తదుపరి వార్తా కథనం

28న గణేష్ నిమజ్జనం స్పెషల్.. అర్ధరాత్రి వరకు హైదరాబాద్ MMTS సర్వీసులు
వ్రాసిన వారు
TEJAVYAS BESTHA
Sep 25, 2023
05:54 pm
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్లో అత్యంత వైభవంగా జరిగే గణేష్ నిమజ్జనం సందర్భంగా రైల్వే గుడ్ న్యూస్ అందించింది. ఇప్పటికే నగరంలో అతిపెద్ద వినాయకుడు ఖైరతాబాద్ లో పూజలు అందుకుంటున్నారు.
ఈ మేరకు ఈ భారీ గణపతిని సెప్టెంబర్ 28న నిమజ్జనం చేయనున్నారు. ఈ క్రమంలోనే ఇతర గణపతుల నిమజ్జనం కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఈ నేపథ్యంలో నిమజ్జనాన్ని తిలకించేందుకు తరలివచ్చే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది.
సెప్టెంబర్ 28 రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం 4 గంటల వరకు MMTS స్పెషల్ సర్వీసులు నడపనున్నారు.
11 రోజుల పాటు ఉత్సవాలు అనంతరం 28న గురువారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత స్వామివారి శోభాయాత్ర ప్రారంభం కానుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
గణేష్ నిమజ్జనం కోసం ప్రత్యేక ఎంఎంటీఎస్ సర్వీసులు
"Ganesh Nimarjanam MMTS Special Services" #MMTSSpecial #GaneshNimarjanam pic.twitter.com/e2zviU8xQY
— South Central Railway (@SCRailwayIndia) September 25, 2023