NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పేరు వాడుకొని రూ.కోట్లు కాజేసిన మాజీ రంజీ ప్లేయర్
    భారతదేశం

    ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పేరు వాడుకొని రూ.కోట్లు కాజేసిన మాజీ రంజీ ప్లేయర్

    ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పేరు వాడుకొని రూ.కోట్లు కాజేసిన మాజీ రంజీ ప్లేయర్
    వ్రాసిన వారు Naveen Stalin
    Mar 15, 2023, 04:26 pm 1 నిమి చదవండి
    ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పేరు వాడుకొని రూ.కోట్లు కాజేసిన మాజీ రంజీ ప్లేయర్

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వాడుకొని ఓ వక్తి దాదాపు 60కంపెనీల నుంచి రూ.3 కోట్ల వరకు కాజేశాడు. తాజాగా తనను తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పరిచయం చేసుకుని రూ.12 లక్షల వరకు టోపీ పెట్టాడు. తర్వాత మోసపోయానని గమనించిన బాధితుడు పోలీసుల ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మోసం చేసిన వ్యక్తిని ముంబయి సైబర్ సెల్‌ విభాగం-ఆంధ్రప్రదేశ్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. నిందితుడు ఆంధ్రప్రదేశ్‌లోని ఒడిశా సరిహద్దలో శ్రీకాకుళం జిల్లాలో నివసిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడిని బుడుమూరు నాగరాజుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. బుడుమూరు నాగరాజు మాజీ రంజీ ప్లేయర్ కావడం గమనార్హం.

    మోసం ఇలా బయటపడింది

    అంతకుముందు సీఎం జగన్ పేరు చెప్పి చాలా మందిని మోసం చేసిన నాగరాజు.. ఇటీవల ముంబయిలోని ఓ ఎలక్ట్రానిక్ వస్తువుల విక్రయదారుడికి ఫోన్ చేశాడు. ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ పరిశ్రమ ఎండీ నంబర్ కనుక్కొని తాను ఆంధ్రప్రదేశ్ సీఎంగా పరిచయం చేసకున్నారు. క్రికెటర్ కిట్ స్పాన్సర్‌షిప్ కోసం పరిశ్రమ ఎండీని రూ.12లక్షలు అడిగినట్లు అధికారులు చెప్పారు. ఈ పని చేస్తే తగిన ప్రతిఫలం ఉంటుందని కూడా చెప్పాడు. ఇది నమ్మిన ఎండీ రూ.12లక్షలను అతడి అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేశారు. ఆ తర్వాత నాగరాజు ఇచ్చిన ఫోన్ నంబర్ పని చేయకపోవడం, క్రికెటర్ల పేర్లు నకిలీవని తేలడంతో తాను మోసపోయానని జనవరిలో ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ పరిశ్రమ ఎండీ పోలీసులను ఆశ్రయించారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    క్రికెట్
    ఆంధ్రప్రదేశ్
    ముఖ్యమంత్రి
    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    క్రికెట్

    ఐసీసీ ర్యాకింగ్స్‌లో మళ్లీ నంబర్ వన్‌గా రవిచంద్రన్ అశ్విన్ రవిచంద్రన్ అశ్విన్
    భారత్‌తో జరిగే వన్డేలకు ఆస్ట్రేలియా జట్టు ఇదే.. కెప్టెన్‌గా స్మిత్ ఆస్ట్రేలియా
    గంటల వ్యవధిలో అమ్ముడుపోయిన విశాఖ వన్డే మ్యాచ్ టికెట్లు భారత జట్టు
    World Boxing Championships: మహిళల బాక్సింగ్ పోరుకు వేళాయే బాక్సింగ్

    ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్; 16వ తేదీన ఫలితాలు ఎమ్మెల్సీ
    బీజేపీలోకి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి! బీజేపీ
    ఏపీలో అవినాష్ రెడ్డి, తెలంగాణలో కవిత అరెస్టు అవుతారా? ఆందోళనలో అధికార పార్టీలు తెలంగాణ
    కోడి కత్తి కేసు: జగన్ రావాలని ఎన్ఐఏ కోర్టు ఆదేశం వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    ముఖ్యమంత్రి

    నాగాలాండ్ ముఖ్యమంత్రిగా ఎన్‌డీపీపీ అధినేత నీఫియు రియో ​​ప్రమాణ స్వీకారం నాగాలాండ్
    ప్రధాని మోదీ సమక్షంలో మేఘాలయ సీఎంగా కాన్రాడ్ సంగ్మా ప్రమాణ స్వీకారం మేఘాలయ
    ముఖ్యమంత్రి రేసులో ప్రతిమా భౌమిక్; అదే జరిగితే మొదటి మహిళా సీఎంగా రికార్డు త్రిపుర
    మార్చి 7న నాగాలాండ్ సీఎంగా ​​ 'నీఫియు రియో' ప్రమాణస్వీకారం నాగాలాండ్

    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్-2023 సమావేశాలు ప్రారంభం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు
    ఆంధ్రప్రదేశ్: రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు
    వైజాగ్‌: 'ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023'ను ప్రారంభించిన జగన్: దిగ్గజ కంపెనీలు హాజరు ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణస్వీకారం, సీఎం జగన్‌ హాజరు ఆంధ్రప్రదేశ్

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023