NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Harish Rao: కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు ముగిసిన మాజీ మంత్రి హరీశ్‌రావు విచారణ
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Harish Rao: కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు ముగిసిన మాజీ మంత్రి హరీశ్‌రావు విచారణ
    కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు ముగిసిన మాజీ మంత్రి హరీశ్‌రావు విచారణ

    Harish Rao: కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు ముగిసిన మాజీ మంత్రి హరీశ్‌రావు విచారణ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 09, 2025
    01:37 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో భాగంగా మాజీ మంత్రి హరీశ్‌రావు జస్టిస్ పీసీ ఘోష్‌కు సమక్షంగా సుమారు 40 నిమిషాలపాటు వివరణ ఇచ్చారు.

    ప్రాజెక్టు రీడిజైనింగ్‌ అవసరాలు, కారణాలను ఆయన స్పష్టంగా వివరించారు.

    ప్రాజెక్టు లేఅవుట్ మ్యాప్‌ను చూపించి, మార్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరించారు.

    మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర జలవనరుల సంస్థ (సీడబ్ల్యూసీ) వ్యక్తపరిచిన అభ్యంతరాల వల్లే ప్రాజెక్టు రీడిజైన్‌ చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

    తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యతపై సమస్యలు తలెత్తడంతో ప్రాజెక్టు రూపకల్పనను మళ్లీ సమీక్షించామని చెప్పారు.

    వాస్కోప్‌ అనే సంస్థతో సమగ్ర సర్వే చేయించిన తరువాతే ప్రాజెక్టు ప్రాంతాన్ని మార్చామని వివరించారు.

    వివరాలు 

    ఇంజినీర్ల సాంకేతిక సలహాల మేరకే అన్నారం,సుందిళ్ల బ్యారేజీల స్థలాలు మార్పు 

    జస్టిస్ ఘోష్ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై ప్రత్యేకంగా ప్రశ్నించగా, హరీశ్‌రావు వాటి నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం పొందినట్లు తెలిపారు.

    ఇంజినీర్ల సాంకేతిక సలహాల మేరకే అన్నారం,సుందిళ్ల బ్యారేజీల స్థలాలు మార్పు చేశామని పేర్కొన్నారు.

    స్థల మార్పులు ప్రాజెక్టులలో సాధారణమని, ఇదివరకూ కూడా ఇతర ప్రాజెక్టులలో జరిగాయని గుర్తు చేశారు.

    మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నేరుగా నీరు పంపించడం సాంకేతికంగా కష్టమని విశ్రాంత ఇంజినీర్లు చెప్పిన నేపథ్యంలోనే స్థలం మార్చామని వివరించారు.

    ప్రాజెక్టుకు అవసరమైన నిధుల కోసం ప్రత్యేకంగా కాళేశ్వరం కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశామని,దీనికి మంత్రివర్గ ఆమోదంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ హామీ ఉందని ఆయన స్పష్టం చేశారు.

    వివరాలు 

    కార్పొరేషన్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వ సంస్థలు,పలు బ్యాంకుల నుంచి రుణాలు

    ఈ కార్పొరేషన్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వ సంస్థలు,పలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నట్టు వెల్లడించారు.

    ఈ దశలో పీసీ ఘోష్‌ కార్పొరేషన్‌ ద్వారా కాకుండా నేరుగా బడ్జెట్‌ నిధుల కేటాయింపు ఎందుకు జరిగిందని ప్రశ్నించారు.

    అలాగే, జలాశయాల నుంచి ఎత్తి పంపే నీటి వివరాలు ఏవని అడిగారు.

    ఆనకట్టల్లో నీటిని నిల్వ చేయాల్సిన నిర్ణయం ఎవరిది అని ప్రశ్నించగా, అటువంటి సాంకేతిక అంశాలు ఇంజినీర్ల పరిధిలోకి వస్తాయని హరీశ్‌రావు స్పష్టీకరణ ఇచ్చారు.

    ప్రభుత్వం నుండి దీనిపై ఎటువంటి ప్రత్యేక ఆదేశాలు ఇవ్వలేదని ఆయన తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Harish Rao: కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు ముగిసిన మాజీ మంత్రి హరీశ్‌రావు విచారణ తెలంగాణ
    Jyoti Malhotra: హర్యానా కోర్టులో జ్యోతి మల్హోత్రాకు బిగ్ షాక్.. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి ఇచ్చిన కోర్టు.. జ్యోతి మల్హోత్రా
    Deadly Bioweapon: చైనాలోనే,మరో భయంకరమైన ఫంగస్‌.. హెచ్చరించిన చైనా నిపుణుడు గోర్డాన్‌ చాంగ్‌  చైనా
    HBD Balakrishna: తెలుగు సినిమా మాస్ యాక్షన్‌కు మరో పేరు: బాలకృష్ణ  బాలకృష్ణ

    తెలంగాణ

    Telangana: తొలిసారిగా డీఎన్‌ఏ డయాగ్నోస్టిక్స్‌ సాంకేతికత.. లాకోన్స్‌ డీఎన్‌ఏ పరీక్షకు పేటెంట్‌.. భారతదేశం
    gali janardhan reddy case: ఓబుళాపురం కేసులో అనూహ్య మలుపు.. ఒక్క రోజులో ముగ్గురు న్యాయమూర్తుల వైదొలగింపు! హైకోర్టు
    Gaddar Awards : ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్.. గద్దర్ అవార్డులను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం అల్లు అర్జున్
    MSP: మార్కెట్ ధరలకంటే తక్కువగా మద్దతు ధరలు.. అన్నదాతలు ఆవేదన భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025