NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / గన్నవరం ఘర్షణ: రాజమండ్రి సెంట్రల్ జైలుకు టీడీపీ నేత పట్టాభి
    భారతదేశం

    గన్నవరం ఘర్షణ: రాజమండ్రి సెంట్రల్ జైలుకు టీడీపీ నేత పట్టాభి

    గన్నవరం ఘర్షణ: రాజమండ్రి సెంట్రల్ జైలుకు టీడీపీ నేత పట్టాభి
    వ్రాసిన వారు Naveen Stalin
    Feb 23, 2023, 10:14 am 1 నిమి చదవండి
    గన్నవరం ఘర్షణ: రాజమండ్రి సెంట్రల్ జైలుకు టీడీపీ నేత పట్టాభి
    గన్నవరం ఘర్షణ: రాజమండ్రి సెంట్రల్ జైలుకు టీడీపీ నేత పట్టాభి

    గన్నవరం ఘటనలో పోలీసుల అదుపులో ఉన్న టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిని న్యాయమూర్తి ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసులో పట్టుబడిన పట్టాభితోపాటు మరో పది మందిని గన్నవరం పోలీసులు ప్రత్యేక వాహనంలో బుధవారం రాత్రి 9.15 గంటలకు తీసుకొచ్చి వారికి అప్పగించినట్లు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎస్ రాజారావు తెలిపారు. అంతకుముందు అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆదేశాల మేరకు ప్రభుత్వాసుపత్రిలో పట్టాభికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యాధికారి శ్రీకాంత్ ఇచ్చిన నివేదికను పోలీసులు తిరిగి కోర్టుకు సమర్పించారు.

    'గన్నవరం సబ్ జైలులో అయితే శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం'

    పట్టాభి ఆరోగ్యం నిలకడగా ఉందని, రెండు అరచేతులకు చిన్న గాయాలు ఉన్నాయని వైద్య నివేదికలో పేర్కొన్నారు. ఆయితే గాయాలు 24 నుంచి 36 గంటల మధ్య అయి ఉండొచ్చని నివేదికలో వివరించారు. వైద్యుల నివేదికను పరిశీలించిన న్యాయమూర్తి పట్టాభిని రిమాండ్ నిమిత్తం గన్నవరం సబ్ జైలుకు తరలించాలని ఆదేశించారు. పోలీసులు అతడిని తీసుకెళ్లి జైలు అధికారులకు అప్పగించారు. అయితే గన్నవరం సబ్ జైలులో అయితే శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని పోలీసులు చెప్పగా, రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని ఆదేశించారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    గన్నవరం

    తెలుగు దేశం పార్టీ/టీడీపీ

    NTR: తెలుగునాట రాజకీయ ప్రభంజనం; ఎన్టీఆర్ పొలిటికల్ ప్రస్థానం సాగిందిలా నందమూరి తారక రామారావు
    రోడ్డు ప్రమాదంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికి తీవ్ర గాయాలు  ప్రకాశం జిల్లా
    రాజకీయాల్లోకి వైఎస్ వివేక కూతురు సునీత ఎంట్రీ ఇస్తున్నారా? కడపలో పోస్టర్లు వైరల్  కడప
    ఏపీలో ట్రోలింగ్ రాజకీయం: జగన్ స్టిక్కర్ తొలగించిన కుక్కపై పోలీసులకు టీడీపీ ఫిర్యాదు  ఆంధ్రప్రదేశ్

    గన్నవరం

    పట్టాభిని పోలీసులు చిత్రహింసలు పెట్టారా? జడ్జి ఎదుట టీడీపీ నేతలు హాజరు తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    '24గంటలుగా నా భర్త కనిపించడం లేదు'; టీడీపీ నేత పట్టాభి భార్య నిరసన తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ మధ్య ఘర్షణ: గన్నవరంలో హైటెన్షన్, పోలీసుల ఆంక్షలు వల్లభనేని వంశీ

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023