్స్‌లో బౌలర్ల హవా.. డబ్ల్యూటీసీ ఫైనల్‌ తొలి రోజు 14 వికెట్లు వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్
    Telangana: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ.. కొత్త మంత్రులకు ఇచ్చిన శాఖలివే! తెలంగాణ
    Journalist Krishnam Raju: అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు.. జర్నలిస్ట్ కృష్ణంరాజు అరెస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు
    UPI payments: యూపీఐ లావాదేవీలపై తప్పుడు ప్రచారం.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన కేంద్రం యూపీఐ

    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు

    KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు ఈసీ నోటీసులు.. రేపటిలోగా వివరణ ఇవ్వాలని ఆదేశం  భారతదేశం
    KCR Convoy Accident: మాజీ సీఎం కేసీఆర్‌ కాన్వాయ్‌ కు ప్రమాదం...ఎనిమిది కార్లు ఒకదానికొకటి ఢీ భారతదేశం
    KCR Protest: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. రాష్ట్ర వ్యాప్త నిరసనలకు బీఆర్‌ఎస్ పిలుపు  భారతదేశం
    KCR: విచారణ కమిషన్‌ ముందు హాజరు కాలేనన్న కేసిఆర్ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025