NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఫాక్స్‌కాన్ సంచలన ప్రకటన.. వచ్చే ఏడాది ప్రధాని మోదీకి అపూర్వ బహుమతి
    తదుపరి వార్తా కథనం
    ఫాక్స్‌కాన్ సంచలన ప్రకటన.. వచ్చే ఏడాది ప్రధాని మోదీకి అపూర్వ బహుమతి
    వచ్చే ఏడాది ప్రధాని మోదీకి అపూర్వ బహుమతి

    ఫాక్స్‌కాన్ సంచలన ప్రకటన.. వచ్చే ఏడాది ప్రధాని మోదీకి అపూర్వ బహుమతి

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 18, 2023
    04:57 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఫాక్స్‌కాన్ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. తైవాన్‌కు చెందిన ఆపిల్ సరఫరాదారు భారత్‌లో తమ పెట్టుబడులను రెట్టింపు చేసేందుకు రెడీ అవుతోంది.

    ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన కంపెనీ ప్రతినిధి వీలీ, మోదీ ప్రభుత్వ నిర్ణయాలతో ఫాక్స్‌కాన్ ఎటువంటి ఆటంకాలు లేకుండా వేగంగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.

    భారతదేశంలో ఉద్యోగ, ఉపాధి, ఎఫ్‌డిఐ, వ్యాపారాన్ని రెట్టింపు చేసేందుకు వచ్చే ఏడాది మీకు గొప్ప పుట్టినరోజు బహుమతిని అందించేందుకు మరింత కష్టపడి పని చేస్తామన్నారు. రానున్న 12 నెలల్లో దేశంలో పెట్టుబడులు, శ్రామిక శక్తిని రెట్టింపు చేయాలని కంపెనీ యోచిస్తోంది.

    తైవాన్‌ కంపెనీ ఫాక్స్‌కాన్ ప్రస్తుతం, ప్రపంచంలోనే అతిపెద్ద కాంట్రాక్ట్ ఎలక్ట్రానిక్స్ తయారీ, సరఫరాదారుగా కొనసాగుతోంది.

    DETAILS

    చైనా నుంచి వైదొలగనున్న ఫాక్స్‌కాన్ కంపెనీ

    చైనా నుంచి ప్రస్తుతం ఈ తైవాన్ కి చెందిన కంపెనీ వైదొలగాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే దక్షిణ ప్రాంతంలో పెట్టుబడి పెట్టడం ద్వారా భారత్ లో వేగంగా విస్తరించాలని ఉవ్విళ్లూరుతోంది.

    ఈ మేరకు స్పందించిన కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్, కంపెనీ ప్రణాళికలను స్వాగతిస్తున్నామన్నారు. ఫాక్స్‌కాన్ కంపెనీకి సహకారం అందించేందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు. వీలీ ప్రకటనతో భారత్‌లో ఫాక్స్‌కాన్ పెట్టుబడులు భారీ స్థాయిలో పెరగనున్నాయి.

    ఫాక్స్‌కాన్ కంపెనీ తమిళనాడులో ఐఫోన్ తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తుండగా, దాదాపు 40వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

    ఆగస్టులో రెండు కీలకమైన ప్రాజెక్టుల కోసం ఫాక్స్‌కాన్ 600 మిలియన్ డాలర్లను కర్ణాటకలో ప్రకటించింది. ఐ ఫోన్లు, చిప్-మేకింగ్ పరికరాల కోసం కేసింగ్ భాగాలను తయారీపై దృష్టి పెట్టింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    వీ లీ ట్వీట్‌ను రీ ట్వీట్ చేసిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్

    Fully committed to support and facilitate. pic.twitter.com/8ZBfnMDxa1

    — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) September 18, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    తైవాన్

    తాజా

    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్
    united nations: గాజాలో రాబోయే 48 గంటల్లో 14,000 మంది పిల్లలు చనిపోయే అవకాశం: హెచ్చరించిన ఐక్యరాజ్యసమితి  ఐక్యరాజ్య సమితి

    నరేంద్ర మోదీ

    చంద్రుడిని హిందూ రాష్ట్రంగా ప్రకటించాలి: స్వామి చక్రపాణి మహారాజ్  చంద్రుడు
    మోదీకి పుతిన్ ఫోన్.. G20 సమ్మిట్‌కు రష్యా తరఫున విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ వ్లాదిమిర్ పుతిన్
    చైనా మ్యాప్‌పై ప్రధాని మోదీ మాట్లాడాల్సిందే: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    India G20 presidency: 'జీ20' అంటే ఏమిటి?కూటమికి అధ్యక్షత వహించడం ద్వారా భారత్ ఏమి ఆశిస్తోంది?  జీ20 సదస్సు

    తైవాన్

    Taiwan: తైవాన్ అధ్యక్ష బరిలో ఫాక్స్‌కాన్ వ్యవస్థాపకుడు టెర్రీ గౌ.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ  ఎన్నికలు
    మారని చైనా వక్రబుద్ధి.. అరుణాచల్ తమ అంతర్భాగమంటూ మ్యాప్ విడుదల చైనా
    Taiwan: తైవాన్ చుట్టూ 103 చైనా యుద్ధ విమానాల మోహరింపు  చైనా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025