Page Loader
28న గణేష్ నిమజ్జనం స్పెషల్.. అర్ధరాత్రి వరకు హైదరాబాద్ MMTS సర్వీసులు
అర్ధరాత్రి వరకు హైదరాబాద్ MMTS సర్వీసులు

28న గణేష్ నిమజ్జనం స్పెషల్.. అర్ధరాత్రి వరకు హైదరాబాద్ MMTS సర్వీసులు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 25, 2023
05:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగే గణేష్ నిమజ్జనం సందర్భంగా రైల్వే గుడ్ న్యూస్ అందించింది. ఇప్పటికే నగరంలో అతిపెద్ద వినాయకుడు ఖైరతాబాద్ లో పూజలు అందుకుంటున్నారు. ఈ మేరకు ఈ భారీ గణపతిని సెప్టెంబర్ 28న నిమజ్జనం చేయనున్నారు. ఈ క్రమంలోనే ఇతర గణపతుల నిమజ్జనం కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో నిమజ్జనాన్ని తిలకించేందుకు తరలివచ్చే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. సెప్టెంబర్ 28 రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం 4 గంటల వరకు MMTS స్పెషల్ సర్వీసులు నడపనున్నారు. 11 రోజుల పాటు ఉత్సవాలు అనంతరం 28న గురువారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత స్వామివారి శోభాయాత్ర ప్రారంభం కానుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గణేష్ నిమజ్జనం కోసం ప్రత్యేక ఎంఎంటీఎస్ సర్వీసులు