NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Kakinada accident : కాకినాడ హైవేపై ఆర్టీసీ బస్సు బీభత్సం.. నలుగురు మృతి 
    తదుపరి వార్తా కథనం
    Kakinada accident : కాకినాడ హైవేపై ఆర్టీసీ బస్సు బీభత్సం.. నలుగురు మృతి 
    Kakinada accident : కాకినాడ హైవేపై ప్రమాదం.. బస్సు ఢీకొని నలుగురు మృతి

    Kakinada accident : కాకినాడ హైవేపై ఆర్టీసీ బస్సు బీభత్సం.. నలుగురు మృతి 

    వ్రాసిన వారు Stalin
    Feb 26, 2024
    09:49 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కాకినాడ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ప్రత్తిపాడు-చిన్నంపేట జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు.

    విశాఖపట్టణం నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రత్తిపాడు-చిన్నంపేట జాతీయ రహదారిపై ఉన్న పడాలమ్మ తల్లి దేవాలయం సమీపంలో నలుగురిపై దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది.

    హైవేపై పంక్చర్‌ అయిన లారీ టైర్‌ను మారుస్తున్న క్రమంలో ఇద్దరు లారీ డ్రైవర్లు, ఒక క్లీనర్‌పై బస్సు వేగంగా వచ్చి దూసుకెళ్లింది. అయినా డ్రైవర్ బస్సును ఆపకుండా ముందుకు కదిలాడు.

    అదే సమయంలో పడాలమ్మ తల్లి ఆలయంలో పూజల కోసం వచ్చిన మరో మరో వ్యక్తిని కూడా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

    కాకినాడ

    డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

    రాజమహేంద్రవరం సమీపంలోని బొమ్మూరు వద్ద పోలీసులు బస్సును ఆపి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రత్తిపాడు పోలీసులు డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.

    ఇద్దరు డ్రైవర్లు ప్రసాద్, నాగయ్య, క్లీనర్ కిషోర్ బాపట్ల జిల్లా నక్క బొక్కల పాలెం గ్రామానికి చెందినవారని పోలీసులు తెలిపారు.

    విశాఖపట్నంకు చెందిన లోవరాజు గత ఐదేళ్లుగా పడాలమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి వైవేధ్యం పెడుతున్నట్లు చెప్పారు.

    ఈ ఘటనపై విచారణ జరుపుతామని రాజమహేంద్రవరం ఆర్టీసీ బస్ డిపో మేనేజర్ షేక్ షబ్నం తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రోడ్డు ప్రమాదం
    బస్సు ప్రమాదం

    తాజా

    Rana Daggubati: 'రానా నాయుడు 2'పై రానా కీలక కామెంట్స్.. ఈ సారి బూతులు తక్కువగా ఉంటాయంటూ..  రానా దగ్గుబాటి
    OpenAI: జానీ ఐవ్‌కు చెందిన ఏఐ కంపెనీని కొనుగోలు చేసిన ఓపెన్‌ ఏఐ  ఓపెన్ఏఐ
    PM Modi: 103 అమృత్‌ భారత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ.. నరేంద్ర మోదీ
    Pakistan: ఆపరేషన్‌ సిందూర్‌ వేళ 50 మంది ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు కుట్ర.. తిప్పికొట్టిన బీఎస్‌ఎఫ్‌  బీఎస్‌ఎఫ్‌

    రోడ్డు ప్రమాదం

    మెక్సికోలో లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రమాదంలో ఆరుగురు భారతీయుల దుర్మరణం మెక్సికో
    స్నేహితుల దినోత్సవం వేళ విషాదం.. కారు ప్రమాదంలో ముగ్గురు మిత్రులు మృతి ఆంధ్రప్రదేశ్
    మొరాకోలో ఘోర రోడ్డు ప్రమాదం; బస్సు బోల్తాపడి 24మంది మృతి మొరాకో
    రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం; కారు-బస్సు ఢీకొని ఏడుగురు మృతి  రాజస్థాన్

    బస్సు ప్రమాదం

    Delhi-Meerut Expressway: ఎస్‌యూవీని ఢీకొన్న స్కూల్ బస్సు; ఆరుగురు మృతి  దిల్లీ
    పాడేరులో ఘోర ప్రమాదం.. 100 అడుగుల లోయలోకి దూసుకెళ్లిన ఆర్డీసీ బస్సు; నలుగురు మృతి  పాడేరు
    Gurugram: ఢిల్లీ-జైపూర్ హైవేపై స్లీపర్ బస్సులో మంటలు.. ఇద్దరు మృతి, పలువురికి గాయాలు  ఉత్తర్‌ప్రదేశ్
    Jogulamba Gadwal district: ప్రైవేట్ బస్సులో చెరేగిన మంటలు.. మహిళ సజీవ దహనం  జోగులాంబ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025