NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఫాక్స్‌కాన్ సంచలన ప్రకటన.. వచ్చే ఏడాది ప్రధాని మోదీకి అపూర్వ బహుమతి
    ఫాక్స్‌కాన్ సంచలన ప్రకటన.. వచ్చే ఏడాది ప్రధాని మోదీకి అపూర్వ బహుమతి
    1/3
    భారతదేశం 1 నిమి చదవండి

    ఫాక్స్‌కాన్ సంచలన ప్రకటన.. వచ్చే ఏడాది ప్రధాని మోదీకి అపూర్వ బహుమతి

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 18, 2023
    04:57 pm
    ఫాక్స్‌కాన్ సంచలన ప్రకటన.. వచ్చే ఏడాది ప్రధాని మోదీకి అపూర్వ బహుమతి
    వచ్చే ఏడాది ప్రధాని మోదీకి అపూర్వ బహుమతి

    ఫాక్స్‌కాన్ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. తైవాన్‌కు చెందిన ఆపిల్ సరఫరాదారు భారత్‌లో తమ పెట్టుబడులను రెట్టింపు చేసేందుకు రెడీ అవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన కంపెనీ ప్రతినిధి వీలీ, మోదీ ప్రభుత్వ నిర్ణయాలతో ఫాక్స్‌కాన్ ఎటువంటి ఆటంకాలు లేకుండా వేగంగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. భారతదేశంలో ఉద్యోగ, ఉపాధి, ఎఫ్‌డిఐ, వ్యాపారాన్ని రెట్టింపు చేసేందుకు వచ్చే ఏడాది మీకు గొప్ప పుట్టినరోజు బహుమతిని అందించేందుకు మరింత కష్టపడి పని చేస్తామన్నారు. రానున్న 12 నెలల్లో దేశంలో పెట్టుబడులు, శ్రామిక శక్తిని రెట్టింపు చేయాలని కంపెనీ యోచిస్తోంది. తైవాన్‌ కంపెనీ ఫాక్స్‌కాన్ ప్రస్తుతం, ప్రపంచంలోనే అతిపెద్ద కాంట్రాక్ట్ ఎలక్ట్రానిక్స్ తయారీ, సరఫరాదారుగా కొనసాగుతోంది.

    2/3

    చైనా నుంచి వైదొలగనున్న ఫాక్స్‌కాన్ కంపెనీ

    చైనా నుంచి ప్రస్తుతం ఈ తైవాన్ కి చెందిన కంపెనీ వైదొలగాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే దక్షిణ ప్రాంతంలో పెట్టుబడి పెట్టడం ద్వారా భారత్ లో వేగంగా విస్తరించాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ మేరకు స్పందించిన కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్, కంపెనీ ప్రణాళికలను స్వాగతిస్తున్నామన్నారు. ఫాక్స్‌కాన్ కంపెనీకి సహకారం అందించేందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు. వీలీ ప్రకటనతో భారత్‌లో ఫాక్స్‌కాన్ పెట్టుబడులు భారీ స్థాయిలో పెరగనున్నాయి. ఫాక్స్‌కాన్ కంపెనీ తమిళనాడులో ఐఫోన్ తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తుండగా, దాదాపు 40వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆగస్టులో రెండు కీలకమైన ప్రాజెక్టుల కోసం ఫాక్స్‌కాన్ 600 మిలియన్ డాలర్లను కర్ణాటకలో ప్రకటించింది. ఐ ఫోన్లు, చిప్-మేకింగ్ పరికరాల కోసం కేసింగ్ భాగాలను తయారీపై దృష్టి పెట్టింది.

    3/3

    వీ లీ ట్వీట్‌ను రీ ట్వీట్ చేసిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్

    Fully committed to support and facilitate. pic.twitter.com/8ZBfnMDxa1

    — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) September 18, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    నరేంద్ర మోదీ
    తైవాన్

    నరేంద్ర మోదీ

    నేడు సాయంత్రం 6:30 గంటలకు ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ మీటింగ్  ప్రధాన మంత్రి
    ఆ మూడు రాష్ట్రాల్లా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజన జరగలేదు: లోక్‌సభలో ప్రధాని మోదీ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 2023
    మరోసారి తెలంగాణ గడ్డ మీదకు మోదీ.. బీజేపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ బీజేపీ
    PM Modi: పార్లమెంట్ పాత భవనం రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకం: వీడ్కోలు పలికిన  ప్రధాని మోదీ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

    తైవాన్

    Taiwan: తైవాన్ చుట్టూ 103 చైనా యుద్ధ విమానాల మోహరింపు  చైనా
    మారని చైనా వక్రబుద్ధి.. అరుణాచల్ తమ అంతర్భాగమంటూ మ్యాప్ విడుదల చైనా
    Taiwan: తైవాన్ అధ్యక్ష బరిలో ఫాక్స్‌కాన్ వ్యవస్థాపకుడు టెర్రీ గౌ.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ  ఎన్నికలు
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023