NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Karnataka Minister: 'నాకొక బాంబు ఇవ్వండి.. పాక్‌పై పోరాటానికి సిద్ధం' : కర్ణాటక మంత్రి
    తదుపరి వార్తా కథనం
    Karnataka Minister: 'నాకొక బాంబు ఇవ్వండి.. పాక్‌పై పోరాటానికి సిద్ధం' : కర్ణాటక మంత్రి
    'నాకొక బాంబు ఇవ్వండి.. పాక్‌పై పోరాటానికి సిద్ధం' : కర్ణాటక మంత్రి

    Karnataka Minister: 'నాకొక బాంబు ఇవ్వండి.. పాక్‌పై పోరాటానికి సిద్ధం' : కర్ణాటక మంత్రి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 03, 2025
    09:24 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పహల్గాం (Pahalgam)లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పాశవిక ఘటనతో భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ భగ్గుమన్నాయి.

    దాయాది దేశానికి గట్టి బుద్ధి చెప్పాలని ప్రజలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక మంత్రి బీజడ్ జమీర్ అహ్మద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

    పాకిస్థాన్‌ ఎప్పటికీ భారత్‌కు శత్రుదేశమే. అలాంటి దేశంతో మనకు సంబంధాలు అవసరం లేదు.

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా అనుమతి ఇవ్వగలిగితే.. పాక్‌పై యుద్ధానికి సిద్ధంగా ఉన్నాను. ఆత్మాహుతికి నాకొక బాంబు ఇవ్వండంటూ ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.

    అంతకుముందు పహల్గాం దాడిని ఖండించిన మంత్రి, ఇది అత్యంత హేయమైన చర్య అని చెప్పారు.

    Details

    దేశమంతా ఏకమై పోరాడాలి

    ఇలాంటి ఉగ్రవాద చర్యలపై దేశం మొత్తం ఏకమై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

    పాక్ భూభాగంపై భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌పై కాంగ్రెస్ ఎంపీ చరణ్‌జీత్ సింగ్ చన్నీ అనుమానాలు వ్యక్తం చేశారు. దాడులకు సంబంధించి ఆధారాలు చూపాలని డిమాండ్‌ చేశారు.

    దీనిపై ఢిల్లీ మంత్రి మజీంద్ సింగ్ సిర్సా ఘాటుగా స్పందిస్తూ, 'మన సైన్యం సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయడం సరికాదు. ఆధారాల కోసం అనుకుంటే పాకిస్థాన్‌కు వెళ్లి చెక్ చేసుకోవచ్చని విమర్శించారు.

    బీజేపీ నుంచి తీవ్ర స్పందన రావడంతో చరణ్‌జీత్ వెనక్కి తగ్గారు. తాను ఆధారాలు అడగలేదని స్పష్టీకరణ ఇచ్చారు. కేంద్రం తీసుకునే ఏ చర్యకైనా కాంగ్రెస్‌ మద్దతుగా ఉంటుందని పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్ణాటక
    ఇండియా

    తాజా

    GT vs LSG: గుజరాత్ టైటాన్స్‌పై లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ 33 పరుగుల తేడాతో విజయం ఐపీఎల్
    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌

    కర్ణాటక

    Belagavi: మహారాష్ట్ర- కర్ణాటక సరిహద్దులోని బెళగావిపై మరోసారి వివాదం.. మహారాష్ట్ర
    Renukaswamy murder case: కన్నడ సినీ నటుడు దర్శన్, పవిత్ర గౌడకు బెయిల్ మంజూరు సినిమా
    Bengaluru: నా భర్త పెంపుడు పిల్లిపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాడు.. గృహహింస కేసు పెట్టిన భార్య.. భారతదేశం
    Tulsigowda: వృక్ష ప్రేమికురాలు తులసిగౌడ ఇకలేరు ఇండియా

    ఇండియా

    AP: వాతావరణ శాఖ హెచ్చరిక.. ఆ జిల్లాలకు పిడుగుల ముప్పు! ఆంధ్రప్రదేశ్
    Reciprocal tariffs: అమెరికా 27శాతం సుంకాలు.. వాణిజ్యశాఖ అధికారిక స్పందన! భారతదేశం
    Maoists: 'ఆపరేషన్ చేయూత' ఫలితం.. లొంగిపోయిన 86 మంది మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్
    Kunal Kamra: కునాల్ కమ్రాకు బిగ్ షాక్.. బుక్ మై షో జాబితా నుంచి తొలగింపు మహారాష్ట్ర
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025