NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Armour Turmeric: ఆర్మూర్‌ ప్రాంతంలో పండే పసుపుకు జీఐ ట్యాగ్‌
    తదుపరి వార్తా కథనం
    Armour Turmeric: ఆర్మూర్‌ ప్రాంతంలో పండే పసుపుకు జీఐ ట్యాగ్‌
    ఆర్మూర్‌ ప్రాంతంలో పండే పసుపుకు జీఐ ట్యాగ్‌

    Armour Turmeric: ఆర్మూర్‌ ప్రాంతంలో పండే పసుపుకు జీఐ ట్యాగ్‌

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 23, 2025
    08:11 am

    ఈ వార్తాకథనం ఏంటి

    నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ ప్రాంతంలో పండే పసుపుకు భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్‌) త్వరలో రానుంది.

    ఈ ప్రాంత రైతులు దశాబ్దాలుగా పసుపును ప్రధాన పంటగా సాగు చేస్తున్నారు.

    ఆర్మూర్‌ పసుపు ప్రత్యేకతను గుర్తించి, జీఐ ట్యాగ్‌ కోసం నాబార్డ్‌ సహకారంతో శాస్త్రవేత్తలు బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు.

    ఈ పరిశీలనలో ఆర్మూర్‌ వాతావరణ పరిస్థితులు, భూమి లక్షణాలు, పసుపులో ఉండే ప్రత్యేక లక్షణాలు, సాగు చరిత్ర, డాక్యుమెంటరీ ఆధారాలపై వివరాలను సేకరించారు.

    శాస్త్రవేత్తలు స్వయంగా పొలాలను సందర్శించి, రైతుల నుంచి పసుపు రకాల విశిష్టతలను తెలుసుకున్నారు.

    వివరాలు 

    పసుపు డీఎన్‌ఏ ప్రొఫైలింగ్‌ చేపట్టి నమూనాల అధ్యయనం

    జీఐ ట్యాగ్‌ కోసం నాలుగు నెలల్లో చెన్నైలోని మేధోసంపత్తి హక్కుల కేంద్రానికి దరఖాస్తు చేస్తామని కొండా లక్ష్మణ్‌ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన కళాశాల అసోసియేట్‌ డీన్‌, ప్రధాన పరిశోధకుడు డాక్టర్‌ పిడిగం సైదయ్య తెలిపారు.

    ఈ ట్యాగ్‌ ద్వారా ఆర్మూర్‌ పసుపుకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో గౌరవం పెరగడమే కాకుండా, ఎగుమతులు పెరిగి, అధిక ధర పలుకుతుందని ఆయన పేర్కొన్నారు.

    త్వరలో పసుపు డీఎన్‌ఏ ప్రొఫైలింగ్‌ చేపట్టి నమూనాలను అధ్యయనం చేయనున్నట్టు తెలిపారు.

    ఈ బృందంలో కమ్మర్‌పల్లి పసుపు పరిశోధనా కేంద్రానికి చెందిన శాస్త్రవేత్తలు బీ మహేందర్‌, పీ శ్రీనివాస్‌, నాబార్డ్‌ డీడీ ప్రవీణ్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నిజామాబాద్

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    నిజామాబాద్

    నిజామాబాద్‌పై చంద్రబాబు ఫోకస్: మరో భారీ బహిరంగ సభకు ప్లాన్ చంద్రబాబు నాయుడు
    హైదరాబాద్‌లో విషాదం: వీధికుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి హైదరాబాద్
    నిజామాబాద్‌: మెడికల్ కాలేజీ హాస్టల్ గదిలో ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య భారతదేశం
    నిజామాబాద్ ఉగ్రవాద కుట్ర కేసు: పీఎఫ్‌ఐ వెపన్ ట్రైనర్‌ను అరెస్టు చేసిన ఎన్ఐఏ  ఎన్ఐఏ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025