Page Loader
బొట్టు పెట్టుకుని స్కూలుకు వెళ్తే టీచర్ కొట్టాడు.. మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య
బొట్టు పెట్టుకుని క్లాసులకు వెళ్తే టీచర్ కొట్టాడు.. మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య

బొట్టు పెట్టుకుని స్కూలుకు వెళ్తే టీచర్ కొట్టాడు.. మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 12, 2023
12:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

జార్ఖండ్ ధన్‌బాద్‌ పట్టణంలోని ఓ తరగతి గదిలో దారుణం జరిగింది. ఓ విద్యార్థిని పట్ల పాఠశాల ఉపాధ్యాయుడు ఉన్మాదిలా వ్యవహరించాడు. దీంతో మనస్తాపం చెందిన బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు స్థానిక పోలీసులు వెల్లడించారు. హిందూ సాంప్రదాయం మేరకు నుదుటిన బొట్టు పెట్టుకుని ఎప్పటిలాగే పాఠశాలకు వెళ్లింది. బొట్టును గమనించిన పాఠశాలలోని ఓ టీచర్ సదరు విద్యార్థినిపై విరుచుకుపడ్డాడు. ఇదే విషయాన్ని మృతురాలు సూసైడ్ నోట్ లో రాసినట్లు పోలీసులు గుర్తించారు. తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడటంపై మృతురాలి తల్లిదండ్రులు,స్థానికులు పాఠశాల వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అనంతరం యాజమాన్యానికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. ఈ క్రమంలోనే నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు ఛైల్డ్ వెల్ఫేర్ కమిషన్ ఛైర్మన్ ఉత్తమ్ ముఖర్జీ తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

టీచర్ కొట్టాడనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది : పోలీసులు