NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండాను విడుదల చేసిన కేంద్రం.. కీలక బిల్లులపై చర్చ
    తదుపరి వార్తా కథనం
    పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండాను విడుదల చేసిన కేంద్రం.. కీలక బిల్లులపై చర్చ
    పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండాను విడుదల చేసిన కేంద్రం.. కీలక బిల్లులపై చర్చ

    పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండాను విడుదల చేసిన కేంద్రం.. కీలక బిల్లులపై చర్చ

    వ్రాసిన వారు Stalin
    Sep 14, 2023
    10:44 am

    ఈ వార్తాకథనం ఏంటి

    సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్న విషయ తెలిసిందే.

    అయితే ఈ సమావేశాలకు సంబంధించిన అజెండాను కేంద్రం బుధవారం విడుదల చేసింది.

    లోక్‌సభలో రెండు, రాజ్యసభలో రెండు బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం తెలిపింది.

    మొదటి రోజు లోక్‌సభలో 75 సంవత్సరాల పార్లమెంటరీ ప్రయాణం - విజయాలు, అనుభవాలు, జ్ఞాపకాలు, అభ్యాసాలు అంశంపై చర్చ ఉంటుంది.

    రెండో రోజు నుంచి సమావేశాలకు కొత్త పార్లమెంట్ భవనం నుంచి ప్రారంభం అవుతాయి.

    ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన వివాదాస్పద బిల్లును ఈ ప్రత్యేక సమావేశాల్లోనే ఆమోదించాలని కేంద్రం నిర్ణయించింది.

    గత వర్షాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు.

    కేంద్రం

    'వన్ నేషన్, వన్ ఎలక్షన్' బిల్లు చర్చకు వచ్చే అవకాశం

    లోక్‌సభ, రాజ్యసభలో మరో మూడు బిల్లులు ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది.

    ది అడ్వకేట్స్(సవరణ) బిల్లు-2023, ది ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు- 2023, పోస్ట్ ఆఫీస్ బిల్లు- 2023ను కేంద్రం ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టనుంది.

    ఈ బిల్లులతో పాటు మరికొన్ని అంశాలు కూడా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో చర్చకు రావచ్చని తెలుస్తోంది.

    'వన్ నేషన్, వన్ ఎలక్షన్' బిల్లును కూడా ఈ సమావేశాల్లో ప్రతిపాదించే అవకాశం కనిపిస్తోంది.

    అంతేకాకుండా 'భారత్' పేరు అంశం కూడా చర్చకు వచ్చే అవకాశమూ లేకపోలేదు.

    సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అన్ని పార్టీలకు సమాచారం అందించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 2023
    లోక్‌సభ
    రాజ్యసభ
    తాజా వార్తలు

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 2023

    ఈ నెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు.. కేంద్రం ఏం చేయబోతోంది పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి
    Adhir Ranjan Chowdhury: జమిలి ఎన్నికల కమిటీలో ఉండలేను: అమిత్ షాకు కాంగ్రెస్ ఎంపీ అధీర్ చౌదరి లేఖ  జమిలి ఎన్నికలు
    ముందస్తు ఎన్నికలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు  నరేంద్ర మోదీ
    పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా ఏంటి?: మోదీకి లేఖ రాయనున్న సోనియా గాంధీ సోనియా గాంధీ

    లోక్‌సభ

    నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. మణిపూర్‌,దిల్లీ ఆర్డినెన్సు,యూసీసీలపై మాటల వర్షాలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
    పెట్రోల్ ధరల్లో ఏపీ టాప్.. చమురు ధరల నివేదికను పార్లమెంట్ కు అందజేసిన కేంద్రం కేంద్ర ప్రభుత్వం
    మణిపూర్‌ పరిస్థితిపై ప్రధాని మోదీ మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్: ఈ నెల 24న నిరసన మణిపూర్
    లోక్‌సభలో మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఆమోదం నరేంద్ర మోదీ

    రాజ్యసభ

    అదానీ-హిండెన్‌బర్గ్ నివేదికపై పార్లమెంట్‌లో గందరగోళం, లోక్‌సభ, రాజ్యసభ రేపటికి వాయిదా లోక్‌సభ
    అదానీ గ్రూప్‌పై చర్చకు కేంద్రం భయపడుతోంది: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    రాష్ట్రపతి ప్రసంగాన్ని విమర్శించినందుకు చాలా సంతోషం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    కొందరు ఎంపీల ప్రవర్తన దేశాన్ని నిరాశ పర్చింది: రాజ్యసభలో ప్రధాని మోదీ నరేంద్ర మోదీ

    తాజా వార్తలు

    ఈ ఏడాది ఇప్పటి వరకు విడుదలైన టాప్-5 ఈవీ వాహనాలు ఇవే  ఎలక్ట్రిక్ వాహనాలు
    India-Middle East-Europe corridor: 'భారత్-మిడిల్ ఈస్ట్-యూరప్' కనెక్టివిటీ కారిడార్ ప్రారంభం  జీ20 సదస్సు
    Morocco earthquake: మొరాకోలో భూకంప కల్లోలం.. 2,000 దాటిన మృతులు.. వెల్లువెత్తున్న మానవాతా సాయం మొరాకో
    దిల్లీలోని అక్షరధామ్ ఆలయంలో బ్రిటన్ ప్రధాని రిషి సునక్ పూజలు  రిషి సునక్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025