NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీకి జీవిత ఖైదు; అవధేష్ రాయ్ హత్య కేసులో శిక్ష ఖరారు 
    గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీకి జీవిత ఖైదు; అవధేష్ రాయ్ హత్య కేసులో శిక్ష ఖరారు 
    1/2
    భారతదేశం 1 నిమి చదవండి

    గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీకి జీవిత ఖైదు; అవధేష్ రాయ్ హత్య కేసులో శిక్ష ఖరారు 

    వ్రాసిన వారు Naveen Stalin
    Jun 05, 2023
    03:23 pm
    గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీకి జీవిత ఖైదు; అవధేష్ రాయ్ హత్య కేసులో శిక్ష ఖరారు 
    గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీకి జీవిత ఖైదు; అవధేష్ రాయ్ హత్య కేసులో శిక్ష ఖరారు

    అవధేష్ రాయ్ హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్-రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీకి ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలోని ప్రత్యేక ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు సోమవారం జీవిత ఖైదు విధించింది. అన్సారీని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు. సెక్షన్ 145, 302 అతన్ని దోషిగా నిర్ధారిస్తూ కోర్టు తీర్పు చెప్పిందని న్యాయవాది వికాష్ సింగ్ చెప్పారు. కోర్టు తీర్పుపై కాంగ్రెస్ నాయకుడు అజయ్‌రాయ్ స్పందిస్తూ.. 'ఈరోజు 32 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత గెలిచాం. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం, నాకు ఏమైనా జరిగితే ఆ బాధ్యత బీజేపీ ప్రభుత్వానిదే' అని పేర్కొన్నారు. అజయ్‌రాయ్ ఇంటి ముందే అవధేష్ రాయ్ ఈ హత్య జరిగింది.

    2/2

    ఆగస్ట్ 3, 1991న అవధేష్ రాయ్ హత్య

    ఆగస్ట్ 3, 1991న కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే అజయ్ రాయ్ సోదరుడు అవధేష్ రాయ్ వారణాసిలోని దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ కేసులో ముఖ్తార్ అన్సారీ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. మే 19న వాదనల అనంతరం విచారణను ముగించిన ప్రత్యేక న్యాయస్థానం, తన తీర్పును రిజర్వులో ఉంచింది. జూన్ 5న శిక్షను ఖరారు చేసింది. అవధేష్ రాయ్ హత్య కేసులో, అజయ్ రాయ్, ముఖ్తార్ అన్సారీ, భీమ్ సింగ్, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ కలీమ్‌లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ఉత్తరప్రదేశ్‌లోని మహమ్మదాబాద్ ప్రాంతంలో హత్యాయత్నానికి కుట్ర పన్నిన మరో కేసులో నిందితులుగా ఉన్న ముఖ్తార్ అన్సారీని మే 17న ఘాజీపూర్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    ఉత్తర్‌ప్రదేశ్
    హత్య

    ఉత్తర్‌ప్రదేశ్

    భారతదేశ చరిత్రలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలు ఇవే  రైలు ప్రమాదం
    బ్రిజ్‌ భూషణ్‌ కు యోగి సర్కార్ ఝలక్... ర్యాలీకి నో పర్మిషన్ యోగి ఆదిత్యనాథ్
    రెజ్లర్ల సమస్యలను చెప్పేందుకు రేపు రాష్ట్రపతి, అమిత్ షాను కలవాలని ఖాప్ నేతల నిర్ణయం  రెజ్లింగ్
    రేపు రెజ్లర్లకు మద్దతుగా యూపీలో రైతు నాయకుల సమావేశం  రెజ్లింగ్

    హత్య

    Delhi: సాక్షిని హత్య చేసేందుకు సాహిల్ ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు దిల్లీ
     సూరత్‌లో దారుణం; కూతురుని 25సార్లు కత్తితో పొడిచి హత్య చేసిన తండ్రి సూరత్
    దిల్లీ హత్య కేసులో ట్విస్ట్; ప్రియుడిని బొమ్మ తుపాకీతో బెదిరించిన బాలిక దిల్లీ
    16ఏళ్ల బాలికను కత్తితో పొడిచి చంపిన వ్యక్తి యూపీలో అరెస్ట్  దిల్లీ
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023