
Kedar Jadhav: బీజేపీలో చేరిన మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్..
ఈ వార్తాకథనం ఏంటి
భారత మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్ రాజకీయలలోకి ఎంట్రీ ఇచ్చారు.
గత సంవత్సరం అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్లకు వీడ్కోలు చెప్పిన ఆయన,తాజాగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు.
40ఏళ్ల కేదార్ జాదవ్ మంగళవారం ముంబైలోని మెరైన్ డ్రైవ్ వద్ద ఉన్న బీజేపీ ప్రధాన కార్యాలయంలో అధికారికంగా పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు,రాష్ట్ర మంత్రి చంద్రశేఖర్ బవాన్కులే ఆయనకు సభ్యత్వం కల్పించి స్వాగతం పలికారు.
కేదార్ జాదవ్ 1985, మార్చి 26న మహారాష్ట్రలోని పూణేలో జన్మించారు.2014లో శ్రీలంకపై జరిగిన మ్యాచ్ ద్వారా భారత జాతీయ జట్టులోకి అడుగుపెట్టారు.
మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా జాదవ్ భారత్ తరఫున మొత్తం 73వన్డేల్లో ప్రాతినిధ్యం వహించి, 42.09 సగటుతో 1,389పరుగులు చేశారు.
వివరాలు
17 సంవత్సరాల క్రికెట్ ప్రస్థానానికి ముగింపు
బౌలింగ్ పరంగా, ఆఫ్ స్పిన్ వేసే జాదవ్ 5.15 ఎకానమీ రేటుతో 27 వికెట్లు తీశారు.
దేశీయ క్రికెట్లో మహారాష్ట్ర జట్టును ప్రాతినిధ్యం వహించగా, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున కూడా మెరిశారు.
2017లో ఇంగ్లాండ్తో పూణేలో జరిగిన వన్డేలో కేవలం 76 బంతుల్లోనే 120 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడి కేదార్ జాదవ్ అందరి దృష్టిని ఆకర్షించారు.
ఆ మ్యాచ్లో 12వ ఓవర్ నుంచి విరాట్ కోహ్లీతో కలిసి 200 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు.
ఐపీఎల్లో ఆయన ఢిల్లీ డేర్డెవిల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల తరపున ప్రాతినిధ్యం వహించారు.
2024లో 17 సంవత్సరాల క్రికెట్ ప్రస్థానానికి ముగింపు పలికారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బీజేపీలో చేరుతున్న కేదార్ జాదవ్..
#WATCH | Former Indian Cricketer Kedar Jadhav joins BJP in the presence of Maharashtra minister and state BJP chief Chandrashekhar Bawankule in Mumbai. pic.twitter.com/4reAKk7F1Y
— ANI (@ANI) April 8, 2025