NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / '24గంటలుగా నా భర్త కనిపించడం లేదు'; టీడీపీ నేత పట్టాభి భార్య నిరసన
    భారతదేశం

    '24గంటలుగా నా భర్త కనిపించడం లేదు'; టీడీపీ నేత పట్టాభి భార్య నిరసన

    '24గంటలుగా నా భర్త కనిపించడం లేదు'; టీడీపీ నేత పట్టాభి భార్య నిరసన
    వ్రాసిన వారు Naveen Stalin
    Feb 21, 2023, 05:02 pm 0 నిమి చదవండి
    '24గంటలుగా నా భర్త కనిపించడం లేదు'; టీడీపీ నేత పట్టాభి భార్య నిరసన
    టీడీపీ సీనియర్ నేత పట్టాభి భార్య నిరసన

    గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మద్దతుదారులు గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి నేపథ్యంలో ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది. ఈ ఎపిసోడ్‌తో కృష్ణా జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. గన్నవరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనల జరగకుండా ఉండేందుకు పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో పలువురు నాయకులను అరెస్టు చేశారు. ఇదే సమయంలో టీడీపీ సీనియర్ నేత పట్టాభి రామ్ గత 24 గంటల నుంచి కనిపించడం లేదని ఆయన భార్య చందన నిరసనకు దిగారు. అనంతరం ఆమెను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

    నా భర్తకు ఏదైనా హాని జరిగితే సీఎం జగన్, డీజీపీలే బాధ్యత వహించాలి: చందన

    ఎమ్మెల్యే వంశీ అనుచరులు దాడి చేసిన టీడీపీ కార్యాలయాన్ని పరిశీలించేందుకు తన భర్త పట్టాభి బయటకు వచ్చారని చందన చెప్పారు. మార్గమధ్యంలో అతన్ని పోలీసులు అరెస్టు చేశారని, అయితే 24 గంటలు గడిచినా అతని ఆచూకీపై తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నారు. సోమవారం రాత్రి ఫిర్యాదు చేసినా పోలీసుల నుంచి ఎలాంటి సమాధానం రాలేదన్నారు. తన భర్తకు ఏదైనా హాని జరిగితే దానికి ఏపీ సీఎం జగన్, ఏపీ డీజీపీలే బాధ్యత వహించాలని చందన అన్నారు. పట్టాభి గన్నవరం పోలీస్ స్టేషన్‌లో ఉన్నట్లు సమచారం. ఈ క్రమంలో ఆమె పట్టాభిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ పోలీస్‌స్టేషన్‌ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    ఆంధ్రప్రదేశ్
    తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    గన్నవరం

    ఆంధ్రప్రదేశ్

    NTR: తెలుగునాట రాజకీయ ప్రభంజనం; ఎన్టీఆర్ పొలిటికల్ ప్రస్థానం సాగిందిలా నందమూరి తారక రామారావు
    అరకులోయ కాఫీ పంటకు ఆర్గానిక్ సర్టిఫికేట్, వివరాలివే  భారతదేశం
    గుడ్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ 1, 2 పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్  వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవానికి వెళ్లేందుకు ఆ రెండు పార్టీలు రెడీ  నరేంద్ర మోదీ

    తెలుగు దేశం పార్టీ/టీడీపీ

    రోడ్డు ప్రమాదంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికి తీవ్ర గాయాలు  ప్రకాశం జిల్లా
    రాజకీయాల్లోకి వైఎస్ వివేక కూతురు సునీత ఎంట్రీ ఇస్తున్నారా? కడపలో పోస్టర్లు వైరల్  కడప
    ఏపీలో ట్రోలింగ్ రాజకీయం: జగన్ స్టిక్కర్ తొలగించిన కుక్కపై పోలీసులకు టీడీపీ ఫిర్యాదు  ఆంధ్రప్రదేశ్
    సెల్ఫీ ఛాలెంజ్‌పై కౌంటర్; సుపరిపాలనపై చంద్రబాబుకు సవాల్ విసిరిన ఏపీ సీఎం జగన్  ఆంధ్రప్రదేశ్

    గన్నవరం

    గన్నవరం ఘర్షణ: రాజమండ్రి సెంట్రల్ జైలుకు టీడీపీ నేత పట్టాభి తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    పట్టాభిని పోలీసులు చిత్రహింసలు పెట్టారా? జడ్జి ఎదుట టీడీపీ నేతలు హాజరు తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ మధ్య ఘర్షణ: గన్నవరంలో హైటెన్షన్, పోలీసుల ఆంక్షలు వల్లభనేని వంశీ

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023