NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / VjaTo Srisailam: కృష్ణా నదిలో సీ ప్లేన్ సేవలు.. పర్యాటక రంగానికి కొత్త ఊపు.. డిసెంబర్‌ 9 నుంచి ప్రారంభం 
    తదుపరి వార్తా కథనం
    VjaTo Srisailam: కృష్ణా నదిలో సీ ప్లేన్ సేవలు.. పర్యాటక రంగానికి కొత్త ఊపు.. డిసెంబర్‌ 9 నుంచి ప్రారంభం 
    కృష్ణా నదిలో సీ ప్లేన్ సేవలు.. పర్యాటక రంగానికి కొత్త ఊపు.. డిసెంబర్‌ 9 నుంచి ప్రారంభం

    VjaTo Srisailam: కృష్ణా నదిలో సీ ప్లేన్ సేవలు.. పర్యాటక రంగానికి కొత్త ఊపు.. డిసెంబర్‌ 9 నుంచి ప్రారంభం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 28, 2024
    12:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి మరింత ఊతమిచ్చేలా కృష్ణా నదిలో సీ ప్లేన్ సర్వీసులు త్వరలోనే ప్రారంభించనున్నారు.

    విజయవాడలో ఈ సర్వీసుల ప్రారంభానికి సంబంధించిన సన్నాహాలను సిద్ధం చేస్తున్నట్లు కొద్ది నెలల క్రితం కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.

    కేంద్ర ప్రభుత్వం 2014-2019 మధ్య కాలంలో ప్రకాశం బ్యారేజీ ఎగువున సీ ప్లేన్ సర్వీసులను ఆమోదించినప్పటికీ, అవి ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు.

    ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుతో, ప్రకాశం బ్యారేజీ దగ్గర సీ ప్లేన్ అంశం కొత్తగా పునరుద్ధరించబడింది.

    కేంద్రం ఈ పథకాన్ని తిరిగి ప్రారంభించనుండడంతో, విజయవాడ నుంచి శ్రీశైలానికి తొలి సర్వీసులను డిసెంబర్ 9న ప్రారంభించాలని నిర్ణయించారు.

    వివరాలు 

     విజయవాడ నుంచి శ్రీశైలానికి సీ ప్లేన్ సర్వీసు 

    ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించనుంది. భవిష్యత్తులో మరిన్ని రూట్లకు విస్తరించనుంది.

    ప్రకాశం బ్యారేజీ ఎగువ భాగంలో కృష్ణా జలాల్లో సీ ప్లేన్ సేవలు విజయవాడ వాసులకు అందుబాటులో రానున్నాయి.

    మొదటి దశలో విజయవాడ నుంచి శ్రీశైలానికి సీ ప్లేన్ సర్వీసు ప్రారంభించనున్నారు.

    డిమాండ్‌ను బట్టి ఈ సర్వీసులను మరింత విస్తరించవచ్చు. ఇతర పర్యాటక ప్రాంతాలకు సర్వే నిర్వహించి, అవసరమైన మార్గాలను అందించనున్నారు.

    ఈ ప్రాజెక్టులో భాగంగా, ప్రకాశం బ్యారేజీ దగ్గర ఒక వాటర్ ఏరోడ్రమ్‌ను ఏర్పాటు చేయనున్నారు.

    సీ ప్లేన్‌ల రాకపోకల కోసం వాటర్ వేను కూడా ఏర్పాటు చేయనున్నారు. వాటర్ ఏరోడ్రమ్ కోసం ఇప్పటికే పౌర విమానయాన సంస్థ అధికారులు సర్వే చేస్తున్నారు.

    వివరాలు 

    దుర్గాఘాట్‌ వద్ద ఫ్లైఓవర్ దిగువన వాటర్‌డ్రోమ్ ఏర్పాటుకు చర్యలు

    శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం సమీపంలో, దుర్గాఘాట్‌ వద్ద ఫ్లైఓవర్ దిగువన వాటర్‌డ్రోమ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.

    సీ ప్లేన్ సర్వీసులు విజయవాడ - శ్రీశైలంపై పర్యాటకుల కోసం సులభమైన మార్గాన్ని అందిస్తాయి.

    విజయవాడలోని శ్రీ దుర్గామల్లేశ్వరస్వామిని దర్శించుకుని, శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లిఖార్జులను చూడడం మరింత సులభమవుతుంది.

    ఈ రెండు ప్రాంతాల మధ్య టెంపుల్ టూరిజం అభివృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు.

    సీ ప్లేన్ ల్యాండింగ్ కోసం ప్రత్యేకమైన వాటర్ వేను ఏర్పాటు చేయనున్నారు. విమానం ల్యాండైన తర్వాత, ప్రయాణికులను ఎక్కించుకోడానికి వాటర్ వే నిర్మాణం చేపడతారు.

    జెట్టీ నిర్మాణం కూడా చేయనున్నారు, ఇది సీ ప్లేన్ సమీపానికి చేరుకుంటుంది. ప్రయాణికులు జెట్టీ ద్వారా బోటుకు రాకపోకలు సాగించాలి.

    వివరాలు 

    శ్రీశైలంలో పాతళగంగ దగ్గర కృష్ణానదిలో ల్యాండ్

    విజయవాడ నుంచి బయలుదేరిన సీ ప్లేన్ నేరుగా శ్రీశైలంలో పాతళగంగ దగ్గర కృష్ణానదిలో ల్యాండ్ అవుతుంది.

    సీ ప్లేన్ సర్వీసుల ఖరారు ఇంకా జరుగలేదు, కానీ విజయవాడ-శ్రీశైలం సర్వీస్ విజయవంతం అయితే, భవిష్యత్తులో హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్, విశాఖపట్నం వంటి ప్రాంతాలకు కూడా ఈ సర్వీసులు విస్తరించనున్నాయి.

    శ్రీశైలం రూట్‌కు లభించే ఆదరణ ఆధారంగా మిగిలిన సర్వీసులను నిర్వహిస్తారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    పర్యాటకం

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    ఆంధ్రప్రదేశ్

    AP TG Roads: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌,తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్.. రాష్ట్ర ర‌హ‌దారుల అభివృద్ధికి నిధులు మంజూరు  నితిన్ గడ్కరీ
    Amaravati: అమరావతిలో తుది దశకు చేరిన జంగిల్ క్లియరెన్స్ పనులు అమరావతి
    Andhra Pradesh: ఏపీలో మహిళలకు మరో పథకం అమలుకు సిద్ధం.. దీపావళి మరుసటి రోజు నుంచి అమలు భారతదేశం
    AP Govt : ఏపీలో జిల్లాలకు ఇన్ ఛార్జ్ మంత్రులు నియామకం భారతదేశం

    పర్యాటకం

    400 మీటర్ల లోతులో హోటల్ గదులు: ప్రపంచంలోనే అత్యంత లోతులో ఉన్న హోటల్ గురించి తెలుసుకోండి  జీవనశైలి
    కిడ్నీ సమస్యలు ఉన్నవారు పర్యాటక ప్రదేశాలు సందర్శించాలనుకుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు  లైఫ్-స్టైల్
    ట్రావెల్: వాటికన్ సిటీ నుండి గుర్తుగా ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువులు  జీవనశైలి
    వర్షాకాలంలో ఫారెన్ ట్రిప్ వెళ్ళాలనుకుంటున్నారా? ఈ దేశాలు ట్రై చేయండి  వర్షాకాలం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025